A Special Commission Of Inquiry To Find The Culprits in the Kaleswaram Project
Politics

BRS: ఆపరేషన్ మేడిగడ్డ.. జస్టిస్ పీసీ ఘోష్ బృందం పరిశీలన

– బ్యారేజ్ దిగువన పగుళ్ల పరిశీలన
– ఇరిగేషన్ అధికారుల నుంచి వివరాల సేకరణ
Medigadda barrage latest news(TS today news): కేసీఆర్ పాలనలో అతి పెద్ద తప్పుగా, అవినీతి మరకగా మిగిలిపోయింది కాళేశ్వరం ప్రాజెక్ట్. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమికి సైతం కారణం అయింది. కాంగ్రెస్ పాలన వచ్చాక, అసలీ ప్రాజెక్ట్ ఏంటి? మేడిగడ్డ పిల్లర్లు కుంగిపోవడానికి కారణాలేంటి? ఇలా అనేక డౌట్స్‌కు సమాధానాల అన్వేషణ జరుగుతోంది. ఈ క్రమంలోనే జ్యుడీషియల్ ఎంక్వైరీ కొనసాగుతోంది. కాళేశ్వరం ప్రాజెక్టుపై చేపట్టిన న్యాయ విచారణలో భాగంగా జ్యుడీషియల్ కమిషన్ చైర్మన్ జస్టిస్ పీసీ ఘోష్ మంగళవారం మేడిగడ్డ బ్యారేజీని పరిశీలించారు.

హైదరాబాద్ నుంచి రోడ్డు మార్గంలో మహాదేవపూర్ మండలం అంబట్ పల్లి పంచాయతీ పరిధిలోని మేడిగడ్డ బ్యారేజీకి చేరుకున్నారు. జిల్లా కలెక్టర్ భవిశ్ మిశ్రా, ఎస్పీ కిరణ్ ఖరే స్వాగతం పలికారు. పోలీసులు గౌరవ వందనం ఇచ్చారు. అనంతరం కమిషన్‌కు సంబంధించిన అధికారులు, నిపుణుల బృందం మేడిగడ్డ బ్యారేజీని పరిశీలించారు. బ్యారేజీపై ఏడో బ్లాకులో వంతెనపై కాలి నడకన సాగుతూ అణువణువునా తనిఖీ చేశారు. ఏడో బ్లాక్‌లో దెబ్బతిన్న పిల్లర్లను చూసి అధికారల నుంచి వివరాలను సేకరించారు. బ్యారేజీ దిగువకు చేరుకొని పియర్ కింది భాగంలో వచ్చిన పగుళ్లను పరీక్షించారు. మేడిగడ్డ బ్యారేజీ దెబ్బతిన్న పరిస్థితులు, పీయర్ కుంగుబాటు వంటి అంశాలపై అధికారుల ద్వారా వివరాలను సేకరించారు. మేడిగడ్డ అతిథి గృహానికి చేరుకొని సంబంధిత నీటిపారుదల శాఖ అధికారులతో సమావేశమై, పలు అంశాలపై విచారించారు. మేడిగడ్డ బ్యారేజీ కుంగిన విషయంపై ప్రభుత్వ విచారణ చేయాలని సూచించడంతో క్షేత్రస్థాయిలో కమిషన్ పర్యటన చేస్తోంది.

Just In

01

Ponguleti Srinivasa Reddy: అభివృద్ధి సంక్షేమాన్ని ముందుకు తీసుకెళ్లడమే మా లక్ష్యం: మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

Donald Trump: భారత్‌పై ట్రంప్ యూటర్న్.. మోదీ ఎప్పటికీ ఫ్రెండే అంటూ.. దగ్గరయ్యేందుకు తాపత్రయం!

SIIMA Awards 2025: సైమా 2025 విజేతలు ఎవరంటే?.. ఖుషీ అవుతున్న ఆ హీరోల ఫ్యాన్స్

Telangana Jagruthi: తెలంగాణ జాగృతి సంస్థ నాయకులు ఫైర్.. కారణం అదేనా..?

Crime News: తీరుమారని గంజాయి పెడ్లర్ పై పీడీ యాక్ట్.. ఉత్తర్వులు జారీ!