Srisailam Reservoir Survey: శ్రీశైలంపై ముగిసిన అండర్‌వాటర్
Srisailam Reservoir Survey( image credit: twitter)
Telangana News

Srisailam Reservoir Survey: శ్రీశైలంపై ముగిసిన అండర్‌వాటర్ వీడియోగ్రఫీ సర్వే!

Srisailam Reservoir Survey: శ్రీశైలం జలాశయం ప్లంజ్ పూల్‌పై చేపట్టిన అండర్‌వాటర్ వీడియోగ్రఫీ సర్వే ముగిసింది. ఈ నెల 14న ‘షీ లయన్ ఆఫ్ షేర్ డైవింగ్ టీమ్’ ప్రారంభించిన ఈ సర్వేలో 8 మంది డైవింగ్ నిపుణులు, 8 మంది సహాయకుల బృందం 13 రోజుల పాటు నీటి అడుగున ఫొటోలు, వీడియోలు తీశారు. ప్లంజ్ పూల్ ఎంత లోతుకు ఏర్పడిందనే వివరాలను సేకరించిన ఈ బృందం, పూర్తి నివేదికను సమర్పించేందుకు వైజాగ్‌కు తిరిగి వెళ్ళింది. ఈ సమగ్ర నివేదికను మూడు వారాల్లో నీటిపారుదల శాఖ అధికారులకు అందజేయనున్నారు.

శ్రీశైలం డ్యామ్‌కు ప్రమాదం పొంచి ఉందా, నీటి నిల్వ సామర్థ్యం తగ్గిపోతుందా అనే సందేహాల నేపథ్యంలో ఈ సర్వేకు ప్రాధాన్యత ఏర్పడింది. జలాశయంలో చేరిన పూడిక మట్టిని అంచనా వేయడానికి ‘హైడ్రోగ్రాఫిక్స్ సర్వే’ కూడా నిర్వహించారు.

 Also Read: Land Acquisition: భూసేకరణ వేగవంతం చేయాలి.. అధికారులకు కలెక్టర్ కీలక ఆదేశాలు!

సర్వే వివరాలు:
మొత్తం సామర్థ్యం: శ్రీశైలం జలాశయం (Srisailam Reservoir) నిర్మాణ సమయంలో దాని నీటి నిల్వ సామర్థ్యం 308.6 టీఎంసీలు. పూడిక సమస్య: 2009లో వచ్చిన వరదల కారణంగా సిల్ట్ కొట్టుకురావడంతో ఈ సామర్థ్యం 215 టీఎంసీలకు తగ్గిపోయింది. అప్పటి వరదల వల్ల సుమారు 93 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యం తగ్గిపోయిందని అధికారులు అంచనా వేస్తున్నారు.

కొత్త అంచనాలు: శ్రీశైలం రిజర్వాయర్ (Srisailam Reservoir) నుంచి సంగమేశ్వరం వరకు 13 రోజుల పాటు హైడ్రోగ్రాఫిక్స్ సర్వే జరిగింది. ‘ఎకో సౌండ్’ పరికరాలను ఉపయోగించి, నీటి లోతు, పూడిక ఎంత మేరకు పేరుకుపోయిందో ‘జియో టెక్నికల్ సర్వీసెస్’ బృందం లెక్కించింది.
నిబంధనలు: సెంట్రల్ వాటర్ కమిషన్ మార్గదర్శకాల ప్రకారం, ప్రతి పదేళ్లకు ఒకసారి నీటి నిల్వ సామర్థ్యాన్ని లెక్కించాలి. ఈ నిబంధన ప్రకారం (National Hydrology Project) నేషనల్  హైడ్రాలజీ ప్రాజెక్టులో భాగంగా ఈ సర్వే చేపట్టారు.

నివేదికలో అంశాలు..
రిజర్వాయర్ బేస్ లెవెల్‌లో ఏర్పడిన మట్టి పూడిక, కోత, డ్యామ్ భద్రతకు సంబంధించిన అంశాలపై ఈ బృందం అధ్యయనం చేసింది. ప్రతి సంవత్సరం సుమారు 2 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యం పూడిక కారణంగా కోల్పోతుందని అంచనా. డ్యామ్ నుంచి పూడికను తొలగించకపోతే భవిష్యత్తులో నిల్వ సామర్థ్యం మరింత తగ్గుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

భవిష్యత్తు ప్రణాళికలు..
ఈ సర్వే నివేదిక ఆధారంగా శ్రీశైలం జలాశయం (Srisailam Reservoir) ప్రస్తుత నీటి సామర్థ్యాన్ని నిర్ధారిస్తారు. కృష్ణా నది పరీవాహక ప్రాంతంలో అటవీ నిర్మూలన కారణంగా వరదల సమయంలో మట్టి కొట్టుకువచ్చి జలాశయంలో చేరుతున్నట్లు నిపుణులు భావిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల మధ్య నదీ జలాల వివాదాల నేపథ్యంలో కేంద్రం గెజిట్ విడుదల చేసిన తర్వాత, ఇప్పుడు నదీ జలాల లెక్కలు, ప్రాజెక్టుల పరిస్థితిని అంచనా వేయడానికి ఈ సర్వే ఉపయోగపడుతుంది.

 Also ReadJogulamba Gadwal Crime: అక్రమ సంబంధానికి అడ్డొస్తాడని.. ప్రియుడితో హత్య చేయించిన భార్య!

Just In

01

Maoists surrender: వనం నుంచి జనంలోకి.. నలుగురు మావోయిస్టులు లొంగుబాటు!

Allu Arjun: తమిళ దర్శకులు అల్లు అర్జున్ కోసం ఎందుకు క్యూ కడుతున్నారు?.. రీజన్ ఇదే..

Medaram Jatara 2026: మేడారంలో భారీగా ట్రాఫిక్ జామ్.. కట్టలు తెంచుకుంటున్న భక్తుల ఆగ్రహం!

Municipal Elections: కాంగ్రెస్‌కు మున్సిపల్ ఎన్నికలు టెన్షన్ .. ఈ ఫలితాలే రాజకీయ దిశను నిర్ణయిస్తాయా?

BRS Party: మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఒంటరి పోరు.. పొత్తులు లేకుండా గెలుపు సాధ్యమా?