Krmb : | సరిపడా నీరు లేదు.. జాగ్రత్తగా వాడుకోవాలి: కేఆర్ ఎంబీ
Krmb
Uncategorized

Krmb : సరిపడా నీరు లేదు.. జాగ్రత్తగా వాడుకోవాలి: కేఆర్ ఎంబీ

Krmb : కృష్ణా నది జలాల నీటి పంపకాలపై గురువారం కేఆర్ ఎంబీతో రెండు తెలుగు రాష్ట్రాల ఉన్నతాధికారులు సమావేశం అయ్యారు. ఇందులో కేఆర్ ఎంబీ చైర్మన్ అతుల్ జైన్ కీలక వ్యాఖ్యలు చేశారు. రెండు తెలుగు రాష్ట్రాలు తాగునీటి వినియోగానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. ఎందుకంటే శ్రీశైలం, నాగార్జున సాగర్ (Nagarjuna Sagar) లలో తెలుగు రాష్ట్రాలు కోరినంత నీరు లేదని స్పష్టం చేశారు. కనీస వినియోగ మట్టానికి పైన 60టీఎంసీల నీరు మాత్రమే ఉందని అతుల్ జైన్ తెలిపారు.

తెలంగాణ 63 టీఎంసీలు, ఆంధ్రప్రదేశ్ 55 టీఎంసీలు కావాలని కోరాయి. కానీ అంత నీరు మాత్రం రెండు ప్రాజెక్టుల్లో లేవు. కాబట్టి వీటిని కాపాడుకుంటూ మే నెల వరకు వినియోగించుకోవాలన్నారు. తెలంగాణ నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రాహుల్ బొజ్జా, ఈఎన్సీ అనిల్ కుమార్, ఏపీ నీటిపారుదల ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సాయి ప్రసాద్, ఈఎన్సీ వెంకటేశ్వర్లు సమావేశానికి హాజరు అయ్యారు. ఇప్పటికే రెండు సార్లు వాయిదా పడ్డ ఈ సమావేశం ఎట్టకేలకు గురువారం నిర్వహించారు.

Just In

01

Premante OTT Release: ప్రియదర్శి ‘ప్రేమంటే’ ఓటీటీ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

VH Hanumantha Rao: బీసీ రిజర్వేషన్లపై.. బీజేపీ ఓబీసీ ఎంపీలు మౌనమేల: వీహెచ్ ఫైర్

Lipstick: మీ స్కిన్ టోన్‌కి అద్భుతంగా కనిపించే లిప్ స్టిక్ షేడ్స్.. డే-టు-డే నుండి పార్టీ లుక్ వరకు

New Year Party: న్యూ ఇయర్ వేడుకల్లో డ్రగ్స్.. నగరానికి చేరుస్తున్న పెడ్లర్లు డెడ్​ డ్రాప్​ పద్దతిలో..!

Nagababu Politics: అక్కడ ఫోకస్ పెట్టేందుకు ప్రత్యక్ష రాజకీయాల్లో ఫోకస్ తగ్గించుకుంటున్న మెగా బ్రదర్..