Macha Bollaram: రైల్వే బ్రిడ్జ్ శంకుస్థాపన కార్యక్రమంలో రసాభాస
Macha Bollaram (imagecredit:swetcha)
Telangana News, హైదరాబాద్

Macha Bollaram: రైల్వే బ్రిడ్జ్ పనుల శంకుస్థాపన కార్యక్రమంలో రసాభాస.. స్టేజ్‌పైనే ఎంపీ ఈటల రాజేందర్, ఎమ్మెల్యే వర్గాలమధ్య ఘర్షణ..!

Macha Bollaram: మచ్చ బొల్లారంలో రైల్వే అండర్ బ్రిడ్జ్(Railway underbridge) పనుల శంకుస్థాపన కార్యక్రమం ఉద్రిక్తతగా మారింది. శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న మల్కాజ్‌గిరి ఎంపీ ఈటల రాజేందర్(MP Etela Rajender), మల్కాజ్‌గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి(MLA Marri Rajasekhar Reddy)ల మధ్య స్టేజ్‌పైనే ఘర్షణ వాతావరణం నెలకొంది. ఈ ఘటనతో అక్కడున్న బీజేపీ(BJP), బీఆర్‌ఎస్(BRS) నాయకులు ఒక్కసారిగా రెండు వర్గాలుగా విడిపోయి వాగ్వాదాలకు దిగారు.

పరస్పరం ఆరోపణలు

రైల్వే అండర్ బ్రిడ్జ్ పనులకు సంబంధించిన నిధులను తామే తీసుకువచ్చామని ఇరు పార్టీల నేతలు పరస్పరం ఆరోపణలు చేసుకున్నారు. ఈ క్రమంలో నినాదాలు, తోపులాట చోటుచేసుకోవడంతో కార్యక్రమ ప్రాంగణం ఒక్కసారిగా గందరగోళంగా మారింది. కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన నిధులతో చేపట్టిన అభివృద్ధి పనులను తమ కృషిగా ప్రచారం చేస్తూ ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి(MLA Marri Rajasekhar Reddy) పేరు మీద బ్యానర్లు ఏర్పాటు చేయడం వల్లే వివాదం తలెత్తినట్లు తెలుస్తోంది. పరిస్థితి చేయి దాటుతుండటంతో వెంటనే పోలీసులు రంగంలోకి దిగి ఇరువర్గాల నాయకులను చెదరగొట్టి ఘర్షణను అదుపులోకి తీసుకువచ్చారు. ఈ ఘటనతో శంకుస్థాపన కార్యక్రమం కొద్దిసేపు నిలిచిపోయింది.

Also Read: PSLV C62 Satellites: ప్రయోగం ఫెయిల్ కావడంతో 16 ఉపగ్రహాలు ఏమయ్యాయి?.. శాస్త్రవేత్తలు ఏం చెబుతున్నారంటే?

Just In

01

Allu Arjun: జపాన్‌లో అడుగుపెట్టిన పుష్పరాజ్.. ‘పుష్ప కున్రిన్’ కుమ్మేస్తుందా?

Hydra: హైడ్రా ప్రజావాణికి ఒక్కరోజే 76 ఫిర్యాదులు.. నేరుగా స్వీకరించిన కమిషనర్ రంగనాథ్!

Germany Good News: భారతీయులకు జర్మనీ గుడ్‌న్యూస్.. ఇకపై వీసా లేకుండానే కీలక సర్వీసు

Prabhas Emotion: ‘ది రాజాసాబ్’లో ఈ సీన్ చూస్తే ప్రభాస్ ఫ్యాన్స్ తట్టుకోలేరు.. ఏడిపించేశాడు భయ్యా

GHMC: గ్రేటర్‌లో ఈ-వేస్ట్ మెగా శానిటేషన్ డ్రైవ్ ప్రారంభం.. ఐటీ ప్రాంతాల, ఆ షాపులపై జీహెచ్ఎంసీ ఫోకస్!