BJP Telangana: భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్తానని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు అన్నారు. గురువారం ఆయన పార్లమెంట్లో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా రాంచందర్ రావు ప్రస్తుత రాజకీయ అంశాలపై చర్చించినట్లు సమాచారం. గ్రామస్థాయిలో పార్టీ కార్యకలాపాలను మరింత ఉత్సాహంగా కొనసాగించి తెలంగాణ అంతటా బీజేపీని విస్తరించేందుకు కృషిచేస్తానని అమిత్ షాకు వివరించినట్లు చెప్పారు.
కాగా, కేంద్ర మంత్రి బండి సంజయ్, ఎంపీ ఈటల రాజేందర్ అంశంపై చర్చకు వచ్చిందా? లేదా? అన్నది మాత్రం స్పష్టతనివ్వలేదు. ఎందుకంటే ఈ అంశంపై ఎవరూ స్పందించ వద్దని ఆదేశించిన నేపథ్యంలో అంతా సైలెంట్ అయ్యారు. అయితే, స్థానిక సంస్థల ఎన్నికలకు సంసిద్ధమవ్వాలని షా దిశానిర్దేశం చేసినట్లు తెలిసింది. కాంగ్రెస్ను ఢీ కొట్టేలా వ్యూహాత్మకంగా ముందుకు వెళ్లాలని దిశానిర్దేశం చేసినట్లు సమాచారం.