Hyderabad Commissionerate (imagecredit:twitter)
తెలంగాణ

Hyderabad Commissionerate: బడా బాబులకు సహకరిస్తున్న అధికారులు.. అడ్డగోలు సంపాదనలు

Hyderabad Commissionerate: చట్టం నిజంగానే కొందరికి చుట్టమా? హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలోని కొందరు పోలీసు అధికారుల వ్యవహార శైలిని గమనిస్తే ముందుకొస్తున్న ప్రశ్న ఇది. చిన్నాచితక నేరాలు చేసిన వారిని అరెస్టులు చేసి హడావిడి చేసే ఈ అధికారులు లక్షల్లో మోసాలు చేస్తున్న వారిని సైతం వదిలేస్తున్నారు. కోర్టు ఉత్తర్వులను సైతం పట్టించుకోకుండా వివాదాస్పద స్థలాల్లో కూల్చివేతలు జరిపిస్తున్న వారిని విడిచి పెట్టేస్తున్నారు. దీంతోపాటు అధికారాన్ని అడ్డం పెట్టుకుని అడ్డగోలుగా సంపాదిస్తున్నారు. చోరీ కేసుల్లో సొత్తును రికవరీ చేస్తున్న బాధితులకు పూర్తిగా ఇవ్వకుండా కొంత తామే పెట్టుకుంటున్నారు. అదేమని అడిగితే ఇచ్చింది తీసుకోండి. లేకపోతే కోర్టులో డిపాజిట్ చేస్తాం అక్కడి నుంచి తీసుకోండంటూ బెదరగొడుతున్నారు.

గాలిస్తూనే ఉన్నారు

డాక్టర్ నోరి లక్ష్మీభాస్కర్(Laxmi Bhaskar)​ నిమ్స్(Nims) లో అదనపు మెడికల్ సూపరిండింటెంట్. తనతోపాటు వైద్య విద్య చదివిన స్నేహితుడు డాక్టర్ వీట్ల శ్రీరాములు(Sriramulu)కు బంజారాహిల్స్ ఎమ్మెల్యే కాలనీలో ప్లాటు ఇప్పిస్తానని నమ్మించి 50లక్షల రూపాయలకు ముంచాడు. దీనిపై డాక్టర్ శ్రీరాములు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసినా బంజారాహిల్స్ పోలీసులు మొదట కేసులు నమోదు చేయలేదు. దాంతో బాధితుడు కోర్టును ఆశ్రయించాడు. ఈ క్రమంలో కేసులు నమోదు చేసి విచారణ జరపాలని కోర్టు ఉత్తర్వులు జారీ చేయటంతో తప్పనిసరై బీఎన్ఎస్ 316(2), 316(5), 318(1), 318(4), 336(1), 336(3), 338, 175(3) సెక్షన్ల ప్రకారం కేసులు నమోదు చేశారు.

ఇది జరిగి 15రోజులు గడిచినా ఇప్పటివరకు డాక్టర్ లక్ష్మీభాస్కర్ పై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. దీని గురించి మాట్లాడితే అతని కోసం గాలిస్తున్నామని సమాధానాలు చెబుతున్నారు. అయితే, డాక్టర్ లక్ష్మీభాస్కర్ బంజారాహిల్స్ స్టేషన్ కు వచ్చి వెళుతున్నట్టు అదే స్టేషన్​ లో పని చేస్తున్న కొందరు సిబ్బందే చెబుతుండటం గమనార్హం. ఆర్థికంగా బలంగా ఉన్న డాక్టర్ లక్ష్మీభాస్కర్ తనకున్న పరిచయాలను ఉపయోగిస్తూ పోలీసులు అరెస్ట్ చేయకుండా మేనేజ్​ చేస్తున్నాడన్న ఆరోపణలు ఉన్నాయి. అదే సమయంలో కోర్టు నుంచి ముందస్తు బెయిల్ తెచ్చుకోవటానికి ప్రయత్నిస్తున్నాడన్న ప్రచారం కూడా ఉంది. దీని వెనక భారీ మొత్తంలో డబ్బులు చేతులు మారినట్టుగా ఆరోపణలు ఉన్నాయి.

Also Read: Kantara Actor Death: బ్రేకింగ్.. కాంతార మూవీ నటుడు టీ. ప్రభాకర్ కళ్యాణి మృతి

కబ్జా చేస్తున్నారంటే

తన పొజిషన్ లో ఉన్న భూమిని ఆరా మస్తాన్ అనే వ్యక్తి కబ్జా చేయటానికి ప్రయత్నిస్తున్నాడంటూ రమేశ్​ అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదుపై ఈస్ట్ జోన్ పోలీసులు ఏమాత్రం స్పందించ లేదు. పైగా…సెటిల్​ చేసుకోండి అంటూ జోన్ ఉన్నతాధికారి ఒకరు ఉచిత సలహా ఇవ్వటం గమనార్హం. మెట్టుగూడ సర్వే నెంబర్ 733లో ఉన్న 5,717 గజాల స్థలానికి సంబంధించి చాలా రోజులుగా వివాదాలు నడుస్తున్నాయి. 60 యేళ్లుగా తన పొజిషన్ లో ఉన్న భూమిని తప్పుడు డాక్యుమెంట్లు సృష్​ఠించటం ద్వారా ఆరా మస్తాన్ ఆక్రమించే యత్నం చేస్తున్నట్టుగా రమేశ్​ అనే వ్యక్తి పోలీసులకు కంప్లయింట్ ఇచ్చాడు. ఈ స్థలానికి సంబంధించి ఎలాంటి రిజిస్ట్రేషన్లు చేయవద్దని హైకోర్టు ఉత్తర్వులు ఉన్నా సబ్ రిజిస్ట్రార్ దానిని రిజిస్ట్రేషన్​ చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు.

హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వుల ప్రతిని కూడా దానికి జత చేశారు. దీనిపై పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఇక, వేర్వేరు పార్టీలకు చెందిన బడా నేతలతో సన్నిహిత పరిచయాలు ఉన్న వాటి సహాయంతో జోన్ కు చెందిన ఓ ముఖ్య అధికారిని మేనేజ్ చేసుకున్నట్టుగా ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలోనే వివాదాస్పద స్థలంలో రమేశ్​ తరపున వాచ్ మెన్ గా పని చేస్తున్న వ్యక్తి కుటుంబాన్ని ఆరా మస్త(CC Camera)లను ధ్వంసం చేశారు. దీనిపై రమేశ్(Ramesh)​ ఫిర్యాదు ఇచ్చినా పోలీసులు పట్టించుకోక పోవటం గమనార్హం.

దాంతో బాధితుడు రమేశ్ మీడియాలో తన గోడు వెళ్లబోసుకున్నాడు. ఆరా మస్తాన్(Masthan) నుంచి తనకు ప్రాణహాని ఉన్నట్టు చెప్పాడు. ఆ తరువాత కొన్ని గంటల్లోనే ఆరా మస్తాన్ మనుషులు జేసీబీతో వచ్చి వివాదాస్పద స్థలంలో ఉన్న నిర్మాణాలను కూల్చి వేయటం గమనార్హం. దీంట్లో కూడా భారీగా డబ్బు చేతులు మారినట్టు ఆరోపణలు ఉన్నాయి.

Also Read: Donald Trump: భారత్ సూటి ప్రశ్న.. తడబడ్డ ట్రంప్.. పరువు మెుత్తం పోయిందిగా!

ఫిర్యాదీకే క్షవరం

ఇక, చిలకలగూడ సబ్​ డివిజన్​ పరిధిలోని ఓ స్టేషన్ సిబ్బంది తన ఇంట్లో దొంగతనం జరిగిందని ఫిర్యాదు ఇచ్చిన వ్యక్తికే క్షవరం చేసినట్టుగా ఆరోపణలు వచ్చాయి. తన ఇంట్లో పని చేసిన మహిళనే చోరీ చేసిందని బాధితుడు సీసీ కెమెరా ఫుటేజీలను కూడా ఇచ్చాడు. దాంతో పోలీసులు ఆ మహిళను విశాఖపట్టణం నుంచి రప్పించారు. విచారణలో విజయవాడలో ఉన్న తన సోదరి వద్ద బంగారు నగలు దాచి పెట్టినట్టుగా ఆమె ఒప్పుకుంది కూడా. అయితే, విజయవాడ వెళ్లటానికి కావాలంటూ పోలీసులు ఫిర్యాదీ కారును…దారి ఖర్చులకంటూ 50వేల రూపాయలను తీసుకున్నారు.

6తులాల బంగారాన్ని రికవరీ చేసినా 4తులాలు మాత్రమే ఫిర్యాదీకి ఇచ్చారు. స్టేషన్​ లో పని చేస్తున్న మరికొందరు సిబ్బంది ద్వారా వెలుగు చూసిన ఈ బాగోతం తీవ్ర చర్చనీయమైంది. ఆ వెంటనే పోలీసులు ఫిర్యాదీ ఇంటికి వెళ్లి ఇచ్చిన 4తులాల బంగారు నగలను కూడా వెనక్కి తీసుకుని కోర్టులో డిపాజిట్ చేస్తామని, అక్కడి నుంచి తీసుకో అని చెప్పటం గమనార్హం.

చర్యలేవీ

ఇలాంటి ఉదంతాలు తరచూ వెలుగు చూస్తున్నా పోలీస్ బాసులు ఏమాత్రం పట్టించుకోవటం లేదు. కనీసం అంతర్గత విచారణ కూడా జరిపించటం లేదు. చర్యలు తీసుకోవటం లేదు. దాంతో అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్న వారికి అడ్డూ అదుపు లేకుండా పోతోంది. దీనిపై పోలీసు వర్గాల నుంచే పలుకుబడి…పరపతి ఉంటే ఏమైనా చేయవచ్చా? అన్న ప్రశ్న వ్యక్తమవుతోంది. దారి తప్పిన వారిపై చర్యలు తీసుకోకపోతే ఇలాంటి పెడధోరణులు ఇంకా పెరిగి పోతాయని కొందరు అధికారులు అంతర్గత సంభాషణల్లో అంటున్నారు.

Also Read: GHMC Commissioner: సహాయక చర్యల్లో వేగం పెంచండి: కమిషనర్ కర్ణన్

Just In

01

Gopichand33: యాక్షన్ మోడ్‌లో గోపీచంద్.. తాజా అప్డేట్ ఇదే..

Premaledhani: ‘ప్రేమ లేదని’ గ్లింప్స్ విడుదల.. ఎలా ఉందంటే?

Taapsee Pannu: ముంబైలోనే ఉన్నా.. ఆ ప్రచారాలు ఆపండి

Jubilee Hills Bypoll: ఆ రెండు పార్టీల మధ్యే పోటీ!.. జూబ్లీహిల్స్ క్షేత్రస్థాయి పరిస్థితి ఇదే!

OG Movie: ఓటీటీలోనూ ఊచకోత మొదలెట్టిన ‘ఓజీ’.. 8 దేశాల్లో టాప్ 1 ప్లేస్‌లో!