Ktr : | దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం చేయొద్దు: కేటీఆర్
ktr
Telangana News

Ktr : దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం చేయొద్దు: కేటీఆర్

Ktr : కేంద్ర ప్రభుత్వంపై మాజీ మంత్రి కేటీఆర్ విమర్శలు గుప్పించారు. పార్లమెంట్ నియోజకవర్గాల పునర్విభజనను చేయాలని కేంద్రం భావిస్తే.. దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం చేయొద్దంటూ ఆయన కోరారు. అలా చేస్తే ఉత్తరాది రాష్ట్రాలకు మాత్రమే న్యాయం జరుగుతుందని.. దక్షిణాది రాష్ట్రాల ప్రభావం పార్లమెంట్ లో తగ్గిపోతుందని చెప్పుకొచ్చారు. గతంలో దేశ అవసరాలకు అనుగుణంగా తీసుకొచ్చిన కుటుంబ నియంత్రణను దక్షిణాది రాష్ట్రాలు బాగా అమలు చేశాయని.. కాబట్టి ఇప్పుడు జనాభాను చూసి దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం చేయొద్దంటూ కోరారు.

నియోజకవర్గాల పునర్విభజనలో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం చేయొద్దని కోరిన తమిళనాడు సీఎం స్టాలిన్ (stalin) వ్యాఖ్యలకు అనుగుణంగా కేటీఆర్ మాట్లాడారు. దేశ ఆర్థిక బలాన్ని పెంచడంలో దక్షిణాది రాష్ట్రాలు ఎప్పుడూ ముందు వరుసలోనే ఉంటాయని.. కాబట్టి దక్షిణాది రాష్ట్రాల అవసరాలను దృష్టిలో ఉంచుకుని పునర్విభజన ఉండాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏనాడూ తెలంగాణ కోసం బడ్జెట్ లో పెద్దగా కేటాయించింది ఏమీ లేదని.. ఇప్పటికైనా తెలంగాణకు న్యాయం చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

 

 

Just In

01

Geethanjali 4K: ‘శివ’ తర్వాత కింగ్ నాగ్ మరో అద్భుత క్లాసిక్ త్వరలోనే థియేటర్లలోకి!

Panchayat Elections: పంచాయతీ పోరు రెండో దశలోనూ కాంగ్రెస్ హవా.. భారీ సంఖ్యలో పంచాయతీల కైవసం

MA Yusuff Ali: దుబాయ్‌లో పబ్లిక్ బస్సెక్కిన ఇండియన్ బిలియనీర్.. వైరల్‌గా మారిన వీడియో ఇదిగో!

VC Sajjanar: న్యూ ఇయర్ ఈవెంట్​ జరుపుతున్నారా?.. అయితే అనుమతి తప్పనిసరి!

Artificial Intelligence: ఏఐ రంగంలో భారత్ సరికొత్త రికార్డు.. గ్లోబల్ ర్యాంకింగ్‌లో మూడో స్థానం