KTR Meets Sunitha: మాగంటి సునీత నివాసానికి వెళ్లిన కేటీఆర్
KTR-Meets-Sunitha (Image source Twitter)
Telangana News, లేటెస్ట్ న్యూస్

KTR Meets Sunitha: జూబ్లీహిల్స్‌లో ఓడిన బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత నివాసానికి వెళ్లిన కేటీఆర్

KTR Meet Sunitha: జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ చేతితో ఓటమి పాలైన బీఆర్ఎస్ అభ్యర్థి, మాజీ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ సతీమణి మాగంటి సునీత నివాసానికి శనివారం ఉదయం మాజీ మంత్రి కేటీఆర్ (KTR Meets Sunitha) వెళ్లారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఉన్న ఆయన, సునీత గెలుపు కోసం శతవిధాలా ప్రయత్నించారు. నియోజకవర్గం అంతటా విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. అయినప్పటికీ ఓటమి పాలుకావడంతో ఆమెను ప్రత్యక్షంగా కలిసి కేటీఆర్ మాట్లాడారు.

జూబ్లీహిల్స్‌లోని సునీత నివాసానికివెళ్లి సునీతతో పాటు ఆమె కుటుంబ సభ్యులతో ఆయన మాట్లాడారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీ ఎన్ని దౌర్జన్యాలు, అక్రమాలు చేసినా ఎదుర్కొని నిలబడి గట్టి పోటీ ఇచ్చారంటూ సునీతను కేటీఆర్ అభినందించారు. జూబ్లీహిల్స్ పోటీ విషయంలో సునీతతో పాటు వారి పిల్లలు కూడా చక్కటి స్ఫూర్తిని, పోరాటాన్ని ప్రదర్శించారని మెచ్చుకున్నారు. రాజకీయాల్లో గెలుపు ఓటములు సహజమని, బీఆర్ఎస్ పార్టీ ఎల్లవేళలా అండగా ఉంటుందంటూ వారికి కేటీఆర్ ధైర్యం చెప్పారు. ఇందుకు సంబంధించిన వీడియోను బీఆర్ఎస్ పార్టీ ఎక్స్ వేదికగా షేర్ చేసింది. కాగా, ఇటీవలే భర్తను పోగొట్టుకొని, ఆ తర్వాత ఎన్నికల్లో ధైర్యంగా పోటీ చేసిన మహిళ అభ్యర్థిని ఈవిధంగా నివాసానికి వెళ్లి ఓదార్చడం హుందాతనంగా ఉందని బీఆర్ఎస్ అభిమానులు చెబుతున్నారు.

కార్యకర్తకు పరామర్శ

ఎన్నికల సందర్భంగా జరిగిన ఘర్షణలో గాయపడ్డ రాకేష్ అనే బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తను కేటీఆర్ పరామర్శించారు. మాగంటి సునీత, కౌశిక్ రెడ్డితో పాటు పలువురు నాయకులతో కలిసి వెళ్లి రెహ్మత్‌నగర్‌లోని కార్యకర్త నివాసానికి వెళ్లి మాట్లాడారు. అనంతరం మీడియాతో మాట్లాడారు.

 

Just In

01

Toy Gun: బొమ్మ తుపాకీతో భారీ స్కెచ్.. నగల షాప్‌లో చివరికి ఏం జరిగిందంటే?

Grok AI Misuse: 3 రోజుల్లో ఆ కంటెంట్‌ను తొలగించండి.. ‘ఎక్స్’కి కేంద్రం సంచలన నోటీసులు

Urea Supply: రైతులు క్షమించరు జాగ్రత్త.. మంత్రి తుమ్మల కీలక వ్యాఖ్యలు.. బీఆర్ఎస్‌పై ఫైర్

RTC Bus Accident: బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం… తెల్లారిన దంపతుల బతకులు

GHMC Payments: అక్రమాలకు చెక్.. బల్దియాలో నగదు చెల్లింపులు బంద్.. కమిషనర్ సంచలన ఆదేశాలు