CM Revanth Reddy: ఘనంగా బోనాల ఉత్సవాలు.. సీఎం ప్రశంసలు
CM Revanth Reddy (image credit: twitter)
Telangana News

CM Revanth Reddy: ఘనంగా బోనాల ఉత్సవాలు.. అధికారులపై సీఎం ప్రశంసలు

CM Revanth Reddy: చారిత్రాత్మక గోల్కొండలో వెలసిన జగదాంబిక ఎల్లమ్మ తల్లికి ఆషాడ మాసం తొలి బోనం సమర్పించడంతో జంట నగరాల్లో మొదలైన ఉత్సవాలు దేవాదాయ శాఖ, ఇతర శాఖల కృషి, పర్యవేక్షణతో నెల రోజుల పాటు విజయవంతంగా జరగడం పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy)  హర్షం వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రజల ఆధ్యాత్మిక సంస్కృతికి ప్రతీక బోనాల పండుగ అని అన్నారు.

 Also Read: Alampur Highway: నేషనల్ హైవే రోడ్డు పక్కనే తాగుతున్న పట్టించుకునే నాథుడే కరువు

ప్రకృతితో మమేకమై జీవించే వ్యవసాయ ఆధారిత సమాజ సాంప్రదాయ సామూహిక తాత్వికత, బోనాల పండుగ సందర్భంగా తెలంగాణ (Telangana) గడ్డమీద నుంచి ప్రపంచానికి ప్రదర్శితం అవుతుందని తెలిపారు. తెలంగాణ (Telangana) సాంప్రదాయానికి అద్దంపట్టే బోనాల జాతరతో రాష్ట్రమంతటా ఆధ్యాత్మకత ఉట్టిపడిందన్నారు. గోల్కొండలో మొదటి బోనంతో ప్రారంభమైన ఆషాడ బోనాల జాతర లాల్ దర్వాజా సింహవాహిని అమ్మవారికి బోనం సమర్పించడంతో ఘటం ముగుస్తుందన్నారు. బోనాల ఉత్సవాలు విజయంతం కావడానికి కృషి చేసిన అన్ని శాఖల అధికారులకు, సిబ్బందికి ముఖ్యమంత్రి అభినందనలు తెలియజేశారు.

 Also Read: Kota Srinivasa Rao: రాజకీయాల్లోనూ తనదైన ముద్ర వేసిన కోట.. 2015లో పద్మశ్రీ పురస్కారం

Just In

01

Maoists surrender: వనం నుంచి జనంలోకి.. నలుగురు మావోయిస్టులు లొంగుబాటు!

Allu Arjun: తమిళ దర్శకులు అల్లు అర్జున్ కోసం ఎందుకు క్యూ కడుతున్నారు?.. రీజన్ ఇదే..

Medaram Jatara 2026: మేడారంలో భారీగా ట్రాఫిక్ జామ్.. కట్టలు తెంచుకుంటున్న భక్తుల ఆగ్రహం!

Municipal Elections: కాంగ్రెస్‌కు మున్సిపల్ ఎన్నికలు టెన్షన్ .. ఈ ఫలితాలే రాజకీయ దిశను నిర్ణయిస్తాయా?

BRS Party: మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఒంటరి పోరు.. పొత్తులు లేకుండా గెలుపు సాధ్యమా?