KRT fire on congress
Politics

Hyderabad:లా అండ్ ఆర్డర్ ఎక్కడ?

మెదక్ ఘటనపై మాజీ మంత్రి కేటీఆర్ స్పందన

Ex minister KTR criticise the congress government about law and order:
మెదక్ లో చోటు చేసుకున్న ఘర్షణపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రియాక్ట్ అయ్యారు. ఈ మేరకు ఆదివారం ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ.. గడిచిన తొమ్మిదిన్నర ఏళ్ల కేసీఆర్ పాలనలో తెలంగాణ ఎలాంటి మత పరమైన ఘర్షణలు లేకుండా ప్రశాంతంగా ఉందని కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే లా అండ్ ఆర్డర్ ఎక్కడకి పోయింది. అసలు ఉందా అని ప్రశ్నించారు. గతంలో ఎన్నడూ మతపరమైన కార్యకలాపాలు లేని ప్రశాంతమైన మెదక్ పట్ణం కాస్తా ఇప్పుడు అస్తవ్యస్తంగా మారడం నిజంగా సిగ్గుచేటన్నారు.

బీజేపీ బంద్ ప్రశాంతం

మెదక్ జిల్లా కేంద్రంలో బీజేపీ బంద్ కొనసాగుతోంది. గోవుల తరలింపు, జంతువధపై శనివారం రాత్రి మెదక్ టౌన్ లో ఇరు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. దీంతో ఇరు వర్గాలను పోలీసులు లాఠీ చార్జి చేసి చెదరగొట్టారు. ఈ గొడవ నేపథ్యంలో ఆదివారం మెదక్ పట్టణం బంద్ కు బీజేపీ నేతలు పిలుపునిచ్చారు. వర్తక, వాణిజ్య సముదాయాలు మూతపడ్డాయి. ఇక బంద్ నేపథ్యంలో పోలీసు ఉన్నతాధికారులు రంగంలోకి దిగారు. మెదక్ టౌన్ కు అదనపు బలగాలను తరలించి ప్రధాన కూడళ్లలో మోహరించారు. ఐజీ రంగనాథ్ స్వయంగా భద్రతను పర్యవేక్షించారు. ఎస్పీ బాల స్వామితో పాటు ఇతర పోలీస్ అధికారులు శాంతి భద్రతల పరిరక్షణ లో ఉన్నారు. ఎక్కడికక్కడ పోలీసు పికెట్లను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం మెదక్ జిల్లా కేంద్రం పూర్తిగా పోలీస్ దిగ్బంధంలో ఉంది. పలువురు బీజేపీ నేతలను పోలీసులు ముందస్తుగా అరెస్ట్ చేశారు.

Just In

01

Bigg Boss Telugu Nominations: నామినేషన్స్‌లో ఊహించని ట్విస్ట్.. మాజీ కంటెస్టెంట్స్ రీఎంట్రీ.. గూస్ బంప్స్ ప్రోమో భయ్యా!

Highest Paid Actors: రెమ్యునరేషన్లలో వెనక్కి తగ్గేదే లే అంటున్న సౌత్‌ యాక్టర్లు..

Wine Shop Lottery: నేడే మద్యం షాపులకు లక్కీ డ్రా.. ఆశావహుల్లో ఉత్కంఠ

Gold Price Today: గోల్డ్ లవర్స్ కి గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన బంగారం ధరలు?

DSP Bribery Case: ఏసీబీలో కలకలం రేపుతున్న డీఎస్పీ వసూళ్ల వ్యవహారం