Seethakka
తెలంగాణ

Seethakka : లక్ష మంది మహిళలతో పరేడ్ గ్రౌండ్ లో సభః మంత్రి సీతక్క

Seethakka : అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా పరేడ్ గ్రౌండ్ (Pared Ground) లో లక్ష మంది మహిళలతో సభ నిర్వహిస్తామని మంత్రి సీతక్క ప్రకటించారు. మార్చి 8న మహిళా దినోత్సవం సందర్భంగా కొత్త పథకాలను ప్రభుత్వం ప్రారంభిస్తుందని స్పష్టం చేశారు. మహిళల కోసం ఆర్జీసీ అద్దె బస్సులను సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) ప్రారంభిస్తారని.. దానికి తోడు మహిళా సంఘాలకు వడ్డీలేని రుణాలను కూడా అందజేస్తారన్నారు.

ఏడాది కాలంలో మరణించిన మహిళల కుటుంబాలకు రూ.40 కోట్ల బీమా చెక్కులను కూడా అందజేస్తారని సీతక్క తెలిపారు. 32 జిల్లాల్లో 64 వాట్ల విద్యుత్ సోలార్ ప్లాంట్లను వర్చువల్ గా సీఎం రేవంత్ ప్రారంభిస్తారని సీతక్క చెప్పుకొచ్చారు. మహిళల ఆర్థిక వృద్ధి కోసం తమ ప్రభుత్వం అన్ని విధాలుగా స్కీములు అమలు చేస్తుందంటూ వివరించారు.

ఇందిరా గాంధీ మహిళా శక్తి పాలసీని సీఎం రేవంత్ విడుదల చేస్తారన్నారు. అలాగే అన్ని జిల్లాల్లో పెట్రోల్ బంక్ లను కూడా మహిళా సంఘాలతో ప్రారంభిస్తామని మంత్రి సీతక్క చెప్పుకొచ్చారు.

Just In

01

A Minecraft Movie Review: ఊహా ప్రపంచంలోకి వెళ్తే ఏం జరగుతుంది.. తిరిగి రావాలంటే ఏం చేయాలి?

O Cheliya movie song: ‘ఓ.. చెలియా’ సినిమా నుంచి పాటను విడుదల చేసిన మంచు మనోజ్..

Khairatabad Ganesh 2025: గంగమ్మ ఒడికి.. ఖైరతాబాద్ మహా గణపతి.. భారీగా తరలివచ్చిన భక్తులు

Ponguleti Srinivasa Reddy: అభివృద్ధి సంక్షేమాన్ని ముందుకు తీసుకెళ్లడమే మా లక్ష్యం: మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

Donald Trump: భారత్‌పై ట్రంప్ యూటర్న్.. మోదీ ఎప్పటికీ ఫ్రెండే అంటూ.. దగ్గరయ్యేందుకు తాపత్రయం!