Sravan Rao (imagecredit:twitter)
తెలంగాణ

Sravan Rao: శ్రవణ్ రావును విచారించిన సీసీఎస్​ పోలీసులు..!

Sravan Rao: ఛీటింగ్ కేసులో అరెస్టయిన శ్రవణ్​ రావును సీసీఎస్​ అధికారులు కస్టడీకి తీసుకుని విచారణ జరిపారు. ముడి ఇనుప ఖనిజం డీల్​పేర మోసం చేసి వసూలు చేసిన 6.58 కోట్ల రూపాయలను ఏయే కంపెనీలకు మళ్లించారు? అన్నదానిపై ప్రశ్నించారు. టన్నుకు 300 రూపాయల లాభం వచ్చేలా చూస్తానని చెప్పి తమ కంపెనీ నుంచి 6.58 కోట్ల రూపాయలకు పైగా తీసుకుని శ్రవణ్​ రావు మోసం చేశాడంటూ ఇటీవల అఖండ ఇన్ఫ్రాటెక్​ కంపెనీ డైరెక్టర్ ఆకర్ష్ కృష్ణ సీసీఎస్​పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఫోన్​ట్యాపింగ్ కేసులో నిందితునిగా చేర్చగానే శ్రవణ్​రావు విదేశాలకు పారిపోయాడని ఆకర్ష్​కృష్ణ తన ఫిర్యాదులో పేర్కొన్నారు.

సంప్రదించటానికి ఎన్నిమార్లు ప్రయత్నించినా శ్రవణ్ రావు అందుబాటులోకి రాలేదన్నారు. ఈ ఫిర్యాదు మేరకు సీసీఎస్​పోలీసులు శ్రవణ్​రావుతోపాటు అతని భార్య స్వాతి రావు, వ్యాపార భాగస్వాములు ఉమా మహేశ్వర్ రెడ్డి, వేదమూర్తిలపై కేసులు నమోదు చేశారు. ఈ నెల 13న శ్రవణ్​ రావును అరెస్ట్​చేశారు. కాగా, ఈ కేసులో మరిన్ని అంశాలపై విచారణ జరపాల్సిన అవసరం ఉందని పేర్కొంటూ శ్రవణ్​రావును అయిదు రోజులపాటు కస్టడీకి అనుమతించాలని ఇటీవల సీసీఎస్ పోలీసులు కోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై విచారణ జరిపిన కోర్టు ఒక్క రోజు కస్టడీకి అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ క్రమంలో శుక్రవారం ఉదయం సీసీఎస్​ అధికారుల బృందం చెంచల్​గూడ జైలుకు వెళ్లి శ్రవణ్​రావును కస్టడీకి తీసుకుంది. అనంతరం వైద్య పరీక్షలు జరిపించి సీసీఎస్ కు తీసుకొచ్చింది.

Also Read: KTR on CM Revanth: సీఎం రేవంత్‌కు ఆ వ్యాధి ఉంది.. కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు

చెంచల్ గూడ జైలుకు తరలింపు

ఇనుప ముడి ఖనిజం డీల్ పేర ఆకర్ష్​ కృష్ణ నుంచి తీసుకున్న 6.58 కోట్ల రూపాయల విషయమై సీసీఎస్​ అధికారులు శ్రవణ్​ రావును ప్రశ్నించినట్టుగా తెలిసింది. ఈ డబ్బును ఏదైనా కంపెనీలకు మళ్లించారా? అని అడిగినట్టు సమాచారం. శ్రవణ్​ రావుకు ఏయే బ్యాంకుల్లో ఖాతాలున్నాయి? అని అడగటంతోపాటు వాటి లావాదేవీల గురించి ప్రశ్నించినట్టు తెలిసింది. ఇక, ఈ వ్యవహారంలో స్వాతి రావు, ఉమా మహేశ్వర్​ రెడ్డి, వేదమూర్తిల పాత్ర గురించి అడిగినట్టు తెలియవచ్చింది.

కర్ణాటక సండూర్‌లో ఉన్న ఓ కంపెనీ పేర డబ్బు తీసుకున్న నేపథ్యంలో ఆ కంపెనీతో శ్రవణ్ రావుకు ఉన్న సంబంధంపై కూడా ఆరా తీసినట్టు సమాచారం. కాగా, శ్రవణ్​ రావు కొన్ని ప్రశ్నలకు జవాబులు ఇవ్వలేదని తెలిసింది. కోర్టు ఇచ్చిన గడువు సాయంత్రానికి ముగియటంతో మరోసారి శ్రవణ్ రావుకు వైద్య పరీక్షలు జరిపించిన సీసీఎస్ అధికారులు ఆ తరువాత కోర్టులో హాజరు పరిచారు. కోర్టు ఆదేశాలతో చెంచల్ గూడ జైలుకు తరలించారు. కాగా, ఈ కేసులో నిందితులుగా ఉన్న శ్రవణ్​ రావు భార్య స్వాతి రావు, ఉమా మహేశ్వర్ రెడ్డి, వేదమూర్తిల అరెస్టుకు సీసీఎస్​ అధికారులు రంగం సిద్ధం చేసినట్టుగా తెలియవచ్చింది.

Also Read: Kamal Haasan: ఇలాంటి సినిమా మళ్లీ మళ్లీ రాదు.. ఇది నా ప్రామిస్!

 

Just In

01

Ganesh Nimajjanam 2025: అయ్యో గణపయ్య ఎంత ఘోరం.. నిమజ్జనం చేస్తుండగా.. కింద పడ్డ విగ్రహాలు

Bhatti Vikramarka: విద్యారంగం పై ఊహించని రీతిలో సర్కారు పెట్టుబడులు

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ గురించి బ్లాక్ బస్టర్ న్యూస్ చెప్పిన దేవీ శ్రీ ప్రసాద్..

Telangana Politics: కాంగ్రెస్‌లో ఉత్కంఠం.. ఏఐసీసీలో కవిత ఎపిసోడ్..?

Harish Rao: పాలకులే నెగిటివ్ మైండ్ సెట్.. అభివృద్ధి ఎలా సాధ్యం..?