Slbc : | 8 మందిపై బురద, రాళ్లు.. విషాదాంతం
SLBC
Telangana News

Slbc : భగవంతుడా.. 8 మందిపై బురద, రాళ్లు.. విషాదాంతం..

Slbc : ఎస్ ఎల్ బీసీ టన్నెల్ (Tunnel) లో చిక్కుకున్న 8 మందిపై బురద, రాళ్లు కూరుకుపోయినట్టు తెలుస్తోంది. ఎన్డీఆర్ ఎఫ్ (Ndrf) బృందాలు జీపీఆర్ మిషిన్ తో స్కాన్ చేయగా.. మట్టిలో మూడు మీటర్ల లోపల కార్మికులు కూరుకుపోయినట్టు సమాచారం. దీనిపై ఇంకా అధికారిక ప్రకటన అయితే రాలేదు. కానీ ప్రమాదం జరిగిన చోట చుట్టూ బురద, రాళ్లు మాత్రమే పేరుకుపోయాయి. పేర్లు పెట్టి పిలిచినా సరే కార్మికుల నుంచి కనీస స్పందన లేదు. దాంతో ఆ బురదలో జీపీఆర్ మిషిన్ తో స్కాన్ చేశారు అధికారులు.

ఈ మిషిన్ ద్వారా మట్టిలో కూరుకుపోయిన మృతదేహాలను కనిపెట్టొచ్చు. కార్మికుల ప్రాణాలపై ఆశ లేకపోవడంతో చివరకు ఈ మిషిన్ ద్వారా వారి మృతదేహాలను వెలికి తీసేందుకు ప్రయత్నిస్తున్నారు అధికారులు. పెద్ద ఎత్తున పేరుకుపోయిన బురద, రాళ్లను తొలగించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. మరికొద్ది సేపట్లోనే దీనిపై ప్రకటన వచ్చే అవకాశం కూడా ఉంది. రెండు రోజుల్లో టన్నెల్ ఆపరేషన్ పూర్తి చేస్తామని ఇప్పటికే మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు. ఆయన చెప్పిన ప్రకారం రేపటితో ఆపరేషన్ పూర్తి అయిపోతుంది. రేపు సాయంత్రం వరకు వారి మృతదేహాలను బయటకు తీసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ వార్తలు బయటకు రావడంతో తీవ్ర నిరాశ వ్యక్తం చేస్తున్నారు. ఆ ఎనిమిది మంది కుటుంబాలను ఆదుకోవాలంటూ కోరుతున్నారు.

Just In

01

Maoists surrender: వనం నుంచి జనంలోకి.. నలుగురు మావోయిస్టులు లొంగుబాటు!

Allu Arjun: తమిళ దర్శకులు అల్లు అర్జున్ కోసం ఎందుకు క్యూ కడుతున్నారు?.. రీజన్ ఇదే..

Medaram Jatara 2026: మేడారంలో భారీగా ట్రాఫిక్ జామ్.. కట్టలు తెంచుకుంటున్న భక్తుల ఆగ్రహం!

Municipal Elections: కాంగ్రెస్‌కు మున్సిపల్ ఎన్నికలు టెన్షన్ .. ఈ ఫలితాలే రాజకీయ దిశను నిర్ణయిస్తాయా?

BRS Party: మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఒంటరి పోరు.. పొత్తులు లేకుండా గెలుపు సాధ్యమా?