congress mlc jeevan reddy met deepadas munshi in delhi | Jeevan Reddy: ఢిల్లీలో జగిత్యాల పంచాయితీ.. జీవన్ రెడ్డితో కాంగ్రెస్ పెద్దల భేటీ
jeevan reddy and sanjay kumar
Political News

Jeevan Reddy: ఢిల్లీలో జగిత్యాల పంచాయితీ.. జీవన్ రెడ్డితో కాంగ్రెస్ పెద్దల భేటీ

Congress Party: ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అలక రాష్ట్ర కాంగ్రెస్‌లో చర్చనీయాంశమైంది. రెండు రోజులుగా ఆయన బుజ్జగింపు ప్రయత్నాలు కొనసాగుతున్నా చర్చలు సఫలీకృతం కాకపోవడంతో అధిష్టానం నుంచి ఆయనకు పిలుపు వచ్చింది. ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్‌తో కలిసి ఆయన ఢిల్లీకి వెళ్లారు. బుధవారం సాయంత్రం తెలంగాణ భవన్ శబరి బ్లాక్‌కు చేరుకున్నారు. అక్కడ రాష్ట్ర కాంగ్రెస్ ఇంచార్జీ దీపాదాస్ మున్షి, మంత్రి శ్రీధర్ బాబులతో జీవన్ రెడ్డి, అడ్లూరి లక్ష్మణ్‌లు భేటీ అయ్యారు.

అనంతరం, మంత్రి శ్రీధర్ బాబు కారులో జీవన్ రెడ్డి ఏఐసీసీ పెద్దలను కలవడానికి బయల్దేరి వెళ్లిపోయారు. దీపాదాస్ మున్షి కూడా వెళ్లారు. ఏఐసీసీ పెద్దలతో ఈ ముగ్గురు సమావేశం కానున్నారు. ఈ భేటీలోనే జీవన్ రెడ్డి తన డిమాండ్లను వినిపించే అవకాశం ఉన్నది. సీనియర్ నాయకుడు, కష్టకాలంలో పార్టీ వెంటే ఉన్న జీవన్ రెడ్డికి ఏఐసీసీ బంపరాఫర్ ఇవ్వనూ వచ్చని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలోని పరిస్థితులు, పార్టీ పదవికి ఉన్న పోటీ, మంత్రివర్గ విస్తరణలో ఉన్న అవకాశాలను బట్టి ఏఐసీసీ నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నది. ఏది ఏమైనా.. ఈ భేటీ తర్వాత జీవన్ రెడ్డి తన భవిష్యత్ కార్యచరణఫై నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నది.

 

Just In

01

CM Revanth Reddy: మోడీ, అమిత్ షా ది గోల్వాల్కర్ భావాలు: సీఎం రేవంత్ రెడ్డి

TG Christmas Celebrations: క్రిస్మస్ వేడుకలకు సర్కారు నిధులు.. నేటితో ముగియనున్న దరఖాస్తు గడువు

Akhanda2: బాలయ్య ‘అఖండ 2’ మూడో రోజు బాక్సాఫీస్ కలెక్షన్స్ ఎంతంటే?.. ఇది మామూలుగా లేదుగా..

Sircilla Panchayat Elections: రెండో దశ ఎన్నికల్లో సిరిసిల్ల నియోజకవర్గంలో గులాబీ ముందంజ.. దరిదాపుల్లో కూడా లేని బీజేపీ!

Panchayat Elections: రాష్ట్రంలో ముగిసిన రెండో విడత పోలింగ్.. అత్యధిక శాతం పోలింగ్ నమోదైన జిల్లా ఇదే..!