తెలంగాణ బ్యూరో స్వేచ్ఛ: Mahesh Kumar Goud: కవిత రౌడీ కాబట్టే లిక్కర్ దందా చేసిందని పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ వెల్లడించారు. బీఆర్ ఎస్ లో రౌడీలకు కొదవలేదన్నారు. ఆయన గాంధీభవన్ లో మాట్లాడుతూ హెచ్ సీయూ భూములపై చర్చలకు సిద్ధమా? అంటూ కేటీఆర్ కు సవాల్ విసిరారు. హెచ్ సీయూ భూముల గురించి మాట్లాడడానికి కే టీఆర్ కు సిగ్గుండాలన్నారు.
సుప్రీం కోర్టు తీర్పును కేటీఆర్ వక్రీకరిస్తున్నారన్నారు. కంచె గచ్చిబౌలి భూములను ప్రైవేట్ పరం చేసే ఆలోచన ప్రభుత్వానికి లేదన్నారు. హెచ్ సీయూ భూముల్లో పారిశ్రామిక ప్రగతితో 5 వేల ఉద్యోగాలు వస్తాయన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ అభివృద్ధిని అడ్డుకోవడమే బీఆర్ ఎస్, బీజేపీ నేతలు పనిగా పెట్టుకున్నారన్నారు. పదేళ్ల బీఆర్ ఎస్ పాలనలో హైదరాబాద్ చుట్టూ వేల ఎకరాల భూములను చౌకగా అమ్మేశారన్నారు. ఇప్పుడు తమను విమర్శించడానికి బీఆర్ ఎస్ కు అర్హత లేదన్నారు.
Also Read: Biogas Plants in Telangana: రాష్ట్రంలో మరో కొత్త ప్రాజెక్ట్ ఏర్పాటు.. మంత్రి తుమ్మల