Uttam Kumar Reddy
తెలంగాణ

Uttam Kumar Reddy : దేశంలో బీజేపీ అన్ని విధాలుగా అణచివేస్తోంది.. మంత్రి ఉత్తమ్ ఫైర్..!

Uttam Kumar Reddy : మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కేంద్ర ప్రభుత్వం మీద ఫైర్ అయ్యారు. కేంద్రంలో ఉన్న బీజేపీ (Bjp) ప్రభుత్వం అన్ని వర్గాలను ప్రశ్నించకుండా అణచివేస్తోందంటూ చెప్పుకొచ్చాడు. గాంధీభవన్ లో ఏర్పాటు చేసిన పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడారు. బీజేపీ ధోరణి దేశాన్ని వెనక్కు తీసుకెళ్తోందంటూ మండిపడ్డారు. తెలంగాణకు కేంద్రం చేసిందేమీ లేదని.. అడిగితే అణచివేసే కుట్రలు చేస్తోందంటూ మండిపడ్డారు. దేశానికి స్వాతంత్య్రం తీసుకొచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీదే నని.. ఇప్పుడొచ్చిన బీజేపీ అసలు దేశానికి ఏం చేసిందో చెప్పాలంటూ డిమాండ్ చేశారు.

కాంగ్రెస్ (Congress) పార్టీ దేశ నిర్మాణంలో ఉందని.. బీజేపీ మాత్రం ప్రశ్నించే వారిని వేధిస్తుందంటూ మండిపడ్డారు. ఇప్పుడు జై భీమ్, జై బాపు నినాదాలు చాలా అవసరం అని.. దేశ ప్రజలంతా కలిసి బీజేపీని ఓడించాల్సిన సమయం వచ్చిందంటూ చెప్పుకొచ్చారు. తెలంగాణలో చేసిన కులగణనకు కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని.. దాని వల్ల వెనకబడిన వర్గాలకు మేలు జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన అతికొద్ది రోజుల్లోనే చాలా స్కీములు వర్తింపజేశామని.. త్వరలోనే మరిన్ని పథకాలు అమలు చేస్తామన్నారు.

 

Just In

01

Turakapalem Village: ఎవరూ వంట చేసుకోవద్దు.. కనీసం నీళ్లూ తాగొద్దు.. ప్రభుత్వం ఆదేశాలు

Ponguleti Srinivasa Reddy: త్వరలో సాదాబైనామాలకు మోక్షం.. మంత్రి కీలక వ్యాఖ్యలు

Su From So OTT release: ‘ఓటీటీలోకి వచ్చేస్తున్న కామెడీ థ్రిల్లర్.. ఎక్కడంటే?

BRS Party: గులాబీ పార్టీకి డ్యామేజ్.. కంట్రోల్ చేసేందుకు ప్రయత్నం?.. సాధ్యపడేనా..?

Ganesh Nimajjanam 2025: అయ్యో గణపయ్య ఎంత ఘోరం.. నిమజ్జనం చేస్తుండగా.. కింద పడ్డ విగ్రహాలు