CM Revanth Reddy
తెలంగాణ

Telangana Govt: పారిశ్రామికవేత్తలుగా మహిళలు.. సీఎం రేవంత్ రెడ్డి ఆమోదమే తరువాయి!

Telangana Govt: తెలంగాణలో మహిళా సాధికారతకు పెద్దపీట వేస్తూ, వారిని పారిశ్రామిక రంగంలో రాణించేలా ప్రోత్సహించడానికి రాష్ట్ర ప్రభుత్వం నూతన ప్రణాళికలు రూపొందిస్తున్నది. ఇందులో భాగంగా, మహిళా సంఘాల్లోని సభ్యుల కోసం రాష్ట్రవ్యాప్తంగా 2,500 అగ్రో ప్రాసెసింగ్ యూనిట్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. త్వరలోనే ఈ పరిశ్రమల ఏర్పాటుకు శ్రీకారం చుట్టబోతున్నట్లు సమాచారం.

సెర్ప్ ఆధ్వర్యంలో..
సొసైటీ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ రూరల్ పావర్టీ (సెర్ప్) ఇప్పటికే ఈ యూనిట్ల నెలకొల్పేందుకు ప్రణాళికలు రూపొందించింది. యూనిట్ల ఏర్పాటుకు ఆసక్తి ఉన్న మహిళల నుంచి త్వరలోనే దరఖాస్తులను స్వీకరించనున్నారు. పరిశ్రమల స్థాపనకు ముందుకు వచ్చేవారికి సెర్ప్ ఆధ్వర్యంలో ఆర్థిక ప్రోత్సాహం (రుణ సదుపాయం) కల్పించనున్నారు. ఒక్కో యూనిట్‌కు సుమారు రూ. 50 లక్షల వరకు ఖర్చు అవుతుందని ప్రాథమికంగా అంచనా వేసినట్లు అధికారులు తెలిపారు. పూర్తిస్థాయిలో ఖర్చుల అధ్యయనం కొనసాగుతుంది. పరిశ్రమల స్థాపనకు అవసరమైన సాంకేతిక సహకారాన్ని ఇక్రిశాట్ (ఇంటర్నేషనల్ క్రాప్స్ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ ది సెమీ-అరిడ్ ట్రాపిక్స్) సంస్థ నుంచి తీసుకోనున్నారు. ఏయే జిల్లాల్లో ఏ పరిశ్రమ స్థాపనకు అనుకూలంగా ఉంటుందనే వివరాలను సైతం సేకరిస్తున్నారు. రానున్న రెండేళ్లలో ఈ పరిశ్రమలను స్థాపించేందుకు ప్రణాళిక సిద్ధం చేశారు.

Also Read- Rahul Sipligunj: మాట నిలబెట్టుకున్న సీఎం రేవంత్ రెడ్డి.. రాహుల్ సిప్లిగంజ్ కు కోటి రూపాయల నజరానా

మంత్రి సీతక్క ఆమోదం..
సెర్ప్ ప్రతిపాదించిన ఈ అగ్రో ప్రాసెసింగ్ యూనిట్ల ప్రణాళికలకు పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి శాఖల మంత్రి సీతక్క ఆమోదముద్ర వేశారు. అందుకు సంబంధించిన వివరాలపై ఆరా తీసి, అధికారులకు దిశానిర్దేశం చేశారు. ప్రస్తుతం, మంత్రి సీతక్క ఆమోదించిన ఫైల్‌ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆమోదం కోసం పంపించారు. త్వరలోనే అనుమతులు రాబోతున్నట్లు సమాచారం. దీంతో అధికారులు యూనిట్ల ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ యూనిట్ల ఏర్పాటుతో మహిళల ఆర్థిక స్వావలంబనతో పాటు గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకెళ్తుంది.

