Chamala Kiran Kumar Reddy: ప్రజలకు మంచి జరిగితే సంతోషమని, యుద్ధ సమయంలో ప్రజలకు ఎలాంటి హాని జరగకూడదని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి కోరుకున్నారు. శుక్రవారం ఆయన గాంధీభవన్ నుంచి మాట్లాడుతూ.. పాకిస్థాన్ ఉగ్రవాద చర్యలను తిప్పికొట్టాల్సిందేనని వెల్లడించారు.
ఆపరేషన్ సిందూర్ సమయంలో కాంగ్రెస్ పార్టీని కొంత మంది డామేజ్ చేయాలని చూడటం సరికాదన్నారు. కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉండే దూరదర్శన్ చానల్ లో కాంగ్రెస్ పార్టీకి చెందిన ఖర్గే, ప్రతాప్ సింగ్ ఫొటోలతో ప్రసారం చేశారని, దీనిపై జాతీయ కాంగ్రెస్ పరువు నష్టం దావా వేసిందన్నారు. పాకిస్థాన్ పై యుద్ధం ఎప్పుడు చేసినా, కాంగ్రెస్ మద్ధతుగానే నిలిచిందన్నారు.
Also read: Miss World 2025: సర్వ సంస్కృతుల నజరానా తెలంగాణా.. విదేశీయులను ఆకట్టుకునేలా ఏర్పాట్లు!
దేశ వ్యాప్తంగా త్రివిధ దళాలపై మద్ధతుగా కాంగ్రెస్ ర్యాలీలు నిర్వహించిందన్నారు. పార్టీలకు అతీతంగా తీసుకునే నిర్ణయానికి కాంగ్రెస్ ఎల్లప్పుడూ సపోర్టుగానే ఉంటుందన్నారు. 1947 జవహర్ లాల్ ప్రధాన మంత్రి గా నెహ్రు ఉన్నప్పుడు,1971 బంగ్లాదేశ్ ప్రత్యేక దేశం కోసం యుద్దం చేసిన సమయంలో, 1999 వాజపేయి ప్రధానిగా ఉన్నప్పుడు కార్గిల్ యుద్ధం సందర్భంలోనూ కాంగ్రెస్ అండగా నిలిచిందన్నారు. ఇక ఇద్దరు మహిళలు ఆపరేషన్ సింధూర్ పేరుతో పాకిస్థాన్ ను ఎటాక్ చేయడం దేశం గర్విస్తుందన్నారు.