Laxman on Ayodhya: అయోధ్యలో భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు
Laxman on Ayodhya(image credit: swetcha reporter)
Telangana News

Laxman on Ayodhya: అయోధ్యలో భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు

Laxman on Ayodhya: అయోధ్య, కాశీకి తెలుగు భక్తుల తాకిడి రోజురోజుకూ పెరుగుతోందని, ఈనేపథ్యంలో తెలుగు భక్తుల సౌకర్యార్థం వసతి, పార్కింగ్ వంటి నిర్మాణాలకు భూమి కేటాయించాలని రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ కోరారు. ఈమేరకు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కు బుధవారం విజ్ఞప్తిచేశారు. భక్తులకు తక్కువ ధరలకు సురక్షితమైన వసతి, భోజన, పార్కింగ్, శుచి గృహాల వంటివి అందుబాటులో ఉండేలా ప్రత్యేక ఏర్పాట్ల అవసరం ఉందన్నారు.

 Also Read: Ponnam Prabhakar: హైదరాబాద్ భద్రతపై.. మంత్రి పొన్నం ప్రభాకర్.. కీలక ప్రకటన!

అందుకే కనీసం 2000 చదరపు గజాల నుంచి 1 ఎకరం వరకు భూమిని కేటాయించాలని లక్ష్మణ్ కోరారు. భూమిని కేటాయించిన తర్వాత, అవసరమైన వసతుల నిర్మాణాన్ని తన ఎంపీ ల్యాడ్స్ నిధుల ద్వారా లేదా ఇతర సంబంధిత నిధుల సహాయంతో చేపడతానని సీఎం యోగికి వివరించారు. కాగా ఈ అంశంపై ముఖ్యమంత్రి యోగి సానుకూలంగా స్పందించినట్లు లక్ష్మణ్ తెలిపారు. ఇదిలా ఉండగా తొలుత యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ను.. లక్ష్​మణ్ మెమొంటో, శాలువాతో సత్కరించారు.

స్వేచ్ఛ ఈ పేపర్ కోసం ఈ https://epaper.swetchadaily.com/లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Maoists surrender: వనం నుంచి జనంలోకి.. నలుగురు మావోయిస్టులు లొంగుబాటు!

Allu Arjun: తమిళ దర్శకులు అల్లు అర్జున్ కోసం ఎందుకు క్యూ కడుతున్నారు?.. రీజన్ ఇదే..

Medaram Jatara 2026: మేడారంలో భారీగా ట్రాఫిక్ జామ్.. కట్టలు తెంచుకుంటున్న భక్తుల ఆగ్రహం!

Municipal Elections: కాంగ్రెస్‌కు మున్సిపల్ ఎన్నికలు టెన్షన్ .. ఈ ఫలితాలే రాజకీయ దిశను నిర్ణయిస్తాయా?

BRS Party: మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఒంటరి పోరు.. పొత్తులు లేకుండా గెలుపు సాధ్యమా?