Unwanted Hair: అవాంఛిత రోమాలు, స్త్రీ పురుషులిద్దరికీ ఒక సాధారణ సమస్య. కొందరికి ముఖంపై, ఛాతీపై, చేతులపై, కాళ్ళపై ఎక్కువగా రోమాలు పెరుగుతాయి. ఇది వారి ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తుంది. అసలు ఈ అవాంఛిత రోమాలకు కారణాలేమిటి? పరిష్కారాలేమున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.
కారణాలు:
హార్మోన్ల మార్పులు: యుక్తవయస్సు, గర్భధారణ, రుతుక్రమం ఆగిపోవడం వంటి సమయాల్లో హార్మోన్ల స్థాయిల్లో మార్పులు అవాంఛిత రోమాలకు దారితీస్తాయి. ముఖ్యంగా, ఆండ్రోజెన్ అనే హార్మోన్ ఎక్కువగా ఉత్పత్తి కావడం వల్ల రోమాలు ఎక్కువగా పెరుగుతాయి.
వంశపారంపర్యం: కొందరికి కుటుంబంలో ఎవరికైనా ఎక్కువగా రోమాలుంటే, వారి పిల్లలకు కూడా ఆ సమస్య వచ్చే అవకాశం ఉంది.
కొన్ని వ్యాధులు: పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ (PCOS), కుషింగ్స్ సిండ్రోమ్ వంటి కొన్ని వ్యాధులు కూడా అవాంఛిత రోమాలకు కారణమవుతాయి.
మందులు: కొన్ని రకాల మందులు, ఉదాహరణకు స్టెరాయిడ్స్, రోమాల పెరుగుదలను ప్రేరేపిస్తాయి.
అధిక బరువు: అధిక బరువు ఉన్నవారిలో కూడా అవాంఛిత రోమాలు ఎక్కువగా కనిపిస్తాయి
Unwanted Hair: ప్రస్తుత కాలంలో మహిళలను వేధిస్తున్న సమస్య అవాంఛిత రోమాలు. ఈ అవాంఛిత రోమాల వల్ల ముఖం అందవికారంగా కనిపిస్తుంటుంది. వయసు పెరిగేకొద్దీ ఈ రోమాలు కూడా ఎక్కువ అవుతాయి. మెడికల్ భాషలో చెప్పాలంటే వీటిని హిర్సుటిస్మ్ అని పిలుస్తారు. అయితే చిన్న చిట్కాలు పాటిస్తే వీటిని పూర్తిగా తొలగించుకోవచ్చని నిపుణులు అంటున్నారు. ముందుగా పాలలో పసుపు వేసి కలిపి ఈ మిశ్రమాన్ని అవాంఛిత రోమాలు ఉన్న చోట రాసి 20 నిమిషాల తర్వాత వేడి నీటితో కడిగేసినట్లైతే రోమాలన్నీ తొలగిపోతాయి. ఒక అరటిపండు గజ్జు, రెండు స్పూన్ల ఓట్ మీల్ కలిపి ముఖానికి పట్టించాలి, కాసేపు మర్దనా చేసుకోవాలి.
నువ్వుల నూనె కానీ వేరుశనగ నూనెను కానీ ఈ అవాంఛిత రోమాలపై రాసి మర్దనా చేసుకోవాలి. ఆ తర్వాత మెత్తటి శెనగపిండి రాసి నలుగులా పెట్టుకోవాలి. వారానికి రెండుసార్లు ఇలా చేయడం వల్ల రోమాలు పోతాయి. స్నానం చేసేటప్పుడు ఫేస్కు పసుపు రాసి కడుక్కుంటే కూడా మంచి ఫలితం ఉంటుంది. కోడిగుడ్డు తెల్లసొనలో ఒక స్పూన్ మొక్కజొన్న పొడి కలిపి ముఖానికి రాసి ఆరిన తర్వాత నీళ్లతో కడిగితే అవాంఛిత రోమాలు తొందరగా పోతాయి. పసుపు, శెనగపిండి రెంటిని సమపాళ్లలో కలిపి ముఖానికి పెట్టుకుని తర్వాత కడుక్కుంటే రోమాల పెరుగుదలను ఆపవచ్చని నిపుణులు చెబుతున్నారు. మనం తీసుకునే ఆహారంలో ఫైటో ఈస్ట్రోజన్స్ ఉండేలా చూస్తే అసలు ఈ హార్మోన్ల సమస్యే రాదంటున్నారు. మన ఆహారంలో అవిశ గింజలు, నువ్వులు, పొద్దుతిరుగుడు గింజలు, సోయా, వెల్లుల్లి, ఎండు ఖర్జూర ఉండేలా చూసుకోవాలని నిపుణులు అంటున్నారు.