Damodar Rajanarasimha: రాష్ట్రంలో ఈ ఏడాదిలో‌ 4 కొత్త హాస్పిటల్స్!
Damodar Rajanarasimha (imagecredit:swetcha)
Telangana News

Damodar Rajanarasimha: రాష్ట్రంలో కొత్త ఏడాదిలో‌ 4 కొత్త హాస్పిటల్స్: మంత్రి దామోదర రాజనర్సింహ

Damodar Rajanarasimha: దశాబ్దాల ఉస్మానియా నూతన హాస్పిటల్‌ ఆకాంక్షను 2025లో నెరవేర్చుకున్నామని మంత్రి దామోదర రాజనర్సింహ(Minister Dhamodhara Rajanarasimha) గుర్తు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా పలు మెడికల్ కాలేజీలు, టీచింగ్ ఆసుపత్రులకు కొత్త భవనాలను నిర్మించుకున్నామన్నారు. 2026లో 4 కొత్త మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్‌ను ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తామని ఆయన వెల్లడించారు. గుండె, కిడ్నీ జబ్బులు, కేన్సర్ వంటి మొండి వ్యాధులకు సైతం పేదలు పైసా ఖర్చు లేకుండా కార్పొరేట్ స్థాయి వైద్యం పొందేలా ఈ ఆసుపత్రులను తీర్చిదిద్దుతున్నామని తెలిపారు. మెడికల్ కాలేజీలు, టీచింగ్ హాస్పిటళ్లలో అన్ని సౌకర్యాలు అందుబాటులోకి తీసుకొచ్చి వైద్య విద్య వ్యవస్థను మరింత బలోపేతం చేస్తామని మంత్రి బుధవారం ప్రత్యేకంగా పేర్కొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు మంత్రి దామోదర్ రాజనర్సింహ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.

Also Read: The RajaSaab: ‘ది రాజాసాబ్’ క్లైమాక్స్ గురించి మారుతీ చెప్పింది ఇదే.. అది 70 రోజుల కష్టం..

ఎన్‌సీడీలపై ఫోకస్

2026లో నాన్ కమ్యునికెబుల్ డిసీజెస్‌ నివారణ, నియంత్రణ, చికిత్స, పాలియేటివ్ కేర్‌పై మరింత ఫోకస్ చేస్తామని మంత్రి వెల్లడించారు. ఇప్పటికే ఎన్‌సీడీసీ క్లినిక్స్, డే కేర్ కేన్సర్ క్లినిక్స్ ద్వారా గ్రామాల సమీపంలోకి వైద్య సేవలను తీసుకెళ్లామని మంత్రి గుర్తు చేశారు. రోడ్డు ప్రమాదాలు, ఇతర అత్యవసర పరిస్థితుల్లో ప్రజల ప్రాణాలు కాపాడేందుకు ఎమర్జెన్సీ మెడికల్ సర్వీసెస్‌ను విస్తృతం చేస్తున్నామని, 2026లో రాష్ట్రవ్యాప్తంగా వందకుపైగా క్రిటికల్ కేర్ బ్లాక్స్, ట్రామా కేర్ సెంటర్లు అందుబాటులోకి తీసుకొస్తామని‌ మంత్రి తెలిపారు. పది నిమిషాల్లోనే ఘటన‌ స్థలానికి చేరుకుని వైద్య సేవలు ప్రారంభించేలా ‘108 అంబులెన్స్’ సర్వీసెస్‌ను ఎక్స్‌పాండ్‌ చేస్తున్నామని మంత్రి వెల్లడించారు. ప్రభుత్వ హాస్పిటళ్లను పరిశుభ్రంగా ఉంచుకోవాల్సిన బాధ్యత ప్రజలందరిది అని మంత్రి పేర్కొన్నారు. దేవాలయాలకు వెళ్లినప్పుడు ఎంత శుభ్రతను పాటిస్తామో, అదే విధంగా ప్రభుత్వ దవాఖాన్లకు కాపాడుకుందామని మంత్రి పిలుపినిచ్చారు‌.

Also Read: Shocking Incident: రూ.50 పందెం కోసం.. పెన్ను మింగిన విద్యార్థి.. మూడేళ్ల తర్వాత చూస్తే..

Just In

01

Harish Rao: జర్నలిస్టులను విడదీసే.. రెండు కార్డుల విధానం సరికాదు.. హరీష్ రావు ఆగ్రహం

Bandi Sanjay: మున్సిపల్ ఆశావాహులకు బండి సంజయ్ వార్నింగ్.. ఫోన్ చేస్తే సీట్లు రావంటూ..!

Airline Safety: విమానంలో అలాంటి పరిస్థితి.. నడవలేని స్థితిలో మహిళ, కాళ్లు కుళ్లిపోయేంతగా..

Chamala Kiran Kumar Reddy: పదేళ్లు గాడిద పళ్లు తోమారా?.. బీఆర్ఎస్‌పై ఎంపీ చామల కిరణ్ ఫైర్

Mob Attack On Hindu: బంగ్లాదేశ్‌లో మరో హిందూ వ్యక్తిపై మూకదాడి.. నిప్పు పెట్టిన వైనం