Ritu and Vishnu Priya (Image Source: X)
ఎంటర్‌టైన్మెంట్

Betting Apps: రీతూ చౌదరి, విష్ణుప్రియలకు పోలీసులు సంధించిన ప్రశ్నలివే..!

తెలంగాణ బ్యూరో, స్వేచ్ఛ: Betting Apps- బెట్టింగ్​ యాప్‌ల ప్రమోషన్ కేసులో నిందితులుగా ఉన్న బుల్లితెర స్టార్స్​ విష్ణుప్రియ, రీతూ చౌదరి.. గురువారం విచారణ నిమిత్తం పంజాగుట్ట పోలీసుల ఎదుట హాజరయ్యారు. ఇద్దరినీ దర్యాప్తు అధికారులు సుదీర్ఘంగా విచారించారు. ఏయే యాప్​‌లను.. ఏయే సోషల్​ ప్లాట్​ ఫామ్‌ల ద్వారా ప్రమోట్​ చేశారు? ఎంతెంత డబ్బు తీసుకున్నారు? లావాదేవీలు ఎలా జరిగాయి? అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. బెట్టింగ్​ యాప్​‌లను ప్రమోట్​ చేయాలంటూ ఎవరు అడిగారు? వాళ్ల పేర్లు, ఇతర వివరాల గురించి కూడా ఆరా తీశారు. ఈ క్రమంలో ఇద్దరి మొబైల్​ ఫోన్లను సీజ్​ చేయటంతోపాటు, వారి బ్యాంక్​ ఖాతాల వివరాలను తీసుకున్నారు.

Also Read- Megastar Chiranjeevi: మాటలు సరిపోవు.. నా హృదయం కృతజ్ఞతతో నిండిపోయింది

వినయ్​ అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పంజాగుట్ట పోలీసులు ఇటీవల 11 మంది బుల్లితెర నటులు, యూట్యూబర్లు, ఇన్‌ఫ్లూయెన్సర్లపై కేసులు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో విచారణ నిమిత్తం కేసులో నిందితులుగా ఉన్న విష్ణుప్రియ, టేస్టీ తేజ, కానిస్టేబుల్​ కిరణ్​ గౌడ్​, రీతూ చౌదరి, యాంకర్​ శ్యామల, అజయ్​, సుప్రీత, సన్నీ సుధీర్​ తదితరులకు మంగళవారం విచారణకు రావాలంటూ నోటీసులు జారీ చేశారు. ఈ క్రమంలో మంగళవారం రాత్రి టేస్టీ తేజ పోలీసుల ఎదుట హాజరై అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. బుధవారం కానిస్టేబుల్​ కిరణ్​ గౌడ్​ విచారణకు వచ్చారు. తాను నేరుగా ఎలాంటి బెట్టింగ్​ యాప్​‌లను ప్రమోట్​ చేయలేదంటూ విచారణాధికారులకు తెలిపాడు. ఇమ్రాన్ చేసిన కొన్ని ప్రమోషన్​లలో అతనితో కలిసి ఉన్నానని చెప్పాడు.

ఉదయం 10 గంటలకు…
కాగా, గురువారం ఉదయం 10 గంటలకు విష్ణుప్రియ తన అడ్వకేట్​‌తో కలిసి పంజాగుట్ట పోలీస్​ స్టేషన్‌కు వచ్చింది. పోలీసుల ప్రశ్నలకు జవాబులు ఇస్తూ తాను డబ్ల్యుడబ్ల్యుడబ్ల్యు.తాజ్​777బుక్​.కామ్​ అన్న బెట్టింగ్​ యాప్‌ను ప్రమోట్​ చేయటం కోసం 15 వీడియోలు చేసినట్టుగా ఆమె వెల్లడించినట్టు సమాచారం. ఈ క్రమంలో పోలీసులు ఆ యాప్​‌ను ప్రమోట్​ చేయమంటూ ఆ వెబ్‌సైట్ తరపున ఎవరు కలిశారు? ఎన్ని సంవత్సరాలకు అగ్రిమెంట్​ చేశారు? ప్రమోట్​ చేసినందుకు ఎంత డబ్బు ఇచ్చారు? బ్యాంక్​ ట్రాన్స్‌ఫర్​ ద్వారా చెల్లింపులు జరిపారా? ఇతర పద్దతిలో ఇచ్చారా? అని ప్రశ్నించారు. ఒక సంవత్సరం మాత్రమే అగ్రిమెంట్​ చేసుకున్నట్టుగా విష్ణుప్రియ చెప్పినట్టుగా తెలిసింది. అప్పట్లో బెట్టింగ్​ యాప్​ ద్వారా తనను కలిసింది ఎవరన్నది ప్రస్తుతం గుర్తులేదని వెల్లడించినట్టు సమాచారం. తాను చేసిన ప్రమోషన్​ వీడియోలను తన ఇన్‌స్టాగ్రామ్​ ఖాతాలో అప్‌లోడ్​ చేశానని విష్ణుప్రియ చెప్పినట్టుగా తెలిసింది. యాప్​‌ను ప్రమోట్​ చేసినందుకు నగదును బ్యాంకు ద్వారానే ఇచ్చినట్టుగా చెప్పినట్టు తెలియవచ్చింది. నెల నెలా మొత్తాన్ని అకౌంట్లలో జమ చేసేవారని తెలియచేసినట్టు సమాచారం. ఈ క్రమంలో పోలీసులు విష్ణుప్రియకు చెందిన బ్యాంక్​ ఖాతాల వివరాలను ఆమె నుంచి సేకరించారు. ఏయే బ్యాంకుల్లో అకౌంట్లు ఉన్నాయన్న వివరాలను కూడా తీసుకున్నారు. విష్ణుప్రియ మొబైల్​ ఫోన్‌ను సీజ్​ చేశారు.

Also Read- Prakash Raj: పోలీస్ డిపార్ట్‌మెంట్ నుంచి నాకు ఎటువంటి నోటీసు రాలేదు.. వస్తే చెబుతా!

మధ్యాహ్నం 3 గంటలకు…
ఇదిలా ఉండగా మధ్యాహ్నం 3గంటల సమయంలో రీతూ చౌదరి పోలీస్​ స్టేషన్‌కు వచ్చింది. ఎవ్వరితో మాట్లాడకుండా నేరుగా పోలీస్​ స్టేషన్​ లోపలికి వెళ్లిపోయింది. విష్ణుప్రియకు సంధించిన ప్రశ్నలనే రీతూ చౌదరిని కూడా అడిగినట్టు సమాచారం. బెట్టింగ్​ యాప్​‌లను ప్రమోట్​ చేయటం చట్టరీత్యా నేరమన్న విషయం తనకు తెలియదని రీతూ చౌదరి పోలీసులతో అన్నట్టుగా తెలియవచ్చింది. కేసులు నమోదైన తరువాత ఆ విషయం తెలిసిందని చెప్పినట్టు సమాచారం. ఆ వెంటనే తెలియక బెట్టింగ్​ యాప్‌ను ప్రమోట్​ చేశానని.. తనను క్షమించాలని కోరుతూ వీడియో చేసి తన సోషల్​ అకౌంట్లలో పోస్ట్​ చేసినట్టుగా చెప్పిందని తెలిసింది. దాంతోపాటు బెట్టింగ్​ యాప్​‌లలో ఎవ్వరూ డబ్బులు పెట్టవద్దని కోరినట్టు చెప్పిందని సమాచారం. రీతూ చౌదరి వేర్వేరు బెట్టింగ్​ యాప్​‌లను ప్రమోట్​ చేసిన నేపథ్యంలో పోలీసులు ఆయా యాప్‌ల వివరాలను సేకరించినట్టు తెలిసింది. ఆయా యాప్​‌ల నుంచి ఎవరు సంప్రదించారు? అన్న ప్రశ్నకు మాత్రం రీతూ చౌదరి నుంచి స్పష్టమైన జవాబు రాలేదని సమాచారం. అయితే, యాప్‌లను ప్రమోట్​ చేసినందుకు యాప్‌ల నిర్వాహకులు నెల నెలా డబ్బు ఇచ్చినట్టుగా ఆమె చెప్పినట్లుగా తెలిసింది.

వీళ్లు రావాల్సి ఉంది…
ఇదే కేసులో నిందితులుగా ఉన్న ఇమ్రాన్​ ఖాన్​, హర్ష సాయి, యాంకర్​ శ్యామల, బండారు శేశయని సుప్రిత, కిరణ్​ గౌడ్​, అజయ్​, సన్నీ, సుధీర్​ లు పోలీసుల విచారణకు హాజరు కావాల్సి ఉంది. వీరిలో ఇమ్రాన్​ ఖాన్​, హర్ష సాయి దేశం విడిచి పరారైనట్టుగా పోలీసులు తెలిపారు. ఈ ఇద్దరు దుబాయ్​ లేదా బ్యాంకాక్ పోయినట్టుగా అనుమానిస్తున్నారు. ఇక, నోటీసులు అందుకున్న యాంకర్​ శ్యామల తాను షూటింగులో ఉన్నందున గడువు కావాలని అడిగినట్టు సమాచారం.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Donald Trump: భారత్‌పై ట్రంప్ యూటర్న్.. మోదీ ఎప్పటికీ ఫ్రెండే అంటూ.. దగ్గరయ్యేందుకు తాపత్రయం!

SIIMA Awards 2025: సైమా 2025 విజేతలు ఎవరంటే?.. ఖుషీ అవుతున్న ఆ హీరోల ఫ్యాన్స్

Telangana Jagruthi: తెలంగాణ జాగృతి సంస్థ నాయకులు ఫైర్.. కారణం అదేనా..?

Crime News: తీరుమారని గంజాయి పెడ్లర్ పై పీడీ యాక్ట్.. ఉత్తర్వులు జారీ!

Crime News: హైదరాబాద్‌లో దారుణం.. మార్ఫింగ్ ఫోటోలతో యవతికి బెదిరింపులు