Rangareddy land scam: పట్టాదారుకు తెలియకుండా రిజిస్ట్రేషన్లు
Land-Scam (Image source Twitter)
Telangana News, లేటెస్ట్ న్యూస్

Rangareddy land scam: కాసులిస్తే చాలు.. పట్టాదారులకు తెలియకుండా ప్లాట్లు రిజిస్ట్రేషన్లు

Rangareddy land scam: నిబంధనలతో పనిలేదు.. కాసులిస్తే చాలు

హెచ్​ఎండీఏ అనుమతులు జీపీఏ భూమికి
సబ్​ రిజిస్ట్రార్​ మద్దతుతో అక్రమ డాక్యుమెంట్ల సృష్టి
ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తే పట్టించుకోరా?
ఎవరు ఏమీ చేయలేరనే ధీమాలో సబ్​ రిజిస్ట్రార్​

రంగారెడ్డి బ్యూరో, స్వేచ్ఛ: కొందరు రియల్ వ్యాపారులు వ్యక్తిగత అవసరాల కోసం, క్రయవిక్రయాల్లో సైతం మోసాలకు పాల్పడుతున్నారు. ఇల్లీగల్ అంశాలను కప్పిపుచ్చుకోని రియల్​ వ్యాపారులు చట్టవిరుద్దంగా రిజిస్ట్రేషన్లకు పాల్పడుతున్నారు. రంగారెడ్డి జిల్లాలోని కొంతమంది రియల్​ వ్యాపారులు వినియోగదారులను నిండా (Rangareddy land scam) ముంచేస్తున్నారు. ఆ అక్రమాలకు సబ్‌ రిజిస్ట్రార్లు వంత పాడుతున్నారు. సబ్‌రిజిస్ట్రార్​ నిబంధనల ప్రకారం రిజిస్ట్రేషన్లు చేయాలి. కానీ, అవేమీ తమకు తెలియదు కాసులిస్తే చాలు.. అన్నింటిని రిజిస్ట్రేషన్లు చేస్తామని పరోక్షంగా ప్రజలకు అధికారులు సందేశం ఇస్తున్నట్టుగా పరిస్థితులు తయారయ్యాయి.

కార్తికేయ ప్రాపర్టీ రిజిస్ట్రేషన్లు కరెక్టేనా?

రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం కొంగర కలాన్​ రెవెన్యూ పరిధిలో విచిత్రమైన పరిస్థితి నెలకొంది. ఈ గ్రామ రెవెన్యూ పరిధిలో సర్వే నెంబర్లు 31/పార్ట్​, 32/పార్ట్​, 33, 35, 36, 37, 38, 39/పార్ట్‌లో 11 ఎకరాల 34 గుంటల భూమికి ముగ్గురు పట్టాదారులుగా ఉన్నారు. వీరు తమ అవసరాల కోసం రెండు ఎకరాల భూమిని నగరానికి చెందిన ఓ వ్యక్తిపై జీపీఏ చేశాయి. అయినప్పటికి నిబంధనలకు విరుద్దంగా రైతుల పేరుతో హెచ్​ఎండీఏ అనుమతులు తీసుకున్నారు. అంతటితో ఆగకుండా కార్తికేయ పేరుతో 42 ప్లాట్లతో లేఅవుట్​ చేశారు. ఈ ప్లాట్లు కొనుగోలుదారులకు రిజిస్ట్రేషన్లను పట్టాదారులైన రైతులు నేరుగా చేయాలి. ఒకవేళ జీపీఏ చేసిన రెండు ఎకరాలకు అవకావం ఉన్నా, మిగిలిన 9 ఎకరాల 34 గుంటల పరిధిలోని భూమిలోని ప్లాట్లను రైతులే రిజిస్ట్రేషన్లు చేయాలి. కానీ, లోసుగులను ఎత్తిచూపాల్సిన అధికారులు… రియల్​ వ్యాపారులతో కుమ్మక్కై ఇష్టానుసారంగా రిజిస్ట్రేషన్లు చేస్తున్నారు. వాస్తవానికి రైతులు, రియల్​ వ్యాపారులు కలిసి ఒప్పందంలో భాగంగా నేరుగా రియల్​ వ్యాపారులు రిజిస్ట్రేషన్​ చేసుకుంటామని అనుకోవచ్చు. కానీ ఐజీ స్టాంప్​ డ్యూటీ నిబంధనల ప్రకారం వాళ్ల ఒప్పందం సబ్​ రిజిస్ట్రార్​ చేయ్యొచ్చా అనేది అనుమానమే. నిబందనలకు విరుద్దంగా అదనపు సంపదనకు కక్కుర్తిపడి నిబంధనలు తుంగలో తొక్కుత్తున్నారు.

Read Also- TG Gram Panchayat Elections: గ్రామ పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ రిలీజ్.. మూడు విడతల్లో పోలింగ్

సబ్​ రిజిస్ట్రార్​ అక్రమాలకు అడ్డులేదు!

ఇబ్రహీంపట్నంలోని సబ్​ రిజిస్ట్రేషన్​ కార్యాలయంలో ఇద్దరు అధికారులు ఉన్నారు. ఇందులో ఒకరు రెగ్యులర్ పోస్టింగ్​, మరొకరు డిప్యూటేషన్​ పేరుతో ఆదాయం వచ్చే ప్రాంతాల్లో పనిచేసేందుకు ఇష్టపడతారని ప్రచారం ఉంది. అయితే. నిబంధనలకు అనుగుణంగా ఉన్నా లేకున్నా ఆ సబ్​ రిజిస్ట్రార్‌​కు చేతులు తడపాల్సిందే. లేకపోతే కొర్రీల పేరుతో జాప్యం చేయడం వారికి వెన్నతోపెట్టిన విద్య. ఇలాంటి సబ్​ రిజిస్ట్రార్​‌పై అనేక ఫిర్యాదులు ఉన్నతాధికారులు చేశారు. అయినప్పటికీ వారిలో చలనం లేదు. తప్పులను కప్పిపుచ్చుకోవాలంటే ఉన్నతాదికారులు ముడుపులు చెల్లిస్తారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అందుచేత వారిపై విచారణ జరిపేందుకు జాప్యం చేస్తున్నారు.

విచారణకు జంకుతున్న ఉన్నతాధికారులు

ఇబ్రహీంపట్నం సబ్​ రిజిస్ట్రార్‌గా పనిచేస్తున్న ఓ అధికారిపై హైకోర్టు న్యాయవాది ఆధారాలతో సహా ఉన్నతాధికారులు ఫిర్యాదు చేశారు. ఇబ్రహింపట్నం మండలం మంగల్​‌పల్లిలోని 367 సర్వే నెంబర్లలోని లోని ఒక ఇంటిని యాజమాని ప్రమేయం లేకుండా మరొకరి పేరిట రిజిస్ట్రేషన్ చేశారు. దీంతో బాధితుడు పోలిస్‌​స్టేషన్‌లో ఫిర్యాదు చేసినా ప్రయోజనం లేదు. బోంగులూరు, ఆదిబట్ల, మంగళపల్లి పటేల్​ గూడ ప్రాంతాల్లో నిర్మించే బహుళ అంతస్థుల్లో అక్రమాలు చోటు చేసుకున్నాయి. ఐదు అంతస్థుల భవనాలు నిర్మిస్తే రెండంతస్తులకు మాత్రమే స్టాంప్​ డ్యూటీ అధికారికంగా కట్టిస్తూ ప్రభుత్వ ఆదాయానికి గండికొడుతున్నారు. ఆ సబ్​ రిజిస్ట్రార్​ కొన్ని సందర్భాల్లో ఐదు అంతస్థులకు స్టాంప్​ డ్యూటి కట్టిస్తూ, రెండు అంతస్థుల భవనం ఉన్నట్టుగా ఫొటోలను డాక్యుమెంట్లకు జత చేస్తున్నారు. ఆడిట్​ జరిగినప్పుడు అక్రమాలు బయటపడకుండా ఈ జాగ్రత్తలు తీసుకుంటున్నారు. వీటిపై విచారణ చేయాలని ఐజీ స్టాంఫ్​ డ్యూటీ కమీషనర్​, ఏసీబీకి, రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రులకు ఫిర్యాదులు అందాయని, అయినా వీటిపై విచారణ చేసేందుకు అధికారులు జంకుతున్నారని తెలిసింది. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఆ సబ్​ రిజిస్ట్రార్​ చేసే అక్రమాలపై విచారణ చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు.

Read Also- Emmy Awards 2025: ఇంటర్నేషనల్ ఎమ్మీ అవార్డ్స్ 2025.. ఈసారి ట్రోఫీలు దక్కించుకున్న వాళ్ళు వీరే!

Just In

01

Bigg Boss Telugu 9: భరణి ఇమిటేషన్ అదుర్స్.. ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్ లోడింగ్..

KTR Vs Congress: ఉప్పల మల్లయ్య ఇంటికి వెళ్లి.. కేటీఆర్ కీలక వ్యాఖ్యలు

Itlu Arjuna: ‘న్యూ గయ్ ఇన్ టౌన్’ ఎవరో తెలిసిపోయింది.. ‘సోల్ ఆఫ్ అర్జున’ వచ్చేసింది

India Vs South Africa: దక్షిణాఫ్రికాతో మూడో టీ20.. టాస్ గెలిచిన భారత్.. ఏం ఎంచుకుందంటే?

KCR: 19న కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్‌ఎల్పీ భేటీ.. మరో ప్రజా ఉద్యమం!.. కీలక నిర్ణయాలు!