andhra-settelers-reached-hyd : ఉరుకుతూ వెళ్లారు..ఉత్సాహంగా చేరారు
AP Voters traffic jam
Political News

Hyderabad: ఉరుకుతూ వెళ్లారు..ఉత్సాహంగా చేరారు

Andhra settelers reached Hyderabad after using votes successfully:
రెండు తెలుగు రాష్ట్రాలలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ సందర్భంగా హైదరాబాద్ నగరాన్ని విడిచి ఊళ్లకు చేరుకుని తమ అభిమాన నేతలకు ఓటేసి తిరుగు ప్రయాణమయ్యారు ఆంధ్రా ప్రాంత ప్రజలు. అయితే ఈ రెండు రోజులు హైదరాబాద్ రోడ్లు నిర్మానుష్యంగా మారాయి. ఉద్యోగాలు, వ్యాపారాలు, చదువుల నిమిత్తం హైదరాబాద్ లో స్థిరపడిన ఆంధ్రులు ప్రతి సంక్రాంతి, దసరా సెలవలకు తప్పకుండా ఊళ్లు వెళతారు. ఈ సారి ఎన్నికలు తోడయ్యాయి. రెండవ శనివారం, ఆదివారం కలిసిరావడంతో మూడు రోజులు నగర ప్రజలకు వెసలుబాటు కలిగింది.. బతుకుదెరువు కోసం ఆంధ్రా నుంచి హైదరాబాద్‌కు వచ్చిన వాళ్లంతా తమ ఓటు హక్కును ఉపయోగించుకునేందుకు తమ సొంతూళ్లకు పయనమయ్యారు. దీంతో పట్టణంలోని పలు కూడళ్లు.. మెట్ర స్టేషన్లు, బస్ సేషన్లు, రైల్వే స్టేషన్లు వెలవెలబోయాయి. అయితే, సోమవారం పోలింగ్ ముగియడంతో ఆంధ్రాకు వెళ్లిన వారంతా ఒక్కొక్కరుగా నగరానికి చేరుకుంటున్నారు. బస్సుల్లో వెళ్లిన వాళ్లు రిటర్న్ టికెట్ అప్పుడు బుక్ చేసుకోవడంతో మంగళవారం తెల్లవారుజామునే వారంతా నగరానికి చేరుకున్నారు.

మెట్రో అదనపు సేవలు

ఈ క్రమంలోనే ప్రయాణికుల అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఉదయం 5.30 నుంచే మెట్రో రైళ్ల రాకపోకలు మొదలయ్యాయి. విజయవాడ నుంచి హైరదాబాద్ వచ్చే ప్రయాణికులకు మొదటి చెక్ పాయింట్ ఎల్బీ నగర్ కావడంతో ప్రయాణికులు వారి స్వస్థలాలకు చేరుకునేందుకు మెట్రో రైలు ఆశ్రయించారు. దీంతో ఎల్బీ నగర్ నుంచి మియాపూర్ వైపు వెళ్లే మెట్రోలో రద్దీ పెరిగింది. అదేవిధంగా పెరుగుతున్న రద్దీకి అనుగుణంగా వీలైనన్ని ఎక్కువ ట్రిప్పులు నడపాలని మెట్రో యోచించింది. . అసలే ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచితం ప్రయాణంతో దివాళా తీస్తున్న మెట్రోకు ఈ పరిణామం ఊపిరిపోయినట్లైంది.

జాతీయ రహదారిపై రద్దీ

ఎన్టీఆర్ జిల్లా నందిగామ-విజయవాడ-హైదరాబాద్ జాతీయ రహదారిపై విపరీతమైన రద్దీ నెలకొంది. విజయవాడ వైపు నుంచి హైదరాబాద్​ జాతీయ రహదారిపై వాహనాలు వరుసగా వెళ్తున్నాయి. నందిగామ వై జంక్షన్ వద్ద హైవే విస్తరణ పనులు జరుగుతుండటంతో హైదరాబాద్ వైపు వెళ్లే వాహనాలు నిదానంగా వెళ్లాల్సివచ్చింది. దీంతో ఈ ప్రాంతంలో కొంత ట్రాఫిక్ సమస్య ఏర్పడింది. ఓటర్లు శనివారం ఉదయాన్నే హైదరాబాద్ నుంచి ఏపీకి చేరుకుని శని, ఆదివారాల్లో ఇక్కడే ఉండి సోమవారం ఓటేసి తిరిగి హైదరాబాద్​కు బయలుదేరారు. ఈ సారి ఓట్లు వేసేందుకు పెద్ద ఎత్తున జనం తరలిరావడంతో పోలింగ్ కేంద్రాల్లోనూ ఓటర్ల వరుసలతో బార్లు తీరారు. పోలింగ్ శాతం కూడా గణనీయంగా పెరిగింది. 80 శాతం నమోదవడంలో హైదరాబాద్ లో స్థిరపడిన ఆంధ్రుల ప్రభావం ఎంతో అర్థమవుతుంది.

Just In

01

Maoists surrender: వనం నుంచి జనంలోకి.. నలుగురు మావోయిస్టులు లొంగుబాటు!

Allu Arjun: తమిళ దర్శకులు అల్లు అర్జున్ కోసం ఎందుకు క్యూ కడుతున్నారు?.. రీజన్ ఇదే..

Medaram Jatara 2026: మేడారంలో భారీగా ట్రాఫిక్ జామ్.. కట్టలు తెంచుకుంటున్న భక్తుల ఆగ్రహం!

Municipal Elections: కాంగ్రెస్‌కు మున్సిపల్ ఎన్నికలు టెన్షన్ .. ఈ ఫలితాలే రాజకీయ దిశను నిర్ణయిస్తాయా?

BRS Party: మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఒంటరి పోరు.. పొత్తులు లేకుండా గెలుపు సాధ్యమా?