Rashmi Gautam: నవంబర్ 11, 2025 న జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు జరిగాయి. ఈ బై పోల్ రిజల్ట్స్ వెలువడనున్నాయి. ఉదయం 8 గంటల నుంచి ఓట్లను లెక్కిస్తున్నారు. కాంగ్రెస్ నుంచి వి నవీన్ యాదవ్ V. Naveen Yadav (Indian National Congress) , బీఆర్ఎస్ నుంచి మాగంటి సునీత గోపినాథ్ Maganti Sunitha Gopinath (Bharat Rashtra Samithi), బిజెపి నుంచి లంకాల దీపక్ రెడ్డి ( Lankala Deepak Reddy) పోటీ చేశారు.
అయితే, ఇప్పటి వరకు బయటకు వచ్చిన ఫలితాలలో వి. నవీన్ యాదవ్ V. Naveen Yadav (Indian National Congress) మెజారిటీగా ఆధిపత్యాన్ని చూపిస్తూ ప్రస్తుతం లీడ్ లో ఉన్నారు. అధికారిక లెక్కల ప్రకారంగా నాలుగో రౌండులో ఆయనకు 38,566 ఓట్లు వచ్చాయని తెలుస్తుంది. రెండో స్థానంలో ఉన్న మాగంటి సునీత గోపీనాథ్ Maganti Sunitha Gopinath (Bharat Rashtra Samithi)కు 29,007 ఓట్లు వచ్చినట్టు నంబర్లు చెబుతున్నాయి. ఇక ఈ క్రమంలోనే జబర్దస్త్ యాంకర్ రష్మి ఉదయం 7 గంటలకు ఎక్స్ లో ట్విట్టర్ వేదికగా సంచలన పోస్ట్ పెట్టింది. దీనికి సంబంధించిన పోస్ట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.
Also Read : Bigg Boss Telugu 9: హౌస్లోకి ఊహించని గెస్ట్.. ప్రజా తిరుగుబాటు మొదలైంది.. ఎంటర్టైన్మెంట్ పీక్స్!
జబర్దస్త్ యాంకర్ రష్మి ” నెక్స్ట్ టైం నోటా ” అంటూ పెట్టిన పోస్ట్ సోషల్ మీడియాలో పలు చర్చలకు దారి తీస్తుంది. అంటే ఈమె ఓటింగ్ రిజల్ట్స్ రోజే ఇలాంటి పోస్ట్ పెట్టడంతో రష్మి కి ఏమైంది? ఎప్పుడు లేనిది ఈ ముద్దుగుమ్మ ఇలా పెట్టిందేంటి? ఎవరికీ ఓటు వేయొద్దని ఫిక్స్ అయిందా ? అందుకే ” నెక్స్ట్ టైం నోటా ” అని పెట్టి ఉంటుందా అని సినీ వర్గాల వారు చర్చించుకుంటున్నారు.
అయితే, ఈ పోస్ట్ పై నెటిజెన్స్ రక రకాల కామెంట్స్ చేస్తున్నారు. చెప్పేది ఏదో డైరెక్ట్ గా చెప్పచ్చు కదా ఇలా ఎందుకు అందర్ని కన్ఫ్యూజ్ చేయడం, అసలు మీరు ఎవర్ని అంటున్నారు? మళ్లీ మొదలు పెట్టారా? ఈ సారి వేరే పార్టీకి ఓటు వేసావా ఏంటి? అంత దాకా కూడా ఎందుకు రావడం ఇంట్లోనే కూర్చోవచ్చు కదా .. అది కూడా ఒక ఆప్షన్ ఉంది కదా అంటూ కామెంట్లు చేస్తున్నారు.
