EC on RUPPS: తెలంగాణలో నమోదై గుర్తింపు లేని రాజకీయ పార్టీలకు (Registered Unrecognised Political Parties – RUPPs) రాష్ట్ర ఎన్నికల కమిషన్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. ఆర్థిక నివేదికలను నిర్ణీత గడువుల్లోగా సమర్పించకపోతే చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సి. సుదర్శన్ రెడ్డి హెచ్చరించారు. గత ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన విరాళాల నివేదికలను వెంటనే సమర్పించాలని ఆదేశించారు.
ప్రతి ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన విరాళాల నివేదికలను రాజకీయ పార్టీలు.. రాష్ట్ర ఎన్నికల కమిషన్ కు సమర్పించాల్సి ఉంటుంది. ఆడిట్ చేసిన వార్షిక ఖాతాలను ఆదాయపన్ను రిటర్న్ గడువు ముగిసిన తేదీ నుంచి ఒక నెలలోపు అందించాలు. అలాగే శాసనసభ ఎన్నికల తర్వాత 75 రోజుల్లో, లోక్సభ ఎన్నికల తర్వాత 90 రోజుల్లోగా ఎన్నికల ఖర్చుల నివేదికలను సమర్పించాల్సి ఉంటుందని ఎన్నికల అధికారి సి. సుదర్శన్ రెడ్డి తెలిపారు.
Also Read: CM Chandrababu: నీళ్లా, గొడవలా అంటే.. గొడవలే కావాలంటున్నారు.. జగన్పై చంద్రబాబు ఫైర్!
ప్రజాప్రాతినిధ్య చట్టం, 1951లోని సెక్షన్ 29సీ ప్రకారం ఇవి ఆదాయపన్ను మినహాయింపులకు అర్హత పొందేందుకు తప్పనిసరిగా ఉండాలని సుదర్శన్ రెడ్డి స్పష్టం చేశారు. నిర్దేశిత గడువులు దాటిన తర్వాత వచ్చిన విరాళాల నివేదికలను సెక్షన్ 29సీ(3) ప్రకారం ఎలాంటి ప్రయోజనానికీ స్వీకరించబోమని స్పష్టం చేశారు. ఈ సూచనలు ఎన్నికల కమిషన్ పారదర్శకత మార్గదర్శకాలు, సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు జారీ చేసినవని పేర్కొన్నారు. ఇప్పటికే అనేక RUPPs ఆర్థిక నివేదికలను సమర్పించకపోవడం లేదా ఆలస్యంగా సమర్పించడం తన దృష్టికి వచ్చిందని సుదర్శన్ రెడ్డి తెలిపారు.

