Telangana Power: నష్టాలతో కొట్టుమిట్టాడుతున్న విద్యుత్ సంస్థలు
Telangana Power (imagecredit:twitter)
Telangana News, హైదరాబాద్

Telangana Power: ఆర్థిక నష్టాల ఊబిలో కొట్టుమిట్టాడుతున్న విద్యుత్ సంస్థలు.. మళ్లీ చార్జీల పెంచేనా..!

Telangana Power: రాష్ట్రంలోని డిస్కంలు అప్పుల ఊబిలో కూరుకుపోయాయి. విద్యుత్ సంస్థలు ఆర్థిక నష్టాలతో కొట్టుమిట్టాడుతున్నాయి. ఈ ఏడాది మార్చి 31 నాటికి ఈ నష్టాలు రూ.68,670.83 కోట్లకు చేరుకున్నాయి. ఇందులో ఎస్పీడీసీఎల్ రూ.40,686 కోట్ల నష్టాల్లో ఉండగా, ఎన్పీడీసీఎల్ నష్టాలు రూ.18,985 కోట్లుగా ఉన్నాయి. ప్రతి ఏటా ఈ నష్టాలు ఏటేటా పెరగడమే తప్ప ఏమాత్రం తగ్గడంలేదు. తెలంగాణ ఏర్పాటయ్యే నాటికి రూ.842.24 కోట్ల నష్టాల్లో విద్యుత్ సంస్థలు ఉన్నాయి. స్వరాష్ట్ర ఏర్పాటు తర్వాత విద్యుత్ వినియోగం పెరగడంతో పాటు నష్టాలు కూడా అదే స్థాయిలో పెరుగుతూ వచ్చాయి. బీఆర్ఎస్ హయాంలోనే ఈ నష్టాలు విపరీతంగా పెరిగాయి. సకాలంలో బకాయిలు చెల్లించడంలో ఫెయిల్ అవ్వడంతో భారీ మొత్తంలో పేరుకుపోయాయి.

నష్టాలను పూడ్చకపోవడం 

తెలంగాణ ఏర్పాటైన సమయంలో గరిష్​ట విద్యుత్ డిమాండ్ 6,666 మెగావాట్లుగా ఉంది. కాగా ఈ ఏడాది మార్చి 26న గరిష్ట విద్యుత్ వినియోగం 17,162 మెగావాట్లుగా నమోదైంది. అప్పటికీ.. ఇప్పటికీ.. విద్యుత్ డిమాండ్ 157.4 శాతం వృద్ధి సాధించింది. పరిశ్రమలు విపరీతంగా పెరగడం.. విద్యుత్ అవసరాలు విపరీతంగా పెరిగిపోవడంతో గణనీయమైన వృద్ధి సాధించినా.. అందుకు అనుగుణంగా నష్టాలను పూడ్చకపోవడంతో భారీస్థాయి నష్టాల్లో డిస్కంలు కూరుకుపోయాయి. దీంతో అప్పటికీ.. ఇప్పటికీ నష్టాలు 6,985 శాతం పెరగడం గమనార్హం. వాస్తవానికి డిమాండ్ పెరుగుతున్నా కొద్దీ నష్టాలు తగ్గుముఖం పట్టాల్సి ఉండగా.. మరింత పెరుగుతుండటంతో డిస్కంలు.. నష్టాల ఊబి నుంచి గట్టెక్కడం కష్టతరంగా మారింది.

