Local Body Reservations ( IMAGE CREDIT: SWETCHA REPORTER)
తెలంగాణ

Local Body Reservations: పకడ్బందీగా రిజర్వేషన్లు.. ఈ లెక్కల ప్రకారమే ప్రభుత్వ వ్యూహం

Local Body Reservations: ప్రభుత్వం రాష్ట్రంలో పకడ్బందీగా స్థానిక సంస్థల రిజర్వేషన్లను ప్రకటించింది. చట్టపరంగా ఎలాంటి చిక్కులు రాకుండా ముందస్తు చర్యలు చేపట్టింది. ఎస్సీ, ఎస్టీలకు 2011 జనాభాల లెక్కల ప్రకారం రిజర్వేషన్లు (Local Body Reservations) కేటాయించారు. డెడికేషన్ కమిషన్ నివేదిక ప్రకారం.. కాంగ్రెస్ ప్రభుత్వం గతేడాది నవంబర్లో చేపట్టిన ఇంటింటిసర్వే ఆధారంగా చేపట్టిన జనాభా లెక్కల ప్రకారం బీసీలకు 42శాతం రిజర్వేషన్లను స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రభుత్వం అమలు చేస్తుంది. అయితే కొన్ని గ్రామాల్లో బీసీ జనాభా ఎక్కువగా ఉండి ఓసీలు గానీ, ఎస్సీ, ఎస్టీలు తక్కువ ఉన్నప్పటికీ రిజర్వేషన్లు కేటాయింపులు జరిగాయి. దీంతో ప్రజల్లో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే 2018 పంచాయతీరాజ్ శాఖ చట్టం ప్రకారం రొటేషన్ పద్దతిలో రిజర్వేషన్ల కేటాయింపు జరుగడంతో కొన్ని గ్రామాల్లో జనాభా ఎక్కువగా ఉన్నప్పటికీ రిజర్వేషన్లు మారాయి. ఇది చట్టప్రకారం చేసినట్లు అధికారులు పేర్కొంటున్నారు. ప్రజలు దీనిపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, అపోహలు సైతం అవసరం లేదని తెలిపారు.

 Also Read: Telangana Jagruthi: గవర్నర్, రాష్ట్రపతి దగ్గర బిల్లులు పెండింగ్.. ఈ సాకుతో జీవోను కోర్టు కొట్టివేసే ఆస్కారం!

31 స్థానాల్లో బీసీలకు

రాష్ట్రంలోని 31 జిల్లా పరిషత్(జడ్పీ)స్థానాలకు పంచాయతీరాజ్ శాఖ స్టేట్ యూనిట్ గా రిజర్వేషన్లు ప్రకటించింది. 31 స్థానాల్లో బీసీలకు 12, ఎస్సీ-6, ఎస్టీ-4, ఓసీ-9 స్థానాలు కేటాయించారు. జిల్లా యూనిట్ గా తీసుకొని జడ్పీటీసీ, ఎంసీసీ స్థానాలకు రిజర్వేషన్లను కలెక్టర్ ప్రకటించారు. మండల యూనిట్ గా తీసుకొని ఎంపీటీసీ, సర్పంచ్ రిజర్వేషన్లను ఆర్డీఓ ప్రకటించారు. అదే విధంగా గ్రామయూనిట్ గా తీసుకొని వార్డు రిజర్వేషన్లను మండలంలోని ఎంపీడీఓ ప్రకటించారు. ఇది పంచాయతీరాజ్ యాక్టు ప్రకారమే నిర్వహించడం జరిగిందని అధికారులు తెలిపారు. ఏదైనా అపోహలు ఉంటే సంబంధిత అధికారులను సంప్రదించవచ్చని వారు అనుమానాలను నివృతి చేస్తారని వెల్లడించారు.

రిజర్వేషన్ ప్రకటించిన తర్వాత దానిని మార్చే అవకాశం లేదు 

రిజర్వేషన్లు తప్పుగా ప్రకటించారనే అపోహలతో స్థానిక నేతలు ఎమ్మెల్యేల వద్దకు వెళ్తున్నట్లు సమాచారం. రిజర్వేషన్లు కావాలని ఫలానా కులానికి ప్రకటించారు.. ఒత్తిడి తోనే రిజర్వేషన్ మార్చారు.. జనాభా ఎక్కువ ఉన్నవారిని వదిలి తక్కువ జనాభా ఉన్న కులానికి రిజర్వేషన్ ఇచ్చారని ఎమ్మెల్యేలపై ఒత్తిడి పెంచుతారని విశ్వసనీయ సమాచారం. ఒక్కసారి రిజర్వేషన్ ప్రకటించిన తర్వాత దానిని మార్చే అవకాశం లేదని పంచాయతీరాజ్ చట్టం చెబుతుంది. చట్టం ప్రకారం 2018 తో రొటేషన్ చేయడంతో గతంలో ఉన్న రిజర్వేషన్లు ఇప్పుడు మారడం జరుగుతుంది. అంతే తప్ప కావాలని చేసే అవకాశం ఉండదని, పంచాయతీ రాజ్ ప్రకారమే రిజర్వేషన్ల ప్రక్రియను పూర్తి చేసినట్లు అధికారులు పేర్కొంటున్నారు.

 Also Read: Toss controversy: టాస్ సమయంలో ఊహించని సీన్.. పాకిస్థాన్ కెప్టెన్‌తో మాట్లాడని రవిశాస్త్రి

పంచాయతీ బిల్లులకు లైన్ క్లియర్..  రూ.104 కోట్లు మంజూరు చేసిన ప్రభుత్వం

రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీ కార్యదర్శుల పెండింగ్ బిల్లులను ప్రభుత్వం మజూరు చేసింది. సోమవారం కార్యదర్శుల బిల్లులు రూ.104 కోట్లను రిలీజ్​ చేసింది. మంత్రి సీతక్క చొరవతో గతంలో ఎప్పుడూ లేని విధంగా ఒకే విడతలో ఇంత పెద్ద మొత్తాన్ని విడుదల చేసింది. నిధుల విడుదలతో పంచాయతీ కార్యదర్శులపై ఒత్తిడి తగ్గనున్నది. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ పంచాయతీ కార్యదర్శుల సమస్యలు అర్థం చేసుకుని సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క వెంటనే స్పందించి రూ.104 కోట్లు విడుదల చేశారన్నారు. ఇంతకు ముందు ఎప్పుడూ లేని విధంగా ఒకేసారి ఇంత పెద్ద మొత్తాన్ని విడుదల చేయడం పంచాయతీ వ్యవస్థ పటిష్టతకు దోహదం చేస్తుందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కలకు కృతజ్ఞతలు తెలిపారు.

Also Read: OTT Movies: అక్కడ వర్జినిటీ కోల్పోవడానికి అంత కష్టపడాలా.. లేదంటే ఏం అవుతుందంటే?

Just In

01

AB4: జయ కృష్ణ ఘట్టమనేని సరసన ఆ భామే.. అధికారిక ప్రకటన వచ్చేసింది

Varanasi: తప్పిదం మానవుడిది.. నింద దేవుడిపై.. ఏంటిది రాజమౌళి?

NBK: బాలయ్య ఫ్యాన్స్ వర్సెస్ మాజీ సీపీ సీవీ ఆనంద్.. ముగిసిన వివాదం.. అసలేం జరిగిందంటే?

Premante Trailer: ‘సారం లేని సంసారం వద్దు.. విడాకులే ముద్దు’.. హిలేరియస్!

Tortoise: రాజ్ తరుణ్ మరో ప్రయోగం.. ఈసారి ‘టార్టాయిస్’గా..!