Hyderabad: కేసీఆర్ పగటి కలలు కంటున్నారు
Parigi MLA rammohan reddy
Political News

Hyderabad: కేసీఆర్ పగటి కలలు కంటున్నారు

పరిగి ఎమ్మెల్యే డాక్టర్ రామ్మోహన్ రెడ్డి
Parigi MLA dr.Rammohan Reddy criticised kcr and party floor leaders:

మళ్లీ అధికారంలోకి వస్తామని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పగటి కలలు కంటున్నాడని పరిగి ఎమ్మెల్యే డాక్టర్ రామ్మోహన్ రెడ్డి అన్నారు. శుక్రవారం మీడియా సమావేశంలో మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి కోరితేనే ప్రభుత్వం విద్యుత్ మీద జ్యూడిషియల్ కమిషన్ వేసింది ఇప్పుడు చేసిన అవినీతి బయట పడుతుందని ఎల్. నర్సింహ రెడ్డి కమిషన్ ముందు హాజరు కాలేదన్నారు. కూతురు కవితని కాపాడుకోవడానికి బీజేపీతో లోపాయకారి ఒప్పందం చేసుకున్నారన్నారు.ఏడు లక్షల కోట్లు అప్పలు చేసి వేలాది కోట్లు దుర్వినియోగం చేశారని అన్నారు. మాజీ మంత్రి హరీశ్ రావు మాటలు నమ్మొద్దు…ఆయన ఎప్పటికైనా బీజేపీలోకి పోతాడు అన్నారు. ఇప్పటికైనా కేసీఆర్ అసెంబ్లీ కి వచ్చి నిర్మాణాత్మక సూచనలు ఇవ్వాలన్నారు.

రుణమాఫీ పై సర్వత్రా ప్రశంసలు

లక్ష రూపాయలు రుణమాఫీ చేస్తామని చెప్పి కేసీఆర్ వాయిదా పద్దతిలో చేశారు. తెలంగాణ సమాజం నీళ్లు, నిధులు, నీయామకాలు కావాలని రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రి గా గెలిపించారు. వచ్చిన అరు నెలల్లోనే రూ.2 లక్షల ఋణమాఫీ చేస్తున్న సీఎం రేవంత్ రెడ్డిని అందరూ అభినందిస్తున్నారన్నారు.
అధికారంలోకి రాగానే 30 వేల ఉద్యోగాలు ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వమేనన్నారు. సొంత పార్టీ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు కేసీఆర్ అపాయింట్ మెంట్ కూడా ఇవ్వలేదని విమర్శించారు డాక్టర్ రామ్మోహన్ రెడ్డి. జరగాల్సిన నష్టమంతా జరిగి..ఇప్పుడు ఫామ్ హౌస్ కు పిలిచి భోజనాలు పెడితే సరిపోదు..
తమ భవిష్యత్తు , నియోజకవర్గ అభివృద్ధి కోసమే బీఆర్ఎస్ మెల్యేలు కాంగ్రెస్ లో చేరుతున్నారని అన్నారు.

Just In

01

Maoists surrender: వనం నుంచి జనంలోకి.. నలుగురు మావోయిస్టులు లొంగుబాటు!

Allu Arjun: తమిళ దర్శకులు అల్లు అర్జున్ కోసం ఎందుకు క్యూ కడుతున్నారు?.. రీజన్ ఇదే..

Medaram Jatara 2026: మేడారంలో భారీగా ట్రాఫిక్ జామ్.. కట్టలు తెంచుకుంటున్న భక్తుల ఆగ్రహం!

Municipal Elections: కాంగ్రెస్‌కు మున్సిపల్ ఎన్నికలు టెన్షన్ .. ఈ ఫలితాలే రాజకీయ దిశను నిర్ణయిస్తాయా?

BRS Party: మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఒంటరి పోరు.. పొత్తులు లేకుండా గెలుపు సాధ్యమా?