police ( Image Source: Twitter)
తెలంగాణ

Karimnagar District: పోలీసుల లాఠీచార్జికి నిరసనగా సెల్ టవర్ ఎక్కిన వ్యక్తి

Karimnagar District: కరీంనగర్ జిల్లా హుజురాబాద్ లో పోలీసుల లాఠీచార్జీకి నిరసనగా ఒక వ్యక్తి సెల్ టవర్ ఎక్కాడు. దుర్గామాత విగ్రహం తరలింపులో ఉపాధి కోసం డీజే ఏర్పాటు చేసిన తనను డీజే వినియోగిస్తున్నాడనే ఆగ్రహంతో పోలీసులు తనను కొట్టారని ఆరోపిస్తూ టేకుమట్ల శ్రీనివాస్ అనే వ్యక్తి సెల్ టవర్ ఎక్కి నిరసన తెలిపాడు. దీంతో అతని కుటుంబ సభ్యులు, స్థానికులు తీవ్ర ఆందోళన చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు, సంఘటన స్థలానికి చేరుకున్నారు. టవర్ ఎక్కిన శ్రీనివాస్ ను పోలీసులు కిందకి దిగమని నచ్చజెప్పే ప్రయత్నం చేశారు.

Also Read: Telangana Anganwadi: అంగన్వాడీలను ప్రభుత్వం రెగ్యులర్ చేయాలి.. 1వ తేదీన అంగన్వాడీలకు వేతనాలు చెల్లించాలి

దాదాపు అరగంటకు పైగా కొనసాగిన చర్చల తర్వాత శ్రీనివాస్ టవర్ నుంచి సురక్షితంగా కిందకి దిగాడు. ఈ ఘటనపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దళిత బంధు పథకం కింద మంజూరైన డీజేను ఉపాధి కోసం వాడుకుంటే తప్పేంటని స్థానికులు పోలీసులను ప్రశ్నించారు. చట్టవిరుద్ధంగా లాఠీచార్జ్ చేసిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. పోలీసులు, దళిత బంధు లబ్ధిదారుల మధ్య జరిగిన ఈ ఘటన హుజురాబాద్ లో కలకలం సృష్టించింది. ఈ ఘటనపై పోలీసుల వైఖరి చర్చనీయాంశంగా మారింది.

Also Read: Bathukamma 2025: రేపటి నుంచే బతుకమ్మ సంబురాలు.. ఉత్సవాల షెడ్యూల్ విడుదల.. సీఎం కీలక ప్రకటన

 

Just In

01

Pawan Kalyan thanks: వారికి కృతజ్ఞతలు తెలిపిన పవన్ కళ్యాణ్.. ప్రత్యేకించి అభిమానులకు అయితే..

OG Concert: ‘ఓజీ’ సినిమాలో హీరో తాను కాదంటూ బాంబ్ పేల్చిన పవన్.. ఇంతకూ వారు ఎవరంటే?

Ind Vs Pak: కీలక క్యాచ్‌లు నేలపాలు.. టీమిండియా ముందు భారీ టార్గెట్

BRS women wing: బీఆర్ఎస్ మహిళా విభాగ అధ్యక్షురాలి పదవి ఎవరికి?

OTT movie review: పేరెంట్స్ అలా చేయడంతో దానికి రెడీ అయిన స్టూడెంట్.. ఏం చేసిందంటే?