తెలంగాణ బ్యూరో, స్వేచ్ఛ: New Liquor Brands: తెలంగాణలో లేని కొత్త విదేశీ, దేశీయ బ్రాండ్లను అమ్ముకోవటానికి దరఖాస్తు చేసుకోవచ్చంటూ ఇటీవలే ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. మార్చి 15వ తేదీ వరకు ఆయా కంపెనీలు అప్లికేషన్లు పెట్టుకోవాలని ఎక్సయిజ్ అధికారులు సూచించారు. అయితే, కంపెనీల అభ్యర్థనలతో ఈ గడువును ఏప్రిల్ 2వ తేదీ వరకు గడువును పెంచారు.
Also read: Hyderabad News: వెళ్తున్న కారులో మంటలు.. షార్ట్ సర్క్యూట్ కారణమా?
తెలంగాణలో లేని బ్రాండ్లను విక్రయించాలనుకునే కంపెనీలు దరఖాస్తు చేసుకోవాలని ఇటీవల ప్రకటించిన నేపథ్యంలో 39 కంపెనీలు స్పందించాయి. అయితే, టీజీబీసీఎల్ లో రిజిష్టర్ కాని ఈ కొత్త కంపెనీలు ఇతర రాష్ర్టాల్లో జరుపుతున్న తమ మద్యానికి సంబంధించి నాణ్యతా ప్రమాణాలు, ఆయా బ్రాండ్లపై ఎలాంటి ఆరోపణలు లేవని నిర్ధారణ సర్టిఫికెట్లను దరఖాస్తుకు జత చేయాలని ఎక్సయిజ్ అధికారులు పేర్కొన్నారు.
ఈ సర్టిఫికెట్లను జత చేయటంలో మరికొంత సమయం పడుతుందని చెప్పిన ఆయా కంపెనీలు గడువును పెంచాలని కోరాయి. ఈ క్రమంలోనే దరఖాస్తుల గడువును ఏప్రిల్ 2వ తేదీ వరకు పెంచుతున్నట్టు ప్రొహిబిషన్, ఎక్సయిజ్ కమిషనర్ చెవ్యూరు హరికిరణ్ తెలిపారు.
Also read: Social Media Influencers: బెట్టింగ్ భూతం.. అసలు సూత్రధారులెవరు? వీరు నోరు విప్పేనా?