వ్యవసాయానికి ఉచిత విద్యుత్ 

తెలంగాణలోని విద్యుత్ పంపిణీ సంస్థలు తీవ్ర ఆర్థిక సంక్షోభంలో చిక్కుకోవడానికి అనేక లోపభూయిష్ట విధానాలు, ప్రభుత్వ బకాయిలు, నిర్వహణ సమస్యలు ప్రధాన కారణాలుగా నిలుస్తున్నాయి. ప్రభుత్వ బకాయిలు, సబ్సిడీల విడుదలలో జాప్యం వహించడం డిస్కంల నష్టాలకు అతిపెద్ద కారణంగా ఉంది. ప్రభుత్వ శాఖల నుంచి, స్థానిక సంస్థల నుంచి రావాల్సిన రూ.వేల కోట్ల బకాయిలు, మరీ ముఖ్యంగా, వ్యవసాయానికి ఉచిత విద్యుత్, గృహ వినియోగదారులకు రాయితీలు వంటి పథకాలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం సకాలంలో సబ్సిడీ నిధులను డిస్కంలకు విడుదల చేయడంలో గత బీఆర్ఎస్ సర్కార్ తీవ్ర నిర్లక్ష్యం వహించింది. ఇది సంస్థల రోజువారీ నిర్వహణపై తీవ్ర ప్రభావం చూపుతోంది. తెలంగాణలో వ్యవసాయ రంగానికి 24 గంటల ఉచిత విద్యుత్ ను సర్కార్ సరఫరా చేస్తోంది. దీనివల్ల డిస్కంలపై ఆర్థిక భారం గణనీయంగా పెరిగింది. ఈ ఉచిత విద్యుత్‌కు సంబంధించిన పూర్తి వ్యయాన్ని ప్రభుత్వం సబ్సిడీ రూపంలో భరించాల్సి ఉన్నా ఆ మొత్తాలు ఎప్పటికప్పుడు డిస్కంలకు అందడజేయడంలో బీఆర్ఎస్ ఫెయిలైంది.

Also Read: Bhagyashri Borse: భాగ్యశ్రీ బోర్సేకి హిట్ పడినట్టేనా? ఐరన్ లెగ్ ఇమేజ్‌ని బీట్ చేసిందా?

సరఫరాలో సాంకేతిక లోపాలు 

విద్యుత్ కొనుగోలు వ్యయం కూడా ఈ ఇబ్బందులకు కారణంగా ఉంది. రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్‌కు తగ్గ సరఫరా లేకపోవడంతో, డిస్కంలు ప్రైవేట్ సంస్థల నుంచి లేదా ఇతర రాష్ట్రాల నుంచి అధిక ధరకు విద్యుత్‌ను కొనుగోలు చేయాల్సి వస్తోంది. బొగ్గు ధరలు పెరగడం, థర్మల్ ప్లాంట్ల నిర్వహణ వ్యయం పెరగడం వల్ల యూనిట్‌కు అయ్యే సగటు వ్యయం పెరుగుతోంది. కానీ, వినియోగదారుల నుంచి వసూలు చేసే చార్జీలు పెరగకపోవడంతో ఆదాయ, వ్యయాల మధ్య భారీ అంతరం ఏర్పడుతోంది. ఇదిలా ఉండగా విద్యుత్ సరఫరాలో సాంకేతిక లోపాలు, విద్యుత్ దొంగతనాలు, మీటర్లు లేకపోవడం వంటి కారణాల వల్ల టెక్నికల్, కమర్షియల్ నష్టాలు పెరిగాయి. జాతీయ సగటుతో పోలిస్తే తెలంగాణ డిస్కంలలో ఈ నష్టాల శాతం ఎక్కువగా ఉండటం వల్ల ఆదాయం గణనీయంగా కోల్పోతున్నారు.

పరిపాలనలో సంస్కరణలు   

డిస్కంలు అప్పులపై ఆధారపడటం వల్ల ఏటా రూ.వేల కోట్లు వడ్డీల రూపంలోనే చెల్లించాల్సి వస్తోంది. ఇది డిస్కంల ఆర్థిక స్థితిని మరింత దిగజార్చింది. అప్పులు తీర్చడానికి మళ్లీ కొత్త అప్పులు చేయాల్సిన దుస్థితి ఏర్పడింది. చార్జీల పెంపును రాజకీయం చేయడం, ప్రభుత్వ హామీ మేరకు సబ్సిడీలు సకాలంలో విడుదల కాకపోవడం వంటి కారణాలు డిస్కంల నష్టాలను పూడ్చలేని విధంగా మార్చాయి. ఈ సమస్యలకు శాశ్వత పరిష్కారంగా సాంకేతిక నష్టాలను తగ్గించడం, ప్రభుత్వ బకాయిలను వెంటనే విడుదల చేయడం, పరిపాలనలో సంస్కరణలు తీసుకురావడం వంటి చర్యలు తక్షణావసరమని విద్యుత్ రంగ నిపుణులు సూచిస్తున్నారు.

వినియోగదారులకు బిగ్ రిలీఫ్! 

రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ చార్జీలను పెంచకూడదని నిర్ణయించినట్లు విశ్వసనీయ సమాచారం. వినియోగదారులపై భారం పడకుండా సర్కార్ జాగ్రత్తలు తీసుకుంటోంది. అయితే లోకల్ బాడీ, త్వరలో రాబోయే జీహెచ్ఎంసీ ఎన్నికల నేపథ్యంలో సర్కార్ ఈ నిర్ణయానికి వచ్చినట్లు చెబుతున్నారు. అయితే ప్రస్తుతం మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ నేపథ్యంలో బయటకు వెల్లడించేందుకు అవకాశం లేకపోవడంతో స్పందించేందుకు వెనుకడుగు వేస్తున్నట్లు సమాచారం. ఎందుకంటే ఇది ప్రజలను ప్రభావితం చేసే అవకాశం ఉన్న నేపథ్యంలో సైలెంట్ అయినట్లు తెలుస్తోంది. ఇదిలాఉండగా గత 12 ఏండ్లలో విద్యుత్ చార్జీలను కేవలం రెండుసార్లు మాత్రమే పెంచారు. ఇదిలా ఉండగా డిస్కంలు.. అగ్రిగేట్ రెవెన్యూ రిక్వైర్ మెంట్(ఏఆర్ఆర్) ను ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్(ఈఆర్సీ)కి సమర్పించాయి. ఆదివారంతో ఏఆర్ఆర్ సమర్పణకు గడువు ముగియనుండటంతో శనివారం డిస్కంలు సమర్పించాయి. ఆదివారం సెలవు రోజు కావడంతో శనివారమే అందించాయి.

Also Read: Renigunta Airport: రేణిగుంట ఎయిర్‌పోర్టులో ఆగిపోయిన విమానం.. ఆందోళనకు గురైన ప్యాసింజర్లు

ఎప్పుడెన్ని నష్టాలు.. 

ఎస్పీడీసీఎల్ ఎన్పీడీసీఎల్ మొత్తం 

2013-14     811.24           31             842.24
2014-15     1,170.3    1,348.21       2,518.55
2021-22    29,078    12,354.24     41,431.95
2022-23    36,255    16,511.46     52,766.78
2023-24   40,381     17,773.25     58,153.8
2024-25    40686     18,985.1     59,670.83

Also Read: Kisik Talks Promo: ‘కిసిక్ టాక్స్‌’లో తన యూట్యూబ్ ఇన్‌కమ్ ఎంతో చెప్పేసిన సీరియల్ యాక్టర్ శ్రీవేణి.. ఆస్తి ఏంతంటే?

Just In

01

Maoists surrender: వనం నుంచి జనంలోకి.. నలుగురు మావోయిస్టులు లొంగుబాటు!

Allu Arjun: తమిళ దర్శకులు అల్లు అర్జున్ కోసం ఎందుకు క్యూ కడుతున్నారు?.. రీజన్ ఇదే..

Medaram Jatara 2026: మేడారంలో భారీగా ట్రాఫిక్ జామ్.. కట్టలు తెంచుకుంటున్న భక్తుల ఆగ్రహం!

Municipal Elections: కాంగ్రెస్‌కు మున్సిపల్ ఎన్నికలు టెన్షన్ .. ఈ ఫలితాలే రాజకీయ దిశను నిర్ణయిస్తాయా?

BRS Party: మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఒంటరి పోరు.. పొత్తులు లేకుండా గెలుపు సాధ్యమా?