Friday, July 5, 2024

Exclusive

Bandi Sanjay: మా ఎమ్మెల్యేలకు నిధులివ్వరా?

– ఇదే పని కేంద్రమూ చేస్తే ఏం చేస్తారు?
– ఆరు నెలలైనా హామీల అమలేదీ?
– జనసేనతో పొత్తుపై నిర్ణయం అధిష్ఠానానిదే
– కేంద్రమంత్రి బండి సంజయ్

Congress Govt: సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం బీజేపీ ఎమ్మెల్యేలున్న నియోజక వర్గాలకు నిధులు కేటాయించటం లేదని కేంద్ర సహాయమంత్రి బండి సంజయ్ ఆరోపించారు. ఆదివారం కరీంనగర్‌లో మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో పాలన అటకెక్కిందని కామెంట్ చేశారు. కేవలం 100 రోజుల్లోనే కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో పూర్తిస్థాయిలో వ్యతిరేకత వచ్చిందని, నేటికీ గత అసెంబ్లీ ఎన్నికల వేళ ఇచ్చిన ఆరు గ్యారంటీల అమలు జరగటంలేదని మండిపడ్డారు. పల్లెల్లో రూ.4 వేల వృద్ధాప్య పెన్షన్, ప్రతి మహిళకు ఇస్తామన్న రూ.2,500 కోసం కళ్లు కాయలు కాసేలా ఎదురుచూస్తున్నారని, రైతు రుణమాఫీ, రైతు భరోసా రూ.15వేల కోసం రైతాంగం ఎప్పుడిస్తారంటూ అన్నదాతలు నిరాశ చెందుతున్నారని పేర్కొన్నారు.

రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడి 6 నెలలు గడుస్తున్నా ఇప్పటి వరకు ఎమ్మెల్యేలకు నియోజకవర్గాలకు నిధులు కేటాయించకపోవడం దారుణమని సంజయ్ విమర్శించారు. తెలంగాణ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలున్న చోట మాత్రమే అభివృద్ధి కార్యక్రమాలకు నిధులు విడుదల చేస్తోందని, బీజేపీ ఎమ్మెల్యేలున్న చోట వారు వినతి పత్రాలు ఇచ్చినా ముఖ్యమంత్రి పట్టించుకోవటం లేదని మండిపడ్డారు. గతంలో కేసీఆర్ నడిచిన బాటలోనే రేవంత్ రెడ్డి కూడా సాగుతున్నారని, ఇదిలాగే కొనసాగితే, కేసీఆర్ మీద తిరగబడినట్లే కాంగ్రెస్ ప్రభుత్వంపైనా ప్రజలు తిరుగుబాటు చేస్తారని తీవ్ర స్వరంతో హెచ్చరించారు.

కేంద్రంలోని ప్రభుత్వం తెలంగాణ ప్రగతికి అండగా నిలిచి, మద్దతునిస్తుంటే, రాష్ట్రంలోని ప్రభుత్వం మాత్రం బీజేపీ ఎమ్మెల్యేలున్న చోట పక్షపాతం చూపటం సరికాదని, కేంద్ర ప్రభుత్వం కూడా కాంగ్రెస్ ఎంపీలకు నిధులు ఇవ్వకుంటే పరిస్థితేమిటని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి వైఖరి వల్ల తెలంగాణ ప్రగతి దెబ్బతింటుందని, ఇకనైనా ముఖ్యమంత్రి ఈ పద్ధతిని మానుకోవాలన్నారు. ఇక పార్టీలు మారుతున్న ఎమ్మెల్యేలపైనా సంజయ్ స్పందించారు. అవసరాన్ని బట్టి కండువాలు మార్చటం అనేది వారి విజ్ఞతకు సంబంధించిన విషయమని అన్నారు. ఇక తెలంగాణలో జనసేన పొత్తు గురించి ప్రశ్నించగా.. ఆ విషయాన్ని తమ పార్టీ అధిష్టానం చూసుకుంటుందని క్లారిటీ ఇచ్చారు. సింగరేణి విషయంలో బీఆర్‌స్ సాగిన దారిలోనే కాంగ్రెస్ నడుస్తోందని వ్యాఖ్యానించారు.

Publisher : Swetcha Daily

Latest

Pawan Kalyan: మనం OG అంటే.. ప్రజలు ‘క్యాజీ’ అంటారు

Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మార్పు రావడం వెనుక కీలక పాత్ర...

CM Revanth Reddy: రాజకీయాలకు అతీతం… అభివృద్దే మా లక్ష్యం

- బిజీబిజీగా సీఎం హస్తిన పర్యటన - ప్రధానిని కలిసిన సీఎం రేవంత్,...

CM Revanth Reddy: కేసీఆర్‌పై ప్రేమ తగ్గలేదా?

- కేసీఆర్ ఫిరాయింపులను ప్రోత్సహించినప్పుడు ఈటల ఏం చేశారు? - ఆయనపై ఇంకా...

Amrapali Kata: ఆమ్రపాలి ఆకస్మిక తనిఖీలు

GHMC: మంత్రులు, ఉన్నతాధికారులు, వివిధ శాఖల బాధ్యులు పనిపై శ్రద్ధ పెంచాలని,...

Telangana BJP: ఇద్దరు సీఎంలు కలవాలనే కోరుకుంటున్నాం.. కానీ!?

NVSS Prabhakar: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్...

Don't miss

Pawan Kalyan: మనం OG అంటే.. ప్రజలు ‘క్యాజీ’ అంటారు

Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మార్పు రావడం వెనుక కీలక పాత్ర...

CM Revanth Reddy: రాజకీయాలకు అతీతం… అభివృద్దే మా లక్ష్యం

- బిజీబిజీగా సీఎం హస్తిన పర్యటన - ప్రధానిని కలిసిన సీఎం రేవంత్,...

CM Revanth Reddy: కేసీఆర్‌పై ప్రేమ తగ్గలేదా?

- కేసీఆర్ ఫిరాయింపులను ప్రోత్సహించినప్పుడు ఈటల ఏం చేశారు? - ఆయనపై ఇంకా...

Amrapali Kata: ఆమ్రపాలి ఆకస్మిక తనిఖీలు

GHMC: మంత్రులు, ఉన్నతాధికారులు, వివిధ శాఖల బాధ్యులు పనిపై శ్రద్ధ పెంచాలని,...

Telangana BJP: ఇద్దరు సీఎంలు కలవాలనే కోరుకుంటున్నాం.. కానీ!?

NVSS Prabhakar: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్...

Telangana: పట్టు కోల్పోతున్న సీఎం

సీఎం రేవంత్ పై బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు రేవంత్ రెడ్డి పనితీరుపట్ల సొంతపార్టీ ఎమ్మెల్యేలలో విశ్వాసం తగ్గింది. ఆయన సీఎం కావడం మెజారిటీ శాసనసభ్యులకు...

Hyderabad:జాబ్ (క్యాలెండర్) రెడీ

తెలంగాణ నిరుద్యోగులకు శుభవార్తనందించిన మంత్రి శ్రీధర్ బాబు ఈ ఏడాది నుంచే మొదలు కానున్న జాబ్ క్యాలెండర్ జాబ్ క్యాలెండర్ ప్రకటనతో విపక్షాల నోటికి తాళం నిరుద్యోగ శాతాన్ని భారీగా పెంచేసిన...

Hyderabad: ‘తలసాని’ ఇంట విషాదం

Ex Minister Talasani Srinivas Yadav Brother Shankar Yadav died kcr tribute: మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ఇంట తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఆయన సోదరుడు తలసాని...