Krmb Meeting : | కేఆర్ ఎంబీ మీటింగ్ కు ఏపీ కావాలనే రావట్లేదు
Krmb Meeting
Telangana News

Krmb Meeting : కేఆర్ ఎంబీ మీటింగ్ కు ఏపీ కావాలనే రావట్లేదు : రాహుల్ బొజ్జా

Krmb Meeting : కృష్ణా రివర్ మేనేజ్ మెంట్ బోర్డు మీటింగ్ కు ఏపీ అధికారులు మరోసారి రాకపోవడంపై రాహుల్ బొజ్జా తీవ్ర విమర్శలు గుప్పించారు. కృష్ణా నీటి పంపకాలపై కేఆర్ ఎంబీ చైర్మన్ అతుల్ జైన్ ఆధ్వర్యంలో నేడు జలసౌధలో సమావేశం నిర్వహించారు. ఈ మీటింగ్ కు తెలంగాణ నీటి పారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రాహుల్ బొజ్జా (Rahul Bojja), ఎన్ ఈసీ హాజరయ్యారు. కానీ ఏపీ అధికారులు హాజరు కాలేదు. దీంతో సమావేశాన్ని గురువారంకు వాయిదా వేశారు. ఏపీ అధికారులు రాకపోవడంపై రాహుల్ బొజ్జా అసంతృప్తి తెలిపారు.

ఉద్దేశ పూర్వకంగానే ఏపీ అధికారులు సమావేశానికి రాలేదని.. ఇప్పటికే రెండు సార్లు సమావేశం వాయిదా వేసినట్టు గుర్తు చేశారు. శ్రీశైలం, సాగర్ నీటి వాటాపై తన వాయిస్ రికార్డు చేసి కేంద్రానికి ప్రతిపాదనలు పంపాలని చెప్పుకొచ్చారు. శ్రీశైలం, నాగార్జున సాగర్ ప్రాజెక్టుల నుంచి మే నెల వరకు 63 టీఎంసీల నీళ్లు కావాలని తెలంగాణ కోరగా.. అదే మే నెల వరకు తమకు 55 టీఎంసీల నీరు కావాలని ఏపీ ప్రతిపాదనలు పంపింది. ఈ రెండు ప్రతిపాదనలపై చర్చించేందుకు సమావేశం నిర్వహించగా ఏపీ అధికారులు రెండుసార్లు హాజరు కాలేకపోయారు.

 

 

Just In

01

Maoists surrender: వనం నుంచి జనంలోకి.. నలుగురు మావోయిస్టులు లొంగుబాటు!

Allu Arjun: తమిళ దర్శకులు అల్లు అర్జున్ కోసం ఎందుకు క్యూ కడుతున్నారు?.. రీజన్ ఇదే..

Medaram Jatara 2026: మేడారంలో భారీగా ట్రాఫిక్ జామ్.. కట్టలు తెంచుకుంటున్న భక్తుల ఆగ్రహం!

Municipal Elections: కాంగ్రెస్‌కు మున్సిపల్ ఎన్నికలు టెన్షన్ .. ఈ ఫలితాలే రాజకీయ దిశను నిర్ణయిస్తాయా?

BRS Party: మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఒంటరి పోరు.. పొత్తులు లేకుండా గెలుపు సాధ్యమా?