YS Jagan: వైఎస్ జగన్‌కు అస్వస్థత.. ఇడుపులపాయ పర్యటన రద్దు
YS Jagan (Image Source: twitter)
ఆంధ్రప్రదేశ్

YS Jagan: వైఎస్ జగన్‌కు అస్వస్థత.. ఇడుపులపాయ పర్యటన రద్దు.. ఆందోళనలో కార్యకర్తలు!

YS Jagan: ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ (YSRCP) అధినేత వై.ఎస్ జగన్ మోహన్ రెడ్డి (YS Jagan Mohan Reddy) అస్వస్థతకు గురయ్యారు. జ్వరంతో ఆయన బాధపడుతున్నట్లు వైసీపీ పార్టీ తెలిపింది. డాక్టర్ల సూచన మేరకు నేడు పులివెందులలో తలపెట్టిన పర్యటనను ఆయన రద్దు చేసుకున్నట్లు స్పష్టం చేసింది. అయితే జగన్ అనారోగ్యం వార్తలు తెలిసి పార్టీ కార్యకర్తలు ఆందోళన చెందుతున్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నారు.

ఇదిలా ఉంటే జగన్ పులివెందుల పర్యటనకు సంబంధించిన షెడ్యూల్ వైసీపీ ముందే ప్రకటించింది. ఉదయం 10.30 గం.లకు పులివెందుల నుంచి ఇడుపులపాయ చేరుకొని ప్రేయర్ హాల్ లో జరిగే ప్రత్యేక ప్రార్థనల్లో జగన్ పాల్గొంటారని వైసీపీ తెలిపింది. మధ్యాహ్నం ఒంటిగంటకు ఇడుపులపాయ నుంచి బయలుదేరి భాకరాపురం క్యాంప్ ఆఫీసులో ప్రజాదర్భార్ నిర్వహిస్తారని స్పష్టం చేసింది. రాత్రికి అక్కడి నివాసంలో జగన్ బస చేస్తారని వివరించింది. అయితే జగన్ అనారోగ్యం కారణంగా ఈ కార్యక్రమాలన్నీ రద్దు కావడం గమనార్హం.

Also Read: Telugu Songs: 2025 టాలీవుడ్ మ్యూజిక్ ధమాకా.. యూట్యూబ్‌ను షేక్ చేసిన టాప్ 10 సాంగ్స్ ఇవే!

మరోవైపు క్రిస్మస్ రోజుకు సంబంధించిన జగన్ షెడ్యూల్ ను సైతం వైసీపీ ప్రకటించింది. దీని ప్రకారం ఉదయం 8.30 గం.లకు సీఎస్ఐ చర్చిలో జరిగే క్రిస్మస్ వేడుకల్లో జగన్ పాల్గొంటారు. అనంతరం 10.30 గం.లకు పులివెందుల నుంచి తిరుగు ప్రయాణం అవుతారు.

Also Read: Telugu Songs: 2025 టాలీవుడ్ మ్యూజిక్ ధమాకా.. యూట్యూబ్‌ను షేక్ చేసిన టాప్ 10 సాంగ్స్ ఇవే!

Just In

01

Ranga Reddy District: పట్టా భూములను కబ్జా చేస్తున్న బిల్డర్లు.. కోర్టు కేసులను లెక్కచేయకుండా బరితెగింపులు!

Singireddy Niranjan Reddy: పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల కోసం 27 వేల ఎకరాలు భూసేకరణ చేశాం : సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి!

AP Govt: సినిమా టికెట్ల ధరపై ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం

AV Ranganath: పతంగుల పండగకు చెరువులను సిద్ధం చేయాలి.. అభివృద్ధి ప‌నుల‌ను ప‌రిశీలించిన హైడ్రా క‌మిష‌న‌ర్‌!

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలకంగా మారిన పెన్ డ్రైవ్.. ఆధారాలతో ప్రభాకర్ రావుపై సిట్ ప్రశ్నల వర్షం!