Globe Trotter Event: సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా దర్శకుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ప్రతిష్టాత్మిక చిత్రం’SSMB29′. ఇప్పటికే ఈ సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. నవంబర్ 15న రామోజీ ఫిల్మ్ సిటీలో జరగనున్న ఈ ‘గ్లోబ్ ట్రాటర్’ మెగా ఈవెంట్ కోసం అభిమానులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్న నేపథ్యంలో, ఈ సినిమాలో హీరోయిన్ గా చేస్తున్న ప్రియాంక చోప్రా ఇప్పటికే లొకేషన్ కు చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆమె అభిమానులకు ఒక సందేశం ఇచ్చారు. ఈవెంట్ కు చేరుకునేవారు తప్పనిసరిగా పాస్ పోర్ట్ కలిగి ఉండాలని అలా ఉన్న వారు మాత్రమే ఈవెంట్ కి హాజరు కావాలని ఆమె చెప్పుకొచ్చారు. దీనికి సంబంధించిన వీడియోను ఆమె సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Read also-Daggubati Heroes: వరుసగా నాలుగో సారి కోర్టుకు హ్యాండ్ ఇచ్చిన దగ్గుబాటి హీరోలు..
ఇప్పటికే ఇదే విషయం గురించి మహేష్ బాబు, రాజమౌళి కూడా చెప్పుకొచ్చారు. ఓ వీడియోలో మహేష్ బాబు ఏం చెప్పారు అంటే.. ఈ వీడియోలో మహేష్ బాబు ప్రధానంగా ఈవెంట్కు హాజరయ్యే అభిమానుల భద్రత నియమాలను పాటించాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారు. అభిమానులందరూ సురక్షితంగా ఈవెంట్కు వచ్చి, సంతోషంగా ఇంటికి తిరిగి వెళ్లాలని ఆయన కోరుకున్నారు. ‘గ్లోబ్ ట్రాటర్’ ఈవెంట్కు ప్రత్యేకంగా రూపొందించిన ‘పాస్పోర్ట్లు’ ఉన్నవారు మాత్రమే రావాలని మహేష్ స్పష్టం చేశారు. “రామోజీ ఫిల్మ్ సిటీ ప్రధాన గేట్లు మూసి ఉంటాయి. పాస్పోర్ట్లు లేని అభిమానులు దయచేసి తొందరపడి లేదా కంగారుపడి రావద్దు” అని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈవెంట్కు సురక్షితంగా వచ్చి, మళ్లీ ఇంటికి సురక్షితంగా వెళ్లాలని కోరుతూ, అభిమానులందరూ అక్కడ ఏర్పాట్లు చేసిన భద్రతా సిబ్బంది పోలీసులకు పూర్తిగా సహకరించాలని మహేష్ బాబు కోరారు. అభిమానుల సహకారంతో ఈ ఈవెంట్ను సురక్షితంగా మరపురాని జ్ఞాపకంగా మార్చుకుందామని ఆయన ఆకాంక్షించారు.
ఇటీవల జరిగిన కొన్ని సంఘటనల దృష్ట్యా, ఈవెంట్ను పర్యవేక్షించే అధికారులు కఠినమైన భద్రతా చర్యలు తీసుకున్నారు. రాజమౌళి కూడా దీని గురించి అంతకుముందే ఒక సందేశాన్ని ఇచ్చారు. ఈవెంట్కు వచ్చే 50,000 మందికి పైగా అభిమానుల భద్రత కోసం ప్రత్యేకంగా ‘పాస్పోర్ట్’ తరహా ఎంట్రీ వ్యవస్థను ప్రవేశపెట్టారు. ఈ పాస్పోర్ట్లో రూట్ మ్యాప్ క్యూఆర్ కోడ్ వంటి వివరాలు ఉన్నాయి. ఇవి అభిమానులను నిర్దేశిత పార్కింగ్, ఎంట్రీ పాయింట్లకు చేరడానికి సహాయపడతాయి. 18 ఏళ్లలోపు పిల్లలకు వృద్ధులకు ఈ ఈవెంట్కు అనుమతి లేదని కూడా అధికారులు స్పష్టం చేశారు.
Read also-Pushpa 3: అట్లీ సినిమా తర్వాత అల్లు అర్జున్ చేయబోయే సినిమా ఇదే.. షూటింగ్ ఎప్పటినుంచంటే?
‘గ్లోబ్ ట్రాటర్’ ఈవెంట్లో సినిమా టైటిల్, కాన్సెప్ట్ మహేష్ బాబు పాత్రకు సంబంధించిన మూడు నిమిషాల టీజర్ ను 130 అడుగుల వెడల్పు, 100 అడుగుల ఎత్తు ఉన్న అతి పెద్ద స్క్రీన్పై ప్రదర్శించనున్నారు. ఈ చారిత్రక ఘట్టాన్ని జియోహాట్ స్టార్ లో ప్రపంచవ్యాప్తంగా లైవ్ స్ట్రీమింగ్ చేయనున్నారు. ఈ ఈవెంట్కు ప్రముఖ యూట్యూబర్ ఆశిష్ చంచ్లానీ హోస్ట్గా వ్యవహరించనున్నారు. మహేష్ బాబు ఇచ్చిన ఈ బాధ్యతాయుతమైన సందేశం అభిమానులకు ఆయనపై ఉన్న ప్రేమాభిమానాలను మరింత పెంచింది. ఈ ‘గ్లోబ్ ట్రాటర్’ ఈవెంట్ సినీ చరిత్రలో ఒక సరికొత్త అధ్యాయాన్ని లిఖించబోతోందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. మరి ఈ ఈవెంట్ ఎలా సాగుతుందో చూడాలిమరి.
#GlobeTrotter pic.twitter.com/1S9556rVVZ
— PRIYANKA (@priyankachopra) November 15, 2025