గ్రామీణ ప్రాంతాల్లో యూనిట్లు..
అగ్రో ప్రాసెసింగ్ యూనిట్లను గ్రామీణ ప్రాంతాల్లో ఏర్పాటు చేసేందుకు అధికారులు ప్రణాళిక సిద్ధం చేశారు. రాష్ట్రంలో నిజామాబాద్‌లో పసుపు, సంగారెడ్డిలో పత్తి, చెరకు, రంగారెడ్డిలో వరి, కూరగాయలు, మహబూబ్‌నగర్‌లో వేరుశనగ, ఖమ్మంలో పత్తి, మొక్కజొన్న, భద్రాద్రికొత్తగూడెంలో పత్తి, వరి, మొక్కజొన్న, ఆయిల్ ఫామ్, ఆదిలాబాద్‌లో పత్తి, సోయా, వరంగల్‌లో వరి, నల్లగొండ జిల్లాలో వరి – ఇలా ఏయే జిల్లాలో ఏ పంటలు సమృద్ధిగా పండుతాయో వాటికి అనుగుణంగా అగ్రో ప్రాసెస్ యూనిట్లను నెలకొల్పనున్నారు. ఈ యూనిట్లు విజయవంతమైతే రాష్ట్రవ్యాప్తంగా విస్తరించనున్నారు. వ్యవసాయ ఉత్పత్తులు సమృద్ధిగా లభించే ప్రాంతాలతోపాటు మహిళా స్వయం సహాయక సంఘాలు (ఎస్‌హెచ్‌జీ) బలంగా ఉన్నచోట వీటిని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తుంది. అంతేకాకుండా మార్కెట్ సదుపాయం కల్పించేందుకు సెర్ప్ ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేస్తున్నారు. మొక్కజొన్న, చిరుధాన్యాలు, కందులు, అరటి, టమాటా, మామిడి, చీనీ, ఉల్లి, మిర్చి, పసుపు తదితర పంటల దిగుబడి, అవసరమైన ప్రాసెసింగ్ ప్లాంట్లపై ప్రతిపాదనలు ఇప్పటికే ప్రభుత్వం సిద్ధం చేసింది.

Also Read- Midhun Reddy: మిథున్ రెడ్డి అరెస్ట్.. తర్వాత జాబితాలో ఉన్నది వీళ్లే!

మార్కెటింగ్ సౌకర్యం..
మహిళలు అగ్రో ప్రాసెసింగ్ యూనిట్ల నిర్వహణతోపాటు ఉత్పత్తుల సేకరణ, ప్రాసెసింగ్, ప్యాకేజింగ్, మార్కెటింగ్ తదితర కార్యకలాపాలు నిర్వహించనున్నారు. స్థానికంగా లభించే పప్పుధాన్యాలు, నూనె గింజలు, పండ్లు, కూరగాయలు వంటి ఉత్పత్తులను ప్రాసెస్ చేసి, వాటిని మార్కెట్‌కు తరలించనున్నారు. ఇక్రిశాట్ సాంకేతిక సహకారంతో మహిళలకు యూనిట్ల ఏర్పాటు, ఆధునిక ప్రాసెసింగ్ టెక్నాలజీ, నాణ్యత నియంత్రణ, ఉత్పత్తులు తదితర అంశాలపై శిక్షణ ఇవ్వనున్నారు. నాణ్యతా ప్రమాణాలు, ఉత్పత్తి విధానాలపై సాంకేతిక సహకారం అందించనున్నారు. మహిళా ఉత్పత్తులను మార్కెట్లతో అనుసంధానం చేయనున్నారు. వారు ఉత్పత్తులను స్థానికంగా విక్రయించడంతోపాటు ఇ-కామర్స్ ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా వివిధ మార్కెట్లకు తరలించే అవకాశం కల్పించనున్నారు. ఈ యూనిట్ల ఏర్పాటుతో వేలాది మంది మహిళలకు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి అవకాశాలు లభించనున్నాయి.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Blood Moon Eclipse 2025: అమ్మో చంద్ర గ్రహణం.. బిడ్డలను కనేదేలే.. గర్భిణీల వింత వాదన!

CM Revanth Reddy: దేశంలోనే భాద్‌షా.. జ‌న‌గామ క‌లెక్ట‌ర్‌ను అభినందించిన సీఎం

AGI impact: 2030 నాటికి 99 శాతం మంది ఉద్యోగాలు ఊడుతాయ్!!.. పొంచివున్న ఏఐ ముప్పు

A Minecraft Movie Review: ఊహా ప్రపంచంలోకి వెళ్తే ఏం జరగుతుంది.. తిరిగి రావాలంటే ఏం చేయాలి?

O Cheliya movie song: ‘ఓ.. చెలియా’ సినిమా నుంచి పాటను విడుదల చేసిన మంచు మనోజ్..