cm revanth reddy says I see kakatiya rulers as killers of sammakka saralamma | CM Revanth Reddy: కాకతీయుల చేతిలో చనిపోయిన సమ్మక్మ, సారక్కవైపే ఉంటా..
Revanth Reddy
Political News

CM Revanth Reddy: కాకతీయుల చేతిలో చనిపోయిన సమ్మక్మ, సారక్కవైపే ఉంటా..

Telangana Formation Day: సమ్మక్క, సారలమ్మలు అప్పటి కాకతీయ పాలకులపై ధిక్కారాన్ని చూపారని, అందుకే కాకతీయులు సమ్మక్క, సారలమ్మలను చంపేశారని సీఎం రేవంత్ రెడ్డి చరిత్రను గుర్తు చేశారు. కాకతీయుల చేతిలో మరణించిన సమ్మక్క, సారలమ్మల వైపే తాను నిలబడతానని స్పష్టం చేశారు. సమ్మక్క, సారలమ్మ, జంపన్నలను చంపిన రాజులుగానే కాకతీయులను చూస్తానని చెప్పారు. కానీ, సీఎం కేసీఆర్‌కు అమరవీరులంటే ద్వేషం అని అన్నారు. రాష్ట్ర అవతరణ దినోత్సవంపైనా ఆయనకు గౌరవం లేదని విమర్శించారు. రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకల కోసం బీఆర్ఎస్‌తోపాటు బీజేపీకి నేతలకూ ప్రత్యేక ఆహ్వానాన్ని పంపామని వివరించారు. బీజేపీ తమ ఆహ్వానాన్ని తిరస్కరించలేదని తెలిపారు.

2015లో 1000 కోట్లతో అమరవీరుల స్థూపాన్ని కట్టాలని తొలిసారిగా డిమాండ్ చేసింది తాననే రేవంత్ రెడ్డి మీడియాతో చిట్ చాట్ చేస్తూ వెల్లడించారు. స్వాతంత్ర్యం దినోత్సవం పాకిస్తాన్‌ ఒక రోజు ముందు జరుపుకున్నట్టే కేసీఆర్ రాష్ట్ర అవతరణ దినోత్సవానికి ఒక రోజు ముందే సంబురాలు చేస్తున్నారని, రాష్ట్ర అవతరణ దినోత్సవంపై ఆయనకు గౌరవం లేదని చెప్పడానికి ఇదే నిదర్శనం అని అన్నారు. భిన్నాభిప్రాయాలు ఉన్నా.. కేసీఆర్ దశాబ్ది ఉత్సవాలకు రావాల్సిందని అభిప్రాయపడ్డారు. అఖిలపక్షంలో పిలుద్దామనుకుంటే కేసీార్ రోడ్డెక్కి ఆందోళన చేస్తున్నాడని సెటైర్ వేశారు. పది సంవత్సరాల దశాబ్ది ఉత్సవాలు తన ఆధ్వర్యంలో జరగడం తన జీవిత కాల గుర్తు అని వివరించారు. ఇక తెలంగాణ తల్లి విగ్రహం గురించి మాట్లాడుతూ.. ఈ విగ్రహం సెక్రెటేరియట్ బయట కాదు.. సెక్రెటేరియట్ లోపల ఉంటుందని స్పష్టం చేశారు.

ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలోకి రావడం ఒక నిరంతర ప్రక్రియ అని రేవంత్ రెడ్డి అన్నారు. ప్రభుత్వం మొదటి ప్రాధాన్యత డ్రగ్ కంట్రోల్ అని వివరించారు. కేసీఆర్ ప్రభుత్వం 1508 బ్రాండ్లకు అనుమతులు ఇచ్చారని చెప్పారు. నయీం కేసుపై చర్చ మొదలు కాలేదని తెలిపారు. టీపీసీసీ చీఫ్‌గా తన పదవీ కాలం ముగుస్తుందని రేవంత్ రెడ్డి అన్నారు. కొత్త పీసీసీ వస్తాడని, ప్రముఖ నాయకుడే పీసీసీ చీఫ్‌గా వస్తారని వివరించారు. ఇందులో ఏఐసీసీదే తుది నిర్ణయం అని చెప్పారు.

ఎగ్జిట్ పోల్స్ ఎలా ఉన్న కేంద్రంలో వచ్చేది ఇండియా కూటమేనని రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో 9 నుంచి 12 ఎంపీ స్థానాలను కాంగ్రెస్ గెలుచుకుంటుందని వివరించారు. రెండు ఎమ్మెల్సీలు, ఒక ఎమ్మెల్యే స్థానాన్ని గెలుస్తామని అంచనా వేశారు. కంటోన్మెంట్ శాసన సభ స్థానానికి ఉపఎన్నిక జరిగింది. మహబూబ్‌నగర్ ఎమ్మెల్సీ, ఉమ్మడి నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికీ ఎన్నిక జరిగింది.

బీసీ కుల గణన చేయడానికి ఆదేశాలు జారీ చేశామని, త్వరలోనే కుల గణన ప్రారంభం అవుతుందని రేవంత్ రెడ్డి తెలిపారు. రాష్ట్రంలో విద్య, స్పోర్ట్స్ ప్రోత్సహించాలని అనుకుంటున్నట్టు వివరించారు.

Just In

01

S Thaman: సినిమా ఇండస్ట్రీలో యూనిటీ లేదు.. టాలీవుడ్‌పై థమన్ ఫైర్

The Raja Saab: ఈసారి బ్యూటీఫుల్ మెలోడీతో.. ప్రోమో చూశారా!

Bigg Boss Buzzz: అబద్దం చెప్పమన్నా చెప్పను.. శివాజీకి షాకిచ్చిన సుమన్ శెట్టి!

Aswini Dutt: 50 సంవత్సరాల వైజయంతి ప్రయాణం.. నిర్మాత అశ్వినీదత్ ఎమోషనల్ లెటర్..!

Dharamshala T20: ధర్మశాల టీ20లో దక్షిణాఫ్రికాపై భారత్ గెలుపు..