CM Revanth Reddy: సుజన్ మెడికేర్ ఫ్లూయిడ్స్ యూనిట్ ప్రారంభం
CM Revanth Reddy (imagecredit:swetcha)
Telangana News, హైదరాబాద్

CM Revanth Reddy: సుజన్ మెడికేర్ ఫ్లూయిడ్స్ యూనిట్ ప్రారంభోత్సవంలో.. సీఎం కీలక వ్యాఖ్యలు..!

CM Revanth Reddy: నిరంతర శ్రమ వాళ్లే హైదరాబాద్ ప్రపంచ నగరాలతో పోటీ
-క్యూర్, ప్యూర్, రేర్ మూడు భాగాలుగా తెలంగాణ అభివృద్ధి
-గ్లోబల్ సమ్మిట్ ద్వారా తెలంగాణ పాలసీ డాక్యుమెంట్ విడుదల
-సుజెన్ మెడికేర్ ఫ్లూయిడ్స్ తయారీ యూనిట్ ప్రారంభోత్సవంలో… సీఎం రేవంత్ రెడ్డి
రంగారెడ్డి బ్యూరో, స్వేచ్ఛ: 1995 నుంచి 2025 వరకు 30 ఏళ్ల నిరంతర శ్రమ వల్లే హైదరాబాద్(Hyderabad) ప్రపంచ నగరాలతో పోటీ పడగలుగుతోందన్నారు. రంగారెడ్డి(Rangareddy) జిల్లా మహేశ్వరం మండలం రావిర్యాల ఈ-సిటీలో సుజెన్ మెడికేర్ ఫ్లూయిడ్స్ తయారీ యూనిట్ను శుక్రవారం సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన సభలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. జర్మన్ టెక్నాలజీతో దక్షిణ భారత దేశంలోనే ఐవీ ఫ్లూయిడ్స్ తయారీలో గొప్ప సంస్థను ఏర్పాటు చేయడం అభినందనీయం అన్నారు. తెలంగాణ రైజింగ్ 2047 విజన్ లో భావనగా సుజెన్ మెడికేర్ తయారీ యూనిట్ ఏర్పాటు చేయడం సంతోషం, గ్లోబల్ సమ్మిట్ ద్వారా తెలంగాణ పాలసీ డాక్యుమెంట్ ను విడుదల చేశామని తెలిపారు. క్యూర్, ప్యూర్, రేర్ మూడు భాగాలుగా తెలంగాణ అభివృద్ధి ఉంటుందని అన్నారు.

దేశంలో ఉత్పత్తి చేసే బల్క్ డ్రగ్స్

2034 నాటికి 1 ట్రిలియన్ డాలర్ ఎకానమిగా, 2047 నాటికి 3 ట్రిలియన్ ఎకానమిగా తెలంగాణ(Telangana)ను తీర్చిదిద్దాలని లక్ష్యంగా పెట్టుకున్నామని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఆర్ధిక వ్యవస్థ క్యూర్, ప్యూర్ పై ఆధారపడి ఉంటుందని అన్నారు. ప్రపంచంలోని గొప్ప నగరాలతో తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్ పోటీ పడుతోందని అన్నారు. జర్మనీ, జపాన్, సౌత్ కొరియా, న్యూయార్క్ లతో తెలంగాణ పోటీ పడుతోందని అన్నారు. అందులో భాగంగా యువ పారిశ్రామిక వేత్తలు ప్రారంభించే పరిశ్రమలను ప్రోత్సహిస్తున్నామని అన్నారు. దేశంలో ఉత్పత్తి చేసే బల్క్ డ్రగ్స్ లో 40 శాతం తెలంగాణ నుంచి ఉత్పత్తి అవుతున్నాయని అన్నారు. ప్రపంచమే మనవైపు చూసేలా ఫార్మా రంగంలో రాణిస్తున్నామని, మన దగ్గర చదువుకుని వెళ్లిన వారు గ్లోబల్ కంపెనీలకు సీఈవోలుగా ఉన్నారని తెలిపారు. ఇది మనకు ఎంతో గర్వకారణం, నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలంటే ప్రైవేట్ రంగంలో పెట్టుబడులను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని అన్నారు.

Also Read: Swetcha Effect: స్వేచ్ఛ కథనంతో కదిలిన టూరిజం శాఖ.. ఉద్యోగుల వివరాలపై ఎండీ ఆరా!

పంచాయతీ కంటే నీళ్ళే ముఖ్యం

తెలంగాణ రాష్ట్రానికి పంచాయితీ కావాలా? నీళ్లు కావాలా? అని అడిగితే నేను నీళ్లే కావాలని కోరుకుంటానని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. వివాదం కావాలా? పరిష్కారం కావాలా? అని అడిగితే పరిష్కారం కావాలని కోరుకుంటానని స్పష్టంగా సీఎం చెప్పారు. నీళ్ల వివాదం ముసుగులో రాజకీయ లబ్ది పొందాలన్న ఆలోచన కాంగ్రెస్ పార్టీకి లేదని రాజకీయాలకు అతీతంగా పరిష్కారం కోసం అందరూ సహకరించాలని పార్టీలను విజ్ఞప్తి చేస్తున్నాని అన్నారు. మన సమస్యలను సామరస్యంగా పరిష్కరించుకుందాం ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఈ వేదికగా విజ్ఞప్తి చేస్తున్నా కృష్ణా నదిపై ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న ప్రాజెక్టుల అనుమతులు అడ్డంకులు పెట్టకండి అడ్డంకులతో కేంద్ర ప్రభుత్వ నిధులు రావడంలేదని అన్నారు. రాష్ట్రంపై ఆర్ధిక భారం పడుతోందని, మేం వివాదం కోరుకోవడంలేదు, పరిష్కారం కోరుకుంటున్నామని తెలిపారు. రాజకీయ ప్రయోజనాలు కాదు ప్రజల ప్రయోజనాల కోసం, రైతుల ప్రయోజనాల కోసం ఆలోచిస్తున్నామని అన్నారు.

పరస్పర సహకారమే కోరుకుంటున్నాము

తెలంగాణకు పోర్టు కనెక్టివిటీ రావాలంటే పక్క రాష్ట్రం సహకారం ఉండాలి అన్నారు. రెండు రాష్ట్రాలు పరస్పరం సహకరించుకుంటే సమస్యలు పరిష్కారం అవుతాయి ఇందుకోసం పక్క రాష్ట్రంతో చర్చలు కొనసాగుతాయని వివరించారు. పక్క రాష్ట్రాలతో మేం వివాదాలు కోరుకోవడం లేదని అది ఏపీ అయినా, కర్ణాటక అయినా, తమిళనాడు అయినా, మహారాష్ట్ర అయినా పరస్పర సహకారమే కోరుకుంటున్నాము అన్నారు. రాబోయే పదేళ్లల్లో భారత్ ఫ్యూచర్ సిటీలో ఉంటున్నామని గర్వంగా చెప్పుకునేలా అభివృద్ధి చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, రాష్ట్ర పరిశ్రమలు & ఐటీ శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు, శాసన మండలి ప్రభుత్వ చీఫ్ విప్ డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి, టీజీ ఐఐసీ చైర్మన్ టి.నిర్మల జగ్గారెడ్డి , చేవెళ్ల ఎంపీ కొండ విశ్వేశ్వర్ రెడ్డి, మాజీ జిల్లా పరిషత్ చైర్ పర్సన్ లు పట్నం సునీత మహేందర్ రెడ్డి, తీగల అనిత హరినాథ్ రెడ్డి, ఎమ్మెల్యేలు ప్రకాష్ గౌడ్, మల్ రెడ్డి రంగారెడ్డి, కాలే యాదయ్య, జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి, టిజిఐఐసి వైస్ ఎండి శశాంక (ఐఏఎస్), డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ డైరెక్టర్ జనరల్ షహనావాజ్ ఖాసీం, టీయూఎఫ్ఐడిసి ఛైర్మన్ చల్లా నర్సింహా రెడ్డి, రాష్ట్ర గ్రంధాలయ సంస్థ ఛైర్మన్ మధుసూదన్ రెడ్డి, మనిషారెడ్డి, హిమదీప్ రెడ్డి రినీష్ రెడ్డి, శ్యాంసుందర్ రెడ్డి, యాదగిరిరెడ్డి, బుచ్చిరెడ్డి, సురేష్,రంజిత్ రెడ్డి సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Also Read: Jupally Krishna Rao: భక్తులకు గుడ్ న్యూస్.. సింగోటం జాతరకు పకడ్బందీ ఏర్పాట్లు: మంత్రి జూపల్లి కృష్ణారావు

Just In

01

Jana Sena: జనసేన ఊహించని నిర్ణయం.. తెలంగాణ మునిసిపల్ ఎన్నికల్లో పోటీకి సై

Ponguleti Srinivas Reddy: జర్నలిస్టులకు గుడ్ న్యూస్.. గతం కంటే ఎక్కువ అక్రిడిటేషన్ కార్డులు

Cyber Fraud: రిటైర్డ్ ఐపీఎస్​ భార్యకు సైబర్ మోసగాళ్ల టోకరా.. ఎంత పని చేశార్రా!

Heavy Traffic: హైదరాబాద్ టు విజయవాడ నేషనల్ హైవేపై వాహనాల రద్దీ.. డ్రోన్ కెమెరాలతో పోలీసులు పర్యవేక్షణ

Romeo Juliet Rule: రోమియో జూలియెట్ రూల్.. ‘పోక్సో’ దుర్వినియోగంపై కేంద్రానికి సుప్రీంకోర్టు కీలక సూచన