Sri Rama Navami: ఒంటిమిట్ట కోదండ రాముడు శుక్రవారం అంగరంగవైభవంగా, కన్నుల పండువగా కల్యాణం జరుపుకున్న వేళ ఆయనకు మూడు స్వర్ణ కిరీటాలు విరాళాలుగా అందాయి. పెన్నా సిమెంట్స్ అధినేత ప్రతాప్ రెడ్డి, ఆయన కుటుంబ సభ్యులు ఈ కిరీటాలను శుక్రవారం దేవాలయానికి అందించారు. సుమారు 7 కేజీల పసిడితో తయారు చేసిన కిరీటాలను టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, ఈవో శ్యామలరావుకు అందజేశారు
ప్రత్యేక పూజల అనంతరం శ్రీ సీతారామ లక్ష్మణులకు కిరీటాలను అలంకరించారు. వజ్రాలు పొదిగిన ఈ కిరీటాల విలువ దాదాపుగా రూ.6.60 కోట్లు ఉంటుంది. కాగా, ఒంటిమిట్టలో శ్రీ కోదండరామస్వామి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం నభూతో నభవిష్యతి అన్నరీతిలో కల్యాణోత్సవం జరిగింది. టీటీడీ ఆధ్వర్యంలో జరిగిన ఈ కల్యాణానికి ముఖ్యమంత్రి చంద్రబాబు దంపతులు ముఖ్యఅతిథులుగా హాజరయ్యి పట్టువస్తాలను సమర్పించారు.
స్వేచ్ఛ E పేపర్ కోసం ఈ లింక్ ని క్లిక్ చేయండి https://epaper.swetchadaily.com/