Sai Dharam Tej: సుప్రిమ్ హీరో సాయి దుర్గ తేజ్ తాజాగా హైదరాబాద్లో జరిగిన ది ఫాస్ట్ & క్యూరియస్ – ఆటో ఎక్స్పో 2015 లో పాల్గొని సందడి చేశారు. ఈ ఈవెంట్లో అభిమానులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలు చెబుతూ వారికి ఉత్సాహ పరిచారు. ఈ సందర్భంగా యువతకు సందేశమిస్తూ.. సవాళ్లు ఎదురైతే మధ్యలోనే చేస్తున్న పనిని వదిలేయొద్దని, పట్టువదలకుండా ప్రయత్నిస్తూనే ఉండాలని ఆయన అన్నారు.
Read also-Priyanka Mohan: అలా చేయడంతో నెటిజన్లపై ఫైర్ అవుతున్న ‘ఓజీ’ హీరోయిన్..
ఇంకా ఏం మాట్లాడరంటే.. ‘నేను నా ప్రొఫైల్ పట్టుకుని ఎన్నో ఆఫీస్లకు తిరిగాను. నా ఫోటోల్ని పల్లీలు, బఠానీలు తినడానికి వాడే వారు. అలా ఆఫీస్ల చుట్టూ తిరుగుతున్న టైంలో ఓ సారి మంచు మనోజ్ ఆఫీస్లో వైవీఎస్ చౌదరీ గారు చూశారు. అలా ‘రేయ్’ చిత్రం ప్రారంభమైంది. కానీ ఆ మూవీ షూటింగ్ టైంలో చాలా ఆర్థిక సమస్యలు వచ్చాయి. అయినా సరే పట్టువదలకుండా ప్రయత్నించాను. 2012లో ఓ సినిమా చేస్తున్న టైంలోనే ఓ ప్రముఖ నటులు చనిపోయారు. మళ్లీ 2013లో జగపతి బాబు తో రీ షూట్ చేశాం. పొలిటికల్ రీజన్స్ వల్ల ఆ సినిమా కూడా ఆలస్యమైంది. అలా ఎన్ని సమస్యలు వచ్చినా కూడా నా కలల్ని మాత్రం వదిలి పెట్టలేదు. నాకు పవన్ కళ్యాణ్ ఓ గురువులాంటి వారు.. చిన్నప్పటి నుంచి నన్ను గైడ్ చేస్తూనే ఉన్నారు.. ప్రతీ విషయంలో నన్ను ఎంకరేజ్ చేస్తుంటారు.. యాక్టింగ్ ట్రైనింగ్, జిమ్నాస్టిక్, డ్యాన్స్, కిక్ బాక్సింగ్ ఇలా అన్నింట్లోనూ నన్ను గైడ్ చేశారు. కాలేజ్లో ఉండే ఫేవరేట్ టీచర్లా నాకు పవన్ కళ్యాణ్ ఎప్పుడూ సపోర్ట్ చేస్తుంటారు.’ అంటూ చెప్పుకొచ్చారు.
Read also-Jr NTR: బావమరిది వివాహంలో ఎన్టీఆర్ సందడి.. పిక్స్ వైరల్..
‘అదే విధంగా.. జీవితంలో ఏ సందర్భంలో అయినా మనం సహనాన్ని కోల్పోకూడదు. నేను ప్రతీ సిట్యువేషన్ను లైటర్ వే లోనే తీసుకుంటాను. ఏదీ కూడా సీరియస్గా తీసుకోను. ఎంత బ్యాడ్ జరిగినా కూడా నవ్వుతూ ఆ సిట్యువేషన్ను దాటేస్తుంటాను. నేను హాస్పిటల్ ఉన్న తరువాత బయటకు వచ్చాను. అందరూ అడుగుతూ ఉంటే.. కోమాలో ఉన్నాను అని చెప్పలేదు.. హాస్పిటల్కు అలా చిల్ అవ్వడానికి వెళ్లాను అని చెప్పాను. అందరూ హెల్మెట్ ధరించండి. వేగంగా వెళ్లకండి. జాగ్రత్తగా డ్రైవింగ్ చేయండి. యాక్సిడెంట్ తరువాత నాకు చాలా సమస్యలు వచ్చాయి. మాటలు కూడా సరిగ్గా వచ్చేవి కావు. నేను ఎన్నో పుస్తకాలు చదివే వాడిని.. ఎంతో వ్యాయామం చేసేవాడిని.’ అని అన్నారు. అంతే కాకుండా.. ‘కొన్ని సినిమాలు డబ్బులు కోసం కాకుండా తీసినవి ఉంటాయి. అలాంటిది నాకు ‘రిపబ్లిక్’ సినిమా అంటే చాలా ఇష్టం. ఆ క్లైమాక్స్ కూడా నాకు చాలా ఇష్టం. అలాంటి కథలు మళ్లీ వస్తే నేను చేస్తాను. సోషల్ మీడియా అకౌంట్లకు ఆధార్ని లింక్ చేయడం మన బాధ్యత అని నేను అనుకుంటాను. చిరంజీవి తో ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ లాంటి స్టోరీని చేయాలనే కోరిక ఉంది.’ అంటూ సాయి ధరమ్ తేజ్ చెప్పుకొచ్చారు.
