SP Balasubrahmanyam: తెలుగు సంగీత ప్రపంచంలో కోట్లాది ప్రేక్షకుల మనసును గెలుచుకున్న గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం(SP Balasubrahmanyam). ఆయన పాటలతో సంగీత ప్రియులకు ఊపిరి పోశారు. అప్పటి హీరోల నుంచి నేటి తరం వరకు ఆయన తెలియని వారు లేరు. తెలుగుతో పాటు బాషల్లో ఆయన గాత్రంలో ఎందరో అభిమానులను సొంతం చేసుకున్న ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహవిష్కరణకు హైదరాబాద్ రవీంద్ర భారతీ(Hyderabad Ravindra Bharathi) సిద్ధమైంది. ఈ నెల 15న సీఎం రేవంత్ రెడ్డి, భారత మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు(Venkaiah Naidu) ఈ కార్యక్రమానికి హాజరై, బాలు విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు.
Also Read: Room Heater Safety: కొత్త హీటర్ కొనుగోలు చేసే ముందు తప్పక తెలుసుకోవాల్సిన ప్రభుత్వ సూచనలివే!
ది మ్యూజిక్ గ్రూప్ కల్చరల్ అసోసియేషన్
అదే రోజు సాయంత్రం 4 గంటలకు ‘సినీ సంగీత స్వరనీరాజనం’ అనే ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేయనున్నారు. ఇందులో ప్రముఖ గాయనీ, గాయకులు పాల్గొనున్నారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం పాడిన పాటలను ఆలపించనున్నారు. ఈ కార్యక్రమాన్ని ది మ్యూజిక్ గ్రూప్ కల్చరల్ అసోసియేషన్(The Music Group Cultural Association) ఆధ్వర్యంలో నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు పాల్గొని, బాలు కాస్య విగ్రహానికి నివాళులర్పించనున్నారు.

