Anasuya Bharadwaj: తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉండి, అనేక పథకాలను అమలు చేసింది. అయితే, రెండు సార్లు గెలవగా.. మూడోసారి జరిగిన ఎన్నికల్లో బీఆర్ఎస్ ఘోరంగా ఓడిపోయి, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఈ సమయంలో, బీఆర్ఎస్ పాలనలో జరిగిన అక్రమాలు, అన్యాయాలపై కాంగ్రెస్ ప్రభుత్వం దర్యాప్తు చేస్తూ, బాధ్యులపై కేసులు నమోదు చేసి విచారణలు జరుపుతోంది. ఈ కేసుల్లో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ప్రముఖంగా చర్చనీయాంశంగా నిలిచింది.
Also Read: Telangana: త్వరలో ఎంఈఎంయూ రైళ్లు అందుబాటులోకి వస్తాయి.. కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్
బీఆర్ఎస్ అధికారంలో ఉన్న సమయంలో కేసీఆర్, కేటీఆర్ వంటి నాయకులు, ఎస్ఐబీ మాజీ అధికారి ప్రభాకర్ రావు సహకారంతో ఫోన్ ట్యాపింగ్ చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. సినీ నటులు, ప్రముఖ రాజకీయ నాయకులు, జర్నలిస్టులు, ఇతర రంగాలకు చెందిన ప్రముఖుల ఫోన్ సంభాషణలను రికార్డు చేసి, వారికి సంభందించిన సమాచారం. తెలంగాణకు చెందిన వారితో పాటు, ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన నాయకుల ఫోన్లను కూడా ట్యాప్ చేసినట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని బయటపెట్టింది.
Also Read: Shubhanshu Shukla: ఇస్రో మరో మైలురాయి. రోదసిలోకి దూసుకెళ్లిన శుభాంశు శుక్లా.. ఈ విషయాలు తెలుసా!
ఈ ఆరోపణలు వచ్చిన తర్వాత ప్రభాకర్ రావు అమెరికాకు వెళ్ళిపోయాడు. అయితే, కాంగ్రెస్ పట్టు బట్టి ఆయనను భారత్కు పిలిపించి విచారణ చేస్తోంది. ఈ ఫోన్ ట్యాపింగ్ వల్ల సినీ నటులు విడాకులు తీసుకుని విడిపోయారని అప్పట్లో ఎంతో మంది విమర్శించారు. ఇంకా, ఈ ఫోన్ ట్యాపింగ్ బాధితుల్లో యాంకర్ అనసూయ కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ‘జబర్దస్త్’ షో ద్వారా బుల్లితెరపై అనసూయ, పలు టీవీ షోలు, సినిమాల్లో నటిస్తూ మంచి గుర్తింపు పొందింది.
Also Read: Student Commits suicide: హోం వర్క్ చేయలేదని మందలించడంతో.. పురుగుల మందు తాగిన విద్యార్థి