Compensation to Farmers: వడగండ్ల దెబ్బకు ఇంత నష్టమా? పరిహారంపై ప్రభుత్వం ఏం చెప్పిందంటే?
Compensation to Farmers (imagecredit:twitter)
Telangana News

Compensation to Farmers: వడగండ్ల దెబ్బకు ఇంత నష్టమా? పరిహారంపై ప్రభుత్వం ఏం చెప్పిందంటే?

తెలంగాణ బ్యూరో స్వేచ్ఛ: Compensation to Farmers: ప్రభుత్వానికి వర్షానికి పంటనష్టంపై సోమవారం ప్రాధమిక రిపోర్టు అందింది. రాష్ట్రంలో దాదాపు 13 జిల్లాల్లోని 64 మండలాలలో 11,298 ఎకరాలలో నష్టం జరిగినట్లు అంచనా అధికారులు పంపారు. దెబ్బతిన్న పంటల్లో 6670 ఎకరాలలో వరి, 4100 ఎకరాలలో మొక్కజొన్న, 309 ఎకరాలలో మామిడి, మిగలినవి ఇతర పంటలు ఉన్నాయి.

మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు మాట్లాడుతూ అకాల వర్షాలు, వడగళ్ల వానకు పంటనష్టం జరిగిన రైతులకు పరిహారం అందజేస్తామని స్పష్టం చేశారు. అధికారులు ఈ నెల 21 నుంచి 23 వరకు కురిసిన వర్షానికి జరిగిన నష్టంపై సర్వే చేస్తున్నారన్నారు. ఇప్పటికే ప్రాధమిక నివేదిక అందిందని తెలిపారు. వర్షానికి పంట నష్టంపై సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి సైతం తీసుకెళ్లినట్లు వెల్లడించారు.

అన్ని జిల్లా కలెక్టర్లకు పంటనష్ట వివరాలు సేకరించాలని ఆదేశాలు ఇచ్చామన్నారు. నష్టపోయిన రైతులను ఆదుకునే విధంగా రైతు వారీగా సర్వే చేసి తుది నివేదిక రూపొందించాలని వ్యవసాయ అధికారులకు సైతం సూచించినట్లు వెల్లడించారు. పంటనష్టంపై పూర్తి నివేదిక అందగానే నష్టపరిహారం చెల్లింపునకు చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

Also Read: Komatireddy Venkat Reddy: రైతులకు అదిరిపోయే గుడ్ న్యూస్.. బోనస్ కొనసాగింపు

Just In

01

S Thaman: సినిమా ఇండస్ట్రీలో యూనిటీ లేదు.. టాలీవుడ్‌పై థమన్ ఫైర్

The Raja Saab: ఈసారి బ్యూటీఫుల్ మెలోడీతో.. ప్రోమో చూశారా!

Bigg Boss Buzzz: అబద్దం చెప్పమన్నా చెప్పను.. శివాజీకి షాకిచ్చిన సుమన్ శెట్టి!

Aswini Dutt: 50 సంవత్సరాల వైజయంతి ప్రయాణం.. నిర్మాత అశ్వినీదత్ ఎమోషనల్ లెటర్..!

Dharamshala T20: ధర్మశాల టీ20లో దక్షిణాఫ్రికాపై భారత్ గెలుపు..