CM Revanth Reddy (image credit: twitter)
తెలంగాణ

CM Revanth Reddy: ఘనంగా బోనాల ఉత్సవాలు.. అధికారులపై సీఎం ప్రశంసలు

CM Revanth Reddy: చారిత్రాత్మక గోల్కొండలో వెలసిన జగదాంబిక ఎల్లమ్మ తల్లికి ఆషాడ మాసం తొలి బోనం సమర్పించడంతో జంట నగరాల్లో మొదలైన ఉత్సవాలు దేవాదాయ శాఖ, ఇతర శాఖల కృషి, పర్యవేక్షణతో నెల రోజుల పాటు విజయవంతంగా జరగడం పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy)  హర్షం వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రజల ఆధ్యాత్మిక సంస్కృతికి ప్రతీక బోనాల పండుగ అని అన్నారు.

 Also Read: Alampur Highway: నేషనల్ హైవే రోడ్డు పక్కనే తాగుతున్న పట్టించుకునే నాథుడే కరువు

ప్రకృతితో మమేకమై జీవించే వ్యవసాయ ఆధారిత సమాజ సాంప్రదాయ సామూహిక తాత్వికత, బోనాల పండుగ సందర్భంగా తెలంగాణ (Telangana) గడ్డమీద నుంచి ప్రపంచానికి ప్రదర్శితం అవుతుందని తెలిపారు. తెలంగాణ (Telangana) సాంప్రదాయానికి అద్దంపట్టే బోనాల జాతరతో రాష్ట్రమంతటా ఆధ్యాత్మకత ఉట్టిపడిందన్నారు. గోల్కొండలో మొదటి బోనంతో ప్రారంభమైన ఆషాడ బోనాల జాతర లాల్ దర్వాజా సింహవాహిని అమ్మవారికి బోనం సమర్పించడంతో ఘటం ముగుస్తుందన్నారు. బోనాల ఉత్సవాలు విజయంతం కావడానికి కృషి చేసిన అన్ని శాఖల అధికారులకు, సిబ్బందికి ముఖ్యమంత్రి అభినందనలు తెలియజేశారు.

 Also Read: Kota Srinivasa Rao: రాజకీయాల్లోనూ తనదైన ముద్ర వేసిన కోట.. 2015లో పద్మశ్రీ పురస్కారం

Just In

01

O Cheliya movie song: ‘ఓ.. చెలియా’ సినిమా నుంచి పాటను విడుదల చేసిన మంచు మనోజ్..

Khairatabad Ganesh 2025: గంగమ్మ ఒడికి.. ఖైరతాబాద్ మహా గణపతి.. భారీగా తరలివచ్చిన భక్తులు

Ponguleti Srinivasa Reddy: అభివృద్ధి సంక్షేమాన్ని ముందుకు తీసుకెళ్లడమే మా లక్ష్యం: మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

Donald Trump: భారత్‌పై ట్రంప్ యూటర్న్.. మోదీ ఎప్పటికీ ఫ్రెండే అంటూ.. దగ్గరయ్యేందుకు తాపత్రయం!

SIIMA Awards 2025: సైమా 2025 విజేతలు ఎవరంటే?.. ఖుషీ అవుతున్న ఆ హీరోల ఫ్యాన్స్