TG Inter Board
తెలంగాణ

TG Inter Board | ఇంటర్ బోర్డు కీలక నిర్ణయం.. తమ ‘కంట్రోల్’ లోకి ప్రాక్టికల్స్

తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు (TG Inter Board) కీలక నిర్ణయం తీసుకుంది. బోర్డు ఆఫ్ ఇంటర్మీడియట్ నాంపల్లి కేంద్రంలో కంట్రోల్ రూం ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఇకపై ప్రాక్టికల్ పరీక్షలు ఏ విధంగా జరుగుతున్నాయో కంట్రోల్ రూం నుంచే పర్యవేక్షించనుంది. ప్రైవేట్ కాలేజీల్లో ప్రాక్టికల్ ఎగ్జామ్స్ నిర్వహణపై ఆరోపణలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.

రాష్ట్రంలో నాలుగు దశల్లో ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ పరీక్షలు జరగనున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 2008 ప్రాక్టికల్స్ పరీక్షా కేంద్రాలు ఉన్నాయి. మొదటి దశగా 850 కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నారు. ఒక్కో పరీక్ష కేంద్రంలో 3 సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నారు. గతంలో ప్రాక్టికల్ పరీక్షల్లో ప్రైవేట్ కాలేజీల విద్యార్థులు ప్రాక్టికల్స్ చేయకున్నా మార్కులు వేస్తున్నారు అని ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని ఇంటర్ బోర్డు నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. సీసీ కెమెరాలు ఏర్పాటు వల్ల పేపర్ లీక్ అయ్యే అవకాశాలు కూడా ఉండవు అని బోర్డు భావిస్తోంది.

 

Just In

01

CCI Cotton Procurement: పత్తి కొనుగోళ్లలో అవకతవకలు జరగొద్దు.. పినపాక ఎమ్మెల్యే

Kavitha Janam Bata: కేసీఆర్‌కు ఆ అవసరం లేదు.. నిజామాబాద్ ప్రెస్‌మీట్‌లో కవిత ఆసక్తికర వ్యాఖ్యలు

Kurnool Bus Accident: కర్నూలు బస్సు ప్రమాద ఘటనలో ట్విస్ట్.. చనిపోయిన వ్యక్తిపై కేసు.. ఏం జరగబోతోంది?

Drinking Culture: మందు బాబులు మద్యం సేవించిన తర్వాత ఎందుకు ఎక్కువగా తింటారో తెలుసా?

Bigg Boss Telugu 9: సంజన నోటికి లాక్.. క్లౌడ్ గేమ్ షురూ.. మేఘం వర్షిస్తేనే సేఫ్, లేదంటే?