Notice to Pochampally Srinivas (image credit:canva)
Politics

Notice to Pochampally Srinivas: బీఆర్ఎస్ ఎమ్మెల్సీకి మళ్లీ నోటీసులు.. విచారణకు రానున్నారా?

తెలంగాణ బ్యూరో, స్వేచ్ఛ: Notice to Pochampally Srinivas:  ఫార్మ్ హౌస్​ కేసులో మొయినాబాద్​ పోలీసులు మరోసారి బీఆర్​ఎస్​ వరంగల్​ ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్​ రెడ్డికి బీఎన్​ఎస్​ సబ్​ సెక్షన్​ (2) ఆఫ్​ సెక్షన్​ 35 ప్రకారం నోటీసులు జారీ చేశారు. విచారణకు వ్యక్తిగతంగా హాజరు కావాలని నోటీసులో పేర్కొన్నారు.మొయినాబాద్​ ప్రాంతంలోని తోల్​ కట్ట గ్రామంలో ఉన్న ఓ ఫార్మ్​ హౌస్​ లో కోళ్ల పందాలు, క్యాసినో జూదం నడుస్తున్నట్టు అందిన సమాచారం మేరకు గతనెలలో రాజేంద్రనగర్​ ఎస్వోటీ సిబ్బంది మొయినాబాద్​ పోలీసులతో కలిసి దాడులు జరిపిన విషయం తెలిసిందే.

ఈ క్రమంలో కోళ్ల పందాలు, క్యాసినో ఆడుతున్న 64మందిని పోలీసులు అరెస్ట్​ చేశారు. వీరి నుంచి పందెం కోళ్ల కాళ్లకు కట్టే 46 కత్తులు, 84 కోళ్లను స్వాధీనం చేసుకున్నారు. దాంతోపాటు కోటి రూపాయలకు పైగా విలువ చేసే క్యాసినో కాయిన్లు, కార్డులు, పేక ముక్కలను సీజ్​ చేశారు. 55 లగ్జరీ కార్లు, 64 స్మార్ట్​ ఫోన్లను కూడా స్వాధీనం చేసుకున్నారు. ఇక, జూదం ఆడుతూ పట్టుబడ్డ వారి నుంచి 30లక్షల 59వేల 620 రూపాయలను స్వాధీనం చేసుకున్నారు.

విచారణలో ఈ ఫార్మ్​ హౌస్​ బీఆర్​ఎస్​ ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్​ రెడ్డిదని వెల్లడైంది. తూర్పు గోదావరి జిల్లాకు చెందిన భూపతిరాజు శివకుమార్​ వర్మ దీంట్లో జూద కార్యకలాపాలు నడిపిస్తున్నట్టుగా తేలటంతో అతన్ని పోలీసులు అరెస్ట్​ చేశారు. విచారణలో ఎమ్మెల్సీ ఫార్మ్​ హౌస్​ కాబట్టి పోలీసుల దాడులు ఉండవని చెప్పి సదరు శివకుమార్​ వర్మ ఆంధ్ర ప్రాంతం నుంచి బడా వ్యాపారులు, డాక్టర్లు, పారిశ్రామిక వేత్తలను కార్లలో ఇక్కడికి పిలిపించుకుని కొన్ని నెలలుగా కోళ్ల పందాలు జరుపుతుండటంతోపాటు క్యాసినో నిర్వహిస్తున్నట్టుగా వెల్లడైంది.

తెలిసే జరిగాయా…?
ఇక, ఫార్మ్​ హౌస్​ లో కోళ్ల పందాల నిర్వహణ, క్యాసినో దందా ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్​ రెడ్డికి తెలిసే జరిగాయన్న అనుమానాలు ముందు నుంచి ఉన్నాయి. ఫార్మ్ హౌస్​ లో ఇంత పెద్ద మొత్తంలో జూదం జరుగుతోందంటే యజమానికి తెలిసే ఈ వ్యవహారం నడిచి ఉండవచ్చని పోలీసు అధికారులు అంటున్నారు. ఈ క్రమంలోనే మొయినాబాద్​ పోలీసులు బీఆర్​ఎస్​ ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్​ రెడ్డికి గత నెలలో బీఎన్​ఎస్​ సెక్షన్​ 35 (1) ప్రకారం నోటీసులు జారీ చేశారు. కోళ్ల పందాలను నిర్వహించిన నేపథ్యంలో ఇప్పటికే గేమింగ్​ యాక్ట్​ సెక్షన్​ 3,4, క్రూయాలిటీ టు యానిమల్స్​ యాక్ట్​ సెక్షన్​ 11 ప్రకారం ఇప్పటికే కేసులు నమోదు చేసినట్టు అందులో పేర్కొన్నారు. తగు డాక్యుమెంట్లు ఇతర ఆధారాలతో వచ్చి నోటీసు అందుకున్న నాలుగు రోజుల్లో వివరణ ఇవ్వాలని సూచించారు.

ఎమ్మెల్సీ వివరణ…
దీనిపై ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్​ రెడ్డి తన న్యాయవాదుల ద్వారా పోలీసులక వివరణ పంపించారు. ఫార్మ్​ హౌస్​ తనదే అయినా దానికి సంబంధించిన అన్నివ్యవహారాలను తన మేనల్లుడు జ్ఞాన్​ దేవ్​ రెడ్డికి అప్పజెప్పినట్టు వివరణలో పేర్కొన్నారు. పోలీసుల దాడి తరువాత జ్ఞాన్​ దేవ్ రెడ్డిని అడిగితే ఫార్మ్​ హౌస్​ ను వర్రా రమేశ్​ కుమార్​ రెడ్డి అనే వ్యక్తికి లీజుకిచ్చినట్టుగా తెలిసిందన్నారు. రమేశ్​ కుమార్​ రెడ్డి ఫార్మ్ హౌస్​ ను మరో వ్యక్తికి లీజుకిచ్చినట్టుగా తెలియవచ్చిందన్నారు.

రెండో నోటీసు…
అయితే, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్​ రెడ్డి ఇచ్చిన వివరణ సమగ్రంగా లేకపోవటంతో మొయినాబాద్​ పోలీసులు తాజాగా గురువారం ఆయనకు మరోసారి నోటీసులు జారీ చేశారు. హైటెక్​ సిటీలోని అపర్ణ ఆర్చిడ్​ లోని ఎమ్మెల్సీ ఇంటికి ఎస్సై ముజఫిర్​ సిబ్బందితో కలిసి వెళ్లారు. పోచంపల్లి శ్రీనివాస్​ రెడ్డి ఇంట్లో లేరని ఆయన వద్ద పని చేస్తున్న సిబ్బంది చెప్పారు. దాంతో నోటీసును ఎమ్మెల్సీ వద్ద పని చేస్తున్న ఉద్యోగికి అందచేసిన ఎస్సై ముజఫిర్​ ఆ విషయాన్ని పోచంపల్లి శ్రీనివాస్​ రెడ్డికి ఫోన్​ ద్వారా తెలిపారు. శుక్రవారం ఉదయం 10గంటల నుంచి సాయంత్రం 5గంటల లోపు వ్యక్తిగతంగా మొయినాబాద్​ పోలీస్​ స్టేషన్​ కు వచ్చి విచారణకు హాజరు కావాలని సూచించారు. దీనిపై ఎస్సై ముజఫిర్​ తో మాట్లాడగా ఎమ్మెల్సీ శ్రీనివాస్​ రెడ్డి మొదటి నోటీసుకు ఇచ్చిన వివరణలో పలు సందేహాలు ఉన్నట్టు చెప్పారు. వాటిని నివృత్తి చేసుకోవటానికే రెండోసారి నోటీసులు జారీ చేసినట్టు తెలిపారు.

Just In

01

Bhatti Vikramarka: విద్యారంగం పై ఊహించని రీతిలో సర్కారు పెట్టుబడులు

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ గురించి బ్లాక్ బస్టర్ న్యూస్ చెప్పిన దేవీ శ్రీ ప్రసాద్..

Telangana Politics: కాంగ్రెస్‌లో ఉత్కంఠం.. ఏఐసీసీలో కవిత ఎపిసోడ్..?

Harish Rao: పాలకులే నెగిటివ్ మైండ్ సెట్.. అభివృద్ధి ఎలా సాధ్యం..?

Ashish Warang death: ప్రముఖ నటుడు కన్నుమూత.. సోకసంద్రంలో ఇండస్ట్రీ