Aishwarya Rai: మోడీ పాదాలకు నమస్కరించిన ఐశ్వర్య రాయ్..
aiswerya-rai(X)
ఎంటర్‌టైన్‌మెంట్

Aishwarya Rai: ప్రసంగం తర్వాత ప్రధాని మోడీ పాదాలకు నమస్కరించిన ఐశ్వర్య రాయ్.. ఎందుకంటే?

Aishwarya Rai:  బాలీవుడ్ స్టార్ నటి ఐశ్వర్య రాయ్ బచ్చన్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సమక్షంలో ఒక ఆధ్యాత్మిక వేదికపై కనిపించి వార్తల్లో నిలిచారు. ఆంధ్రప్రదేశ్‌లోని పుట్టపర్తిలో భక్తి శ్రద్ధలతో నిర్వహించిన శ్రీ సత్యసాయి బాబా శతాబ్ది ఉత్సవాలలో ఆమె పాల్గొన్నారు. ఈ ఉత్సవాలకు దేశం నలుమూలల నుండి వేలాది మంది భక్తులు, పలువురు రాజకీయ సినీ ప్రముఖులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఐశ్వర్య రాయ్ తన ప్రసంగం తర్వాత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీని కలిసి, గౌరవ సూచకంగా ఆయన పాదాలను తాకి ఆశీస్సులు తీసుకున్నారు. ప్రధాని మోడీ కూడా ఆ వెంటనే చిరునవ్వుతో ఆమెకు ప్రతి నమస్కారం తెలిపారు. ఈ చర్య ఐశ్వర్య రాయ్ వినయాన్ని, అలాగే భారతీయ సంస్కృతిలో పెద్దల పట్ల, దేశాధినేత పట్ల ఉన్న గౌరవాన్ని ప్రతిబింబించింది. ఈ దృశ్యం వెంటనే మీడియా దృష్టిని ఆకర్షించి, సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీనిని చూసిన నెటిజన్లు అందుకే ఆమె ప్రపంచ సుందరి అయిందని కామెంట్లు పెడుతున్నారు.

Read also-Parineeti Chopra: తన కుమారుడికి ఎవరూ ఊహించని పేరు పెట్టిన బాలీవుడ్ నటి పరిణీతి చోప్రా.. అర్థం ఏంటంటే?

ఐశ్వర్య రాయ్ వేదికపై మాట్లాడుతూ.. ప్రేమ, మానవత్వం, మతం వంటి అంశాలపై శక్తివంతమైన ప్రసంగం చేశారు. ముఖ్యంగా, శ్రీ సత్యసాయి బాబా గారి బోధనలను ప్రస్తావిస్తూ ఆమె చేసిన వ్యాఖ్యలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. “ఒకే ఒక్క కులం ఉంది, అది మానవత్వపు కులం. ఒకే ఒక్క మతం ఉంది, అది ప్రేమ మతం. ఒకే ఒక్క భాష ఉంది, అది హృదయ. ఒకే ఒక్క దేవుడు ఉన్నారు,” అని బాబా సూక్తిని ఆమె గుర్తుచేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ప్రపంచం విపరీతమైన విభేదాలతో పోరాడుతున్న ప్రస్తుత తరుణంలో, ఐక్యత మానవత్వం విలువలను గుర్తు చేసుకోవడం అత్యంత అవసరమని నొక్కి చెప్పారు. “మనమందరం ప్రేమ కరుణ అనే ఒకే దారం చేత ముడిపడి ఉన్నాం,” అని ఆమె అన్నారు.

Read also-Konda Madhavi Latha: బ్రదర్ అంటూనే రాజమౌళిపై ఫైర్ అయిన బీజేపీ నాయకురాలు.. మూలాలపై అలాంటి మాటలా..

ఈ వేడుకలో ఐశ్వర్య రాయ్, ప్రధాన మంత్రి నరేంద్ర మోడీతో పాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. వీరిలో క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్, కేంద్ర మంత్రులు రామ్ మోహన్ నాయుడు కింజరాపు, జి. కిషన్ రెడ్డి పలువురు రాష్ట్ర నాయకులు అయిన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, డివ్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తదితర అంతర్జాతీయ ప్రతినిధులు ఉన్నారు. ఈ వేదిక ఒక నటి, దేశ ప్రధాని ఆధ్యాత్మిక ఉపదేశాల మధ్య అద్భుతమైన సమ్మేళనంగా నిలిచింది. పండుగ వాతావరణాన్ని మరింత పవిత్రంగా మార్చింది. ఐశ్వర్య రాయ్ ఈ చర్య ఆమె ప్రసంగం దేశంలో అత్యంత గౌరవప్రదమైన వ్యక్తులలో ఒకరిగా ఆమె స్థానాన్ని, అలాగే ఆమె ఆధ్యాత్మిక చింతనను మరోసారి నిరూపించాయి. మానవత్వం ప్రేమ అనే అంశాలపై ఆమె ఇచ్చిన సందేశం దేశ ప్రజలకు స్ఫూర్తినిచ్చింది.

https://twitter.com/PTI_News/status/1991027233105064291

Just In

01

Maoists surrender: వనం నుంచి జనంలోకి.. నలుగురు మావోయిస్టులు లొంగుబాటు!

Allu Arjun: తమిళ దర్శకులు అల్లు అర్జున్ కోసం ఎందుకు క్యూ కడుతున్నారు?.. రీజన్ ఇదే..

Medaram Jatara 2026: మేడారంలో భారీగా ట్రాఫిక్ జామ్.. కట్టలు తెంచుకుంటున్న భక్తుల ఆగ్రహం!

Municipal Elections: కాంగ్రెస్‌కు మున్సిపల్ ఎన్నికలు టెన్షన్ .. ఈ ఫలితాలే రాజకీయ దిశను నిర్ణయిస్తాయా?

BRS Party: మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఒంటరి పోరు.. పొత్తులు లేకుండా గెలుపు సాధ్యమా?