Telangana (Image Source: Twitter)
తెలంగాణ

Telangana: ఆ విషయంలో తెలంగాణను ఢీకొట్టే రాష్ట్రమే లేదు.. దేశంలోనే నెంబర్ వన్!

Telangana: అవయవదానంలో తెలంగాణ దేశంలోనే మొదటి స్థానంలో నిలిచిందని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. 2024లో దేశంలో ప్రతి పది లక్షల జనాభాకు సగటున 0.8 అవయవదానాలు జరగగా, తెలంగాణలో ఇదే సంఖ్య 4.88గా నమోదైంది. ఈ ఘనతకు గుర్తింపుగా నేషనల్ ఆర్గాన్ అండ్ టిష్యూ ట్రాన్స్‌ప్లాంటేషన్ ఆర్గనైజేషన్ తెలంగాణకు అవార్డు ప్రకటించింది. ఢిల్లీలో జరిగిన జాతీయ అవయవదాన దినోత్సవ వేడుకల్లో కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి జేపీ నడ్డా ఈ అవార్డును జీవన్‌దాన్ ప్రతినిధులకు అందజేశారు.

Also Read: Excise Raids: బర్త్ డే పార్టీలో డ్రగ్స్ కలకలం.. ఆరుగురు సాఫ్ట్‌వేర్​ ఉద్యోగుల అరెస్ట్

ఈ సందర్భంగా రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ హర్షం వ్యక్తం చేశారు. పేద, ధనిక తేడా లేకుండా అవసరమైన వారందరికీ అవయవాలు అందించేందుకు ఇటీవల ‘తోట యాక్ట్’ను కూడా అనుసరించినట్లు ఆయన తెలిపారు. బ్రెయిన్ డెత్ కేసులలో అవయవాలు వృథా కాకుండా దానం చేయాలని మంత్రి ప్రజలను కోరారు. ఆరోగ్యశ్రీ పథకం కింద ఉచితంగా అవయవ మార్పిడి చికిత్సలు అందిస్తున్నామని తెలిపారు. 2024లో తెలంగాణలో 188 మంది బ్రెయిన్ డెత్ డోనర్ల నుంచి 725 అవయవాలను సేకరించి, వాటిని ఇతరులకు అమర్చి ప్రాణాలను కాపాడగలిగామని మంత్రి వివరించారు.

Also Read This: Dharmasthala Case: ధర్మస్థల కేసులో ఆసక్తికర పరిణామం.. ప్రత్యక్ష సాక్షికి సిట్ కీలక ఆదేశాలు!

Just In

01

O Cheliya movie song: ‘ఓ.. చెలియా’ సినిమా నుంచి పాటను విడుదల చేసిన మంచు మనోజ్..

Khairatabad Ganesh 2025: గంగమ్మ ఒడికి.. ఖైరతాబాద్ మహా గణపతి.. భారీగా తరలివచ్చిన భక్తులు

Ponguleti Srinivasa Reddy: అభివృద్ధి సంక్షేమాన్ని ముందుకు తీసుకెళ్లడమే మా లక్ష్యం: మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

Donald Trump: భారత్‌పై ట్రంప్ యూటర్న్.. మోదీ ఎప్పటికీ ఫ్రెండే అంటూ.. దగ్గరయ్యేందుకు తాపత్రయం!

SIIMA Awards 2025: సైమా 2025 విజేతలు ఎవరంటే?.. ఖుషీ అవుతున్న ఆ హీరోల ఫ్యాన్స్