Revanth Reddy: కేసీఆర్ ను కాంగ్రెస్ లోకి ఎట్టి పరిస్థితుల్లో రానీవ్వనని, తాను ఉన్నంత కాలం అది జరగని పని అంటూ సీఎం వ్యాఖ్యానించారు. ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ..రాష్ట్రానికి కేసీఆర్ కుటుంబమే ప్రధాన శత్రువు అంటూ మండిపడ్డారు. ఆ కుటుంబంలోని నలుగురు తెలంగాణకు అన్ని విధాలుగా నష్టం చేశారన్నారు. ఆర్ధిక పరమైన ఇబ్బందులు సృష్టించి వెళ్లారన్నారు. దేశం ముందు అప్పులు రాష్ట్రంగా నిలపెట్టారన్నారు. మంత్రివర్గ విస్తరణపై ఢిల్లీలో ఎలాంటి చర్చ జరగలేదని స్పష్టం చేశారు.
రెండు రోజుల్లో ప్రెస్మీట్
అలాగే కొత్తమంత్రులకు శాఖల కేటాయింపుపైనా ఎలాంటి చర్చ చేయలేదన్నారు.మంత్రులందరితో చర్చించిన తర్వాతనే శాఖలు కేటాయింపు రుగుతుందని వివరించారు. కర్ణాటక కులగణనపై మాత్రమే అధిష్ఠానం వద్ద చర్చలు జరిగాయన్నారు. ఇక కాళేశ్వరం గురించి రెండు రోజుల్లో ప్రెస్మీట్ పెడతామని సీఎం తెలిపారు. తెలంగాణకు సంబంధించి కేంద్రంలో అన్నింటికీ అడ్డుపడుతున్నది కిషన్ రెడ్డే అని ఆరోపించారు. డెవలప్ మెంట్ ప్రాజెక్టులకు ఒక్కదానికి కూడా కిషన్ రెడ్డి నిధులు సాధించలేదని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపణలు చేశారు. కేంద్ర మంత్రి హోదాలో ఉండి టైం పాస్ చేస్తున్నారని మండిపడ్డారు.
Also Read: Singer Mangli: సింగర్ మంగ్లీ బర్త్డే పార్టీ.. ఒక్కొక్కరు బయటికి వస్తున్నారు!
ఇక ఎస్సీ వర్గీకరణ, బీసీ కులగణనను జనంలోకి తీసుకెళ్లే లక్ష్యంతో రాష్ట్రంలో రెండు బహిరంగసభలు నిర్వహించాలని ముఖ్యమంత్రి అధిష్ఠానానికి వివరించినట్లు సమాచారం. ఈ సభలకు రావాలని ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే, అగ్రనేత రాహుల్గాంధీకి ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేసిన విషయం తెలిసిందే. ఇందుకు సంబంధించిన తేదీలు ఖరారు చేయాలని కోరినట్లు సమాచారం. మోదీ 11 ఏళ్ల పాలన వైఫల్యాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని సీఎం రేవంత్కు అధిష్ఠానం ఆదేశించింది. ఇందుకు సంబంధించిన తీసుకోవాల్సిన కార్యాచరణపై దిశానిర్దేశం చేసినట్లు తెలుస్తోంది. అలాగే కేసీ వేణుగోపాల్తోనూ సీఎం చర్చించారు. పార్టీలో విస్తృతంగా ప్రోగ్రామ్ లు ఉండేలా ఇక నుంచి షెడ్యూల్ రూపొందించనున్నట్లు సమాచారం.
Also Read: BRS Party: కాసేపట్లో కమిషన్ ముందుకు కేసీఆర్.. బీఆర్ఎస్ మాస్టర్ ప్లాన్.. ఇక తగ్గేదేలే!