Mahesh Kumar Goud: వారి అండతోనే ప్రజా ప్రభుత్వం.. పీసీసీ చీఫ్
Mahesh Kumar Goud ( IMAGE credit: swetcha reporter)
Political News

Mahesh Kumar Goud: వారి అండతోనే ప్రజా ప్రభుత్వం.. పీసీసీ చీఫ్​ సంచలన వ్యాఖ్యలు

Mahesh Kumar Goud: ఎస్సీ, ఎస్టీ, బీసీల అండతోనే ప్రజా ప్రభుత్వం ఏర్పడిందని పీసీసీ చీఫ్​ మహేష్​ కుమార్ గౌడ్(Mahesh Kumar Goud) పేర్కొన్నారు.  ఆయన హైదరాబాద్‌(Hyderabad)లో మీడియాతో మాట్లాడుతూ స్వాతంత్య్ర పోరాటంలో భాగం లేని వాళ్ళు, ప్రస్తుతం దేశాన్ని ఏలుతున్నారన్నారు. మతం పేరిట దేశాన్ని విచ్ఛిన్నం చేసే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. మతతత్వ శక్తుల నుంచి రాజ్యాంగా(Constitutiona)న్ని కాపాడుకోవాలంటే మనమందరం ఐక్యంగా ఉండాల్సిన అవసరం ఉన్నదన్నారు. రాజ్యాంగం స్థానంలో మనుస్మృతిని అమలు చేయాలని కుట్రలు జరుగుతున్నాయన్నారు.

 Also Read: Collectorate: కలెక్టరేట్లో కామాంధుడు…? మద్యం సేవించి.. ఓ చిన్నారి పై?

రాహుల్ గాంధీ(Rahul Gandhi) ఆశయమైన ఎవరు ఎంతో వారికి అంత వాటా అనే నినాదాన్ని సఫలం చేసిన ఘనుడు సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) అని కొనియాడారు. స్థానిక సంస్థలు, విద్య, ఉపాధిలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ రెండు చట్టాలను తీసుకొచ్చి దేశానికి రోల్ మోడల్‌గా నిలిచామన్నారు. దేశ రాజ్యాంగాన్ని సంరక్షించుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉన్నదన్నారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్న మతవాద శక్తులను అడ్డుకోవాలన్నారు. అనంతరం తెలంగాణ గంగ తెప్పోత్సవ ఉత్సవ కమిటీ కార్యక్రమంలో మహేశ్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ, దత్తన్నను చూడగానే పార్టీలు మరిచిపోతానని చెప్పారు. దత్తన్న నిజమాబాద్ వచ్చినప్పుడు సైకిల్ మీద కూర్చో బెట్టుకొని వెళ్లిన రోజులు గుర్తొస్తున్నాయన్నారు. కులం ఏదైనా, కుల వృత్తులు శాశ్వతంగా ఉండాలన్నారు. ఎంత పెద్ద చదువులు చదివినా, ఎంత ఎత్తుకు ఎదిగిన కులవృత్తులను మరువకూడదని స్పష్టం చేశారు.

 Also Read: Arjun Tendulkar: సచిన్ కొడుకు అర్జున్ ఇప్పటివరకు ఎంత డబ్బు సంపాదించాడో తెలుసా?

Just In

01

Ponnam Prabhakar: ఉపాధి హామీ పథకం లో గాంధీ పేరు తొలగింపు దుర్మార్గం.. కేంద్రంపై మంత్రి పొన్నం ఫైర్!

Avatar Fire and Ash: రాజమౌళి రేంజ్ చూశారా.. ‘అవతార్: ఫైర్ అండ్ ఆష్’పై జేమ్స్ కామెరాన్‌తో ఆసక్తికర చర్చ..

Telangana Congress: ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు కాంగ్రెస్ వ్యూహం.. అభ్యర్థుల ఎంపికకు ప్రత్యేక స్క్రీనింగ్ కమిటీలు!

Satyameva Jayate Slogans: పార్లమెంట్‌లో కాంగ్రెస్ ధర్నా.. బీజేపీ కుట్రలను ఎండగట్టిన ఎంపీ చామల

RV Karnan: 4,616 అభ్యంతరాలు స్వీకరించిన జీహెచ్ఎంసీ.. అన్నింటిని పరిశీలిస్తామని కమిషనర్ కర్ణన్ హామీ!