తెలంగాణ బ్యూరో స్వేచ్ఛ: 10 Class Student: టెన్త్ పేపర్ లీక్ కేసులో డీబార్ అయిన 10వ తరగతి విద్యార్థిని హైకోర్టును ఆశ్రయించింది. తనను పరీక్షలకు అనుమతించేలా ఆదేశాలు జారీ చేయాలని అభ్యర్థిస్తూ పిటిషన్ దాఖలు చేసింది. 10వ తరగతి ప్రశ్నాపత్రం లీక్ కేసులో నకిరేకల్ విద్యార్థిని ఝాన్సీ లక్ష్మీని బాధ్యురాలిగా పేర్కొంటూ విద్యా శాఖ అధికారులు ఆమెను డిబార్ చేసిన విషయం తెలిసిందే.
కాగా, ఇందులో తన తప్పేమి లేదంటూ ఝాన్సీ లక్ష్మి గురువారం హైకోర్టులో లంచ్మోషన్ పిటిషన్ దాఖలు చేసింది. ఆకతాయి బండరాయితో కొడతానని బెదిరిస్తే ప్రశ్నాపత్రాన్ని చూపించినట్టుగా పేర్కొంది. పూర్తిగా విచారణ జరపకుండానే అధికారులు తనను డిబార్ చేశారని తెలిపింది. తనను పరీక్షలకు అనుమతించేలా ఉత్తర్వులు జారీ చేయాలని అభ్యర్థించింది.
తన పిటిషన్లో విద్యాశాఖ సెక్రటరీ, బోర్డ్ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్సెక్రటరీ, నల్గొండ డీఈవో, ఎంఈవో, నకిరేకల్పరీక్షా కేంద్రం సూపరిండింటెంట్ లను ప్రతివాదులుగా పేర్కొంది. ఈ పిటిషన్ ను విచారణకు స్వీకరించిన హైకోర్టు ఏప్రిల్ 7న కౌంటర్ దాఖలు చేయాలని ప్రతివాదులకు నోటీసులు జారీ చేసి కేసును వాయిదా వేసింది.
Also Read: Bank of baroda Jobs 2025: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. అదిరిపోయే ఉద్యోగాలు.. వేలల్లో జీతం!