Ayurveda Doctors: ఆయుర్వేద డాక్టర్లకు 58 సర్జరీలు చేసే అనుమతి
Ayurveda Doctors ( Image Source: Twitter)
ఆంధ్రప్రదేశ్

Ayurveda Doctors: ఆంధ్రప్రదేశ్‌లో ఆయుర్వేద వైద్యులకు పెద్ద ఊరట.. 58 శస్త్రచికిత్సలకు అధికారిక అనుమతి

 Ayurveda Doctors: ఆయుర్వేదాన్ని ఆధునిక వైద్యంతో సమన్వయం చేయాలనే లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అర్హత కలిగిన ఆయుర్వేద వైద్యులు స్వతంత్రంగా శస్త్రచికిత్సలు నిర్వహించేందుకు అనుమతిస్తూ రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ నిర్ణయం రాష్ట్ర ఆరోగ్య రంగంలో ఒక ముఖ్యమైన మార్పుగా భావిస్తున్నారు.

ఈ ప్రతిపాదనకు ఆరోగ్యం, వైద్య విద్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి వై. సత్యకుమార్ యాదవ్ డిసెంబర్ 23న ఆమోదం తెలిపారు. ఈ నిర్ణయం Indian Medicine Central Council (PG Ayurveda Education) సవరణ నిబంధనలు–2020 మరియు NCISM మార్గదర్శకాలకు అనుగుణంగా తీసుకున్నదని అధికారులు తెలిపారు.

Also Read: Razor Title Glimpse: రవిబాబు కొత్త సినిమా టైటిల్ గ్లింప్స్ చూశారా?.. ఏంటి భయ్యా మరీ ఇంత బ్రూటల్‌గా ఉంది..

ఈ నిర్ణయం ప్రకారం, శస్త్రచికిత్స విభాగాల్లో పీజీ పూర్తి చేసిన ఆయుర్వేద వైద్యులు మొత్తం 58 రకాల సర్జరీలు చేయవచ్చు. వీటిలో Shalya Tantra (జనరల్ సర్జరీ) కింద 39, అలాగే Shalakya Tantra కింద కంటి, చెవి, ముక్కు, గొంతు, దంత సమస్యలకు సంబంధించిన 19 శస్త్రచికిత్సలు ఉన్నాయి. అనుమతిచ్చిన శస్త్రచికిత్సల్లో గాయాల నిర్వహణ, కుట్లు వేయడం, పైల్స్, ఆనల్ ఫిషర్స్ చికిత్స, సిస్టులు–ట్యూమర్లు తొలగింపు, కాటరాక్ట్ సర్జరీలు, ప్రమాదాల్లో దెబ్బతిన్న కణజాల తొలగింపు, ఎముకలు–కండరాలకు సంబంధించిన చికిత్సలు, స్కిన్ గ్రాఫ్టింగ్ వంటి విధానాలు ఉన్నాయి.

Also Read: Uttam Kumar Reddy: పదేళ్లలో ఒక్క ప్రాజెక్టు పూర్తి చేశారా? తీవ్రస్థాయిలో మండిపడ్డ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి!

ఈ నిర్ణయంపై మంత్రి సత్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ, శిక్షణ పొందిన ఆయుర్వేద వైద్యులు తమ నైపుణ్యాలను పూర్తిగా ఉపయోగించుకునేలా చేయడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. అలాగే విజయవాడలోని డా. ఎన్ఆర్ఎస్ ప్రభుత్వ ఆయుర్వేద కళాశాలలో Shalya, Shalakya పీజీ కోర్సులు ప్రారంభించి, పూర్తి స్థాయి ఆపరేషన్ థియేటర్లు, శస్త్ర పరికరాలు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ చర్యతో రాష్ట్రంలో సాంప్రదాయ వైద్యం–ఆధునిక చికిత్సల మధ్య బలమైన అనుసంధానం ఏర్పడుతుందని అధికారులు భావిస్తున్నారు.

Just In

01

AP Govt: సినిమా టికెట్ల ధరపై ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం

AV Ranganath: పతంగుల పండగకు చెరువులను సిద్ధం చేయాలి.. అభివృద్ధి ప‌నుల‌ను ప‌రిశీలించిన హైడ్రా క‌మిష‌న‌ర్‌!

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలకంగా మారిన పెన్ డ్రైవ్.. ఆధారాలతో ప్రభాకర్ రావుపై సిట్ ప్రశ్నల వర్షం!

Vivek Venkatswamy: గ్రామాల అభివృద్ధి కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం : మంత్రి వివేక్ వెంకటస్వామి!

Anasuya: అతనిది చేతగానితనం.. శివాజీకి అనసూయ స్ట్రాంగ్ కౌంటర